Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను భయ భ్రాంతులకు గురిచేస్తుంది. అటు హిందూ సంస్థలు పిల్లల అలవాట్లపై ఓ కంట కనిపెట్టాలని తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాదులో పట్టుబడిన నయా టెర్రరిస్ట్ సంస్థ H.U.T మూలాలను తవ్వితే టెర్రర్ గ్రూప్ సరికొత్త యాంగిల్ బయటపడింది. హిందువులను ముస్లిములుగా మార్చి టెర్రర్ దాడులకు ఉపయోగించుకోవడమే వారి యాక్షన్ ప్లాన్ గా తేలింది. ఇప్పటికే ఐదుగురు హిందువులను ముస్లింలుగా మార్చి..వారికి హిందూ యువతులతో పెళ్ళి జరిపించారు.ఒక్క అమ్మాయిలనే కాదు.. అబ్బాయిలపై మతం మత్తు చల్లి టార్గెట్ చేసినట్లు మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ గుర్తించింది. మొత్తంగా భోపాల్లో ఉగ్రవాద మొక్క పెకిలిస్తే హైదరబాద్ లో డొంక కదులుతోంది.