రాజకీయ పార్టీల్లో ముదురుతున్న లోల్లులు..

telanganapolitics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో..?లేదో..? తెలియని పరిస్థితి.  ఎన్నికల నిర్వాహణ సంస్థ ‘‘ఎన్నికల సంఘం’’లో ఉలుకుపలుకు కనిపించడం  లేదు.  తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొందర పడుతున్నాయి. టీకెట్ల ప్రకటన అనంతరం బీఆర్‌ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మొదలైన లొల్లి తుమ్మల నాగేశ్వర్‌రావు వరకు పాకింది.నేటికి అధికార పార్టీ ఆశావాహుల్లో టికెట్లు రాలేదన్న…

Read Full News

సిద్దార్థ్‌ లూథ్రా గొప్ప ఫార్సీ వాక్యం పరిచయం చేసినందుకు ఆనందించాలేమో!

Nancharaiah merugumala senior journalist:(సిద్దార్థ్‌ లూథ్రా– 300 ఏళ్ల క్రితం గురు గోవిందసింగ్‌ రాసిన గొప్ప ఫార్సీ వాక్యం  పరిచయం చేసినందుకు మనం ఆనందించాలేమో!జఫర్‌ నామా గురించి తెలియని తెలుగోళ్లు ఈ పంజాబీ వకీలుకు సదా రుణపడి ఉంటారు!) ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ సీఎం, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న దిల్లీ పంజాబీ హిందూ ఖత్రీ లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా బుధవారం మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా సైట్‌ ఎక్స్‌…

Read Full News

తెలంగాణ తల్లి కోసం గొంతెత్తుదాం..

IncTelangana: సమాజంలో మీరు చూడాలనుకున్న మార్పులో ముందు మీరు పాత్రధారులు కావాలి అన్న మహాత్మ గాంధీ మాటల ప్రేరణతో యువతలో అసలైన పార్లమెంటేరియన్‌ను మేల్కొలిపే ప్రయత్నం మొదలుపెట్టామని కాంగ్రెస్ సిటిజన్ యూత్ పార్లమెంట్ వింగ్ పేర్కొంది. ఈ మార్పు, పరివర్తనలో యువతను మరింత శక్తివంతం చేసేందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్ ఒక వేదికగా మారుతుందని.. మొదటి ఎడిషన్ కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసి.. ఇప్పుడు తెలంగాణాలో 2వ ఎడిషన్ తీసుకొస్తున్నామని తెలిపింది. యంగ్ స్టేట్‌లో ఈ ఎడిషన్‌ను…

Read Full News

లోకేష్ ను కలిసిన జనసేన నేతలు..చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు….

APpolitics:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను జనసేన నేతలు  మంగళవారం రాజమహేంద్రవరంలో  పరామర్శించారు. మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, దుర్మార్గపాలనపై కలసి పోరాడుదామని జనసేన నేతలన్నారు. చంద్రబాబు అరెస్టును జనసేన తీవ్రంగా ఖండిస్తోందని .. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని..రాష్ట్రంలో జగన్ అరాచకపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టును ఖండించిన వారిపైనా వైసీపీ నేతలు  విమర్శలు చేస్తున్నారని, ఎన్నికల తర్వాత వైసీపీ భూస్థాపితం అవుతుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన బంద్ కు…

Read Full News

అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం: నాదెండ్ల మనోహర్

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ…

Read Full News

మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు..

Nancharaiah merugumala senior journalist: _ మన గొప్ప తెలుగోళ్లందరికీ ఉత్తరాది (పంజాబీ, పార్సీ, సింధీ) లాయర్లే దిక్కు  _ దక్షిణాదికి ఏదో హిందీవాళ్లు అన్యాయం చేస్తున్నట్టు మనోళ్ల ఏడుపు _ చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో బెయిలిప్పించడానికి దిల్లీ పంజాబీ వకీలు లూథ్రా దక్షిణాది రాష్ట్రాలకు ఏదో అన్యాయం జరిగిపోతోందని, సదువు, సంపదా లేని ఉత్తరాదోళ్లు మన ఐదు ప్రాంతాల జనాన్ని తొక్కి నారతీస్తున్నారని మనం తరచు తెగ బాధపడిపోతుంటాం. కొన్ని రంగాల్లో తమిళులు, మలయాళీలు, కన్నడిగులు,…

Read Full News

‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అంటే ఇదే మరి!

Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్‌’లో!) ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్‌ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్‌ గాంధీ లోక్‌ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్‌ వరుణ్‌ గాంధీ ఎంపీలుగా ‘భారత్‌’లో (భారతీయ జనతాపార్టీ)…

Read Full News

ఇండియా పేరును ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అని మార్చుకోవచ్చనే ఆశ 50 ఏళ్ల క్రితం ఉండేదే!

Nancharaiah merugumala senior journalist: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిస్ట్‌ రిపబ్లిక్స్‌ (ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌) అని మన దేశం పేరును మార్చుకోవచ్చని 1960ల చివర్లో, 1970ల ఆరంభంలో లక్షలాది మంది జనం అనుకునేవారు. ‘ప్రజా పోరాటాలు’ విజయవంతమయ్యాక  నూతన ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారత ఉపఖండం యావత్తూ కొత్త బంగారులోకంగా మారుతుందని ఆశించేవారు. ఎఫ్‌.ఐ.సీ.ఆర్‌ అనే ఈ ప్రతిపాదిత పేరు నాటి అగ్రరాజ్యాల పేర్లు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్యే), యూనియన్‌ ఆఫ్‌ సోవియెట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌ (యూఎసెసార్‌)కు…

Read Full News

జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..

Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా  ‘జమిలి ఎన్నికలు’ గురించి  హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా  ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల…

Read Full News
Optimized by Optimole