నల్గొండ బిజెపిలో కొత్త నేత తెరపైకి.. సీనియర్లు గుస్సా?
నల్గొండ బీజేపీ లో కొత్త నేత తెరమీదికి రావడంపై చర్చ జరుగుతుంది. ఎవరూ ఈ నేత?ఎందుకింత హంగామా? ఉన్న నేతల మధ్య గ్రూప్ తగాదాలు చాలవన్నట్లు.. ఇప్పటివరకు ఏ సభ..సమావేశాల్లో కనిపించని.. వినిపించని నేతను ప్రోజెక్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? పార్టీ కోసం కష్టపడిన నేతల పరిస్థితి ఎంటన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అటు సీనియర్ నేతలు పైకి మౌనంగా కనిపిస్తున్న సమయం కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నల్గొండ బీజేపీలో…
జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
వైకాపా నేతల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవని హెచ్చరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నారు. నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు..అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…
‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ …
మలయాళ సూపర్ హిట్ ‘కప్పేలా’ రీమేక్ గా రూపొందిన చిత్రం బుట్టబొమ్మ.అనికా సురేంద్రన్ ,అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలో నటించారు. శౌరి చంద్రశేఖర్ దర్శకుడు. నాగవంశీ,సాయి సౌజన్య నిర్మాతలు. శనివారం ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం! కథ .. అరకు ప్రకృతి అందాల మధ్య పెరిగిన మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి సత్య (అనికా సురేంద్రన్). తల్లి టైలరింగ్, తండ్రి రైస్ మిల్లులో పనిచేస్తుంటారు. స్మార్ట్ఫోన్ కొనుక్కోని…
బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలి: ఎస్పీ అపూర్వ రావు
నల్గొండ : బాలలకు స్వేచ్ఛ, వికాసం కల్పించాలన్నారు జిల్లా ఎస్పీ అపూర్వ రావు. నిరాదరణకు గురైన పిల్లలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ స్మైల్,ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు.జనవరి 1వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-IX కార్యక్రమం ద్వారా 82 మంది బాలలను గుర్తించి చేరదీశామన్నారు. ఇందుకు సంబంధించి 72 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని…
సీఎం జగన్ ‘హిట్లర్ ‘ : సుంకర పద్మశ్రీ
విజయవాడ: ఏపీలో వైసీపీ ఆరాచక పాలనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి నేడు పాదయాత్ర, నిరసనలకు అడ్డు తగులడం శోచనీయమన్నారు. ప్రజా సమస్యలను చెపితే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్ కు బుద్ధి చెప్పాలంటే ఛలో అసెంబ్లీ కచ్చితంగా నిర్వహించి తీరాలని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక గన్నవరం లో మహిళ టీచర్స్ ను దారుణంగా…
హుజుర్ నగర్ లో ఆసక్తికర రాజకీయం..!!
హుజూర్నగర్ లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా- నేనా తరహాలో మాటల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెరపైకి రావడం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు రసకందకాయంగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే తనపై పోటిచేయాలనిఎమ్మెల్యే…
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు: సంకినేని
సూర్యాపేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీ నుండి ఆత్మకూరు మండలంలోని శక్తి కేంద్రాలలో 28 కార్నర్ మీటింగ్ లు నిర్వహించబోతున్నట్లు తేల్చిచెప్పారు. శుక్రవారం బీజేపీ ఆత్మకూరు(S) మండల కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలలో కేంద్ర…
