హైదరాబాద్: దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశలు నింపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాయాలయాల్లో పని చేస్తున్న అర్చకుల దీర్ఘకాలిక కోరికను నెరవేర్చారు. అన్ని ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంటు డైరెక్టర్ వెంకటరావు తదితర అధికారులతో అర్చక, ఉద్యోగ సంక్షేమ నిధి చెక్ ను అందజేశారు. 18 మంది ఉద్యోగులకు అర్చక సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా గ్యాట్యూటీ, మెడికల్ సాయం అందజేశారు. రూ. 32 లక్షల చెక్కును ఉద్యోగులకు మినిస్టర్ కొండా సురేఖ ఇచ్చారు. వీడివీడిగా వారికి ఆర్డర్ కాపీలు అందజేశారు. అనంతరం రిటైర్ అయిన ఉద్యోగులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… అర్చక, ఉద్యోగుల సంక్షేమం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలో గల సహాయ కమీషనర్ స్థాయి వరకు గల దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆమె చెప్పారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి ఇవ్వడం జరుగుతుందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరము చెల్లించు గ్రాట్యూటి నిర్ధారించినట్టు చెప్పారు. మరణానంతరము చెల్లించు ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లింపు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ నిధి కింద ఉద్యోగులకు…. మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు మరియు మరమ్మత్తుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుందన్నారు.
*దేవాదాయ శాఖ మంత్రి సురేఖమ్మకు రుణపడి ఉంటాం: అర్చక, ఉద్యోగులు*
ఏండ్ల తరబడి పెండింగ్ ఉన్న సమస్యను తీర్చినందుకు మంత్రి కొండా సురేఖకు ధన్యవాదాలు. మంత్రి తమకు కొండంత సాయం చేశారు. వివిథ పథకాలలో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి పథకానికి శుక్రవారం రోజున అర్చక సంక్షేమ బోర్డు ద్వారా గ్రాట్యుటీ రూ 4.00 లక్షల నుండి రూ॥8.00 లక్షలకు పెంచడం హర్షణీయం. ఈ గ్రాట్యుటీ మొత్తమును సదరు ఉద్యోగి యొక్క బ్యాంకు ఖాతాలో ఏక మొత్తములో వారి సర్వీసు కాలమునకు లోబడి చెల్లించడం చాలా సంతోషకరమన్నారు. ఎవరైనా అకాలం చనిపోతే, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ20,000/- ల నుండి రూ 30,000/- లకు పెంచడం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.