రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర కేబినెట్ మంత్రులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయులు, ఆర్ఎస్ఎస్ నేతల ఫోన్లను ఇజ్రాయెల్కు చెందిన పెగాసుస్ స్పైవేర్ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు అంతర్జాతీయ పత్రికలు ప్రచురించినట్లు వదంతులు వస్తున్నాయి. ఇది నిజమైతే.. ఆ జాబితాను తాను విడుదల చేస్తానని స్వామి ట్వీట్ చేయడంతో తీవ్ర చర్చ జరుగుతోంది.
పెగాసుస్ స్పైవేర్ ద్వారా గుర్తు తెలియని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారాన్ని తస్కరించారని 2019లో ఫేస్బుక్కు చెందిన వాట్సాప్ ఆరోపించింది.
ఏమిటీ పెగాసుస్?
ఇజ్రాయెల్లోని ఎన్ఎస్ఓ సంస్థ ప్రతినిధులు పెగాసుస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలకు మాత్రమే అందిస్తున్నారు. అయితే ఈ స్పైవేర్ను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతల ఫోన్లలో ప్రవేశపెట్టారని నిఘా వర్గాలు గుర్తించాయి.