IncTelangana :చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది: ఎంపీ కోమటి రెడ్డి

IncTelangana: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండలం ధర్వేశ్పురంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ప్రాణం పోయినా బిజెపిలోకి పోనని,ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుందని కోమటి రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ అడుగులకు మడుగుల్లుతున్న పోలీసు అధికారులను,ఇతర అధికారులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో వదలబోమని అల్టిమేటం జారీ చేశారు.ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తమకు గౌరవం ఉందని… ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని పనిచేయాలని సూచించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.ఈ దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని.. ఆ పండుగ రోజు రావణ కాష్టం మాదిరిలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దహనం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏ స్థాయిలో ఉన్న రాజకీయ జీవితం ప్రసాదించిన నల్లగొండ నియోజకవర్గాన్ని మరువనున్నారు కోమటి రెడ్డి. 6 గ్యారెంటీ స్కీములను కచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు.ఈనెల 16న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించడం జరుగుతుంది వెల్లడించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంల కరపత్రాలను ఎంపీ ఆవిష్కరించారు.

You May Have Missed

Optimized by Optimole