హైదరాబాద్: టీపీసీసీ కార్యదర్శి గజ్జెల కాంతం కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. “కేటీఆర్ లుచ్చా! జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మతి స్థిమితం కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఆయన వ్యవహారం చూస్తుంటే ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాల్సిన అవసరం ఉంది అని మండిపడ్డారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని తక్షణమే శిక్షించాలన్న ఆయన “కేటీఆర్ లాంటి వాళ్లను తీహార్ జైలుకు కాదు.. రాష్ట్ర నడిబొడ్డున ఉరితీయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు పంపేంతవరకూ ప్రజలు సహించరు. చట్టం ఎదుట ఎవరు ఉన్నా ఒక్కటే” అని హెచ్చరించారు.
కార్ రేసింగ్ స్కాంలో భారీ దోపిడీ
తెలంగాణలో కార్ రేసింగ్ పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని గజ్జెల కాంతం ఆరోపించారు. “650 కోట్ల రూపాయలు లెక్క లేకుండా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కార్ రేసింగ్ లావాదేవీలు జరిపారు. కేబినెట్ ఆమోదం, ఆర్బిఐ అనుమతి లేకుండానే నిబంధనలు తుంగలో తొక్కి లండన్ కు 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. కార్ రేసింగ్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి 40 కోట్లకు పైగా ఫండింగ్ వచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వ భూముల దోపిడీ
GHMC పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ఇష్టానుసారం ఆక్రమించుకుని లాక్కున్నారని ఆరోపించారు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని యథేచ్చగా దోచుకుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
హిరోయిన్ ను బెదిరించి పార్క్ హయత్ కి..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించారని గజ్జెల కాంతం తీవ్ర ఆరోపణలు చేశారు. “650 మంది కాంగ్రెస్ నేతలతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. జ్యువెలరీ షాపులను బెదిరించి కోట్లకు కోట్లు దండుకున్నారు. డీజీపీ, ప్రభాకర్ రావు కలిసి మావోయిస్టుల పేరిట ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారు” అని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హోదాలో కేటీఆర్ పార్క్ హయత్ హోటల్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ తో అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ప్రత్యేకంగా ఒక హీరోయిన్ ను బెదిరించి హోటల్ రూమ్ నం. 820కి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలకంగా పాల్గొన్నారని వివరించారు. కేసీఆర్ కుటుంబ దోపిడీని సినిమా సీరియల్ ఎపిసోడ్లా ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంపై ఈడీ, సీబీఐతో విస్తృతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.