మునుగోడు ఉప ఎన్నిక ట్విస్ట్.. కాంగ్రెస్ టీఆర్ఎస్ లో అసమ్మతిసెగ!
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది….
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన మెటా
వాట్సాప్ వినియోగదారులకు కోసం మెటా కొత్తఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకుముందు వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా లెఫ్ట్ అయితే.. యూజర్ లెఫ్ట్ అని గ్రూపులో చూపించేంది.ఇక మీదట అలాకాకుండా గుట్టు చప్పుడు కాకుండా గ్రూపులో నుంచి వెళ్లిపోయిందేకు వెసులుబాటును కల్పించే ఫీచర్ ను మెటా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం గ్రూప్ నుంచి ఎవరైనా లెఫ్ట్ అయితే అడ్మిన్లకు మాత్రమే అలర్ట్ వస్తుంది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ, కంట్రోల్ కలిగి ఉండేదుకు వీలుగా ఇలాంటి ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు…
బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు…
బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…
బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సంప్రదాయం కుటుంబం.. హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని…
మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..
మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…
బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…
కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..
కామన్వెల్త్ గేమ్స్_2022 లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం అతిథ్య ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో హర్మన్ సేన 4 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ కి చేరింది. దీంతో భారత్ కు మరో పతకం ఖాయమైంది. అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 32 బంతుల్లో…
సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్న కోమటిరెడ్డి ఫ్యాన్స్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు సభలో నేతలంతా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టార్గెట్ గా మాటల దాడి చేయడంతో రాజకీయం వేడెక్కింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ వెంకట్ రెడ్డి పై విరుచుకుపడిన తీరుపై కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తుంటే సీనియర్ నేతలు వారించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రేవంత్ అనుచరవర్గంతో కావాలనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని అభిమానులు సోషల్…
