Jadcherla: కాంగ్రెస్ యువనేత అనిరుధ్ ‘ ప్రజాహిత ‘ పాదయాత్రకు సర్వం సిద్దం…

PrajahitaYatra:  జడ్చర్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ప్రజాహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఆదివారం  నవాబ్ పేట మండలం ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ లో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అనిరుధ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  జడ్చర్ల నియోజక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది.ఇక యాత్రకు సంబంధించి  శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. యాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు అనిరుధ్ దిశా నిర్దేశం చేశారు.

ఇక పాదయాత్రకు సంబంధించి అనిరుధ్ అభిమానులు రూపొందించిన ‘ నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. పల్లె పల్లెకు వస్తున్నాడో అనిరుధ్.. జెండా పట్టబుద్దయితుందో అనిరుదో సాంగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సాంగ్స్ జడ్చర్ల నియోజక వర్గం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అటు అనిరుధ్ అభిమానులు సైతం సాంగ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తగ్గేదెలా అంటూ కామెంట్ల తో రెచ్చిపోతున్నారు.

Optimized by Optimole