ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్!

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రి తిర‌త్‌సింగ్ రావ‌త్కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో స‌న్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ద‌యచేసి ప్ర‌జ‌లంద‌రు అప్ర‌మ‌త్తంగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా ఆయ‌న మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ , హోంమంత్రి అమిత్ షాతో స‌మావేశం కావాల్సి ఉండ‌గా, భేటిని ర‌ద్దు చేశారు.

Read More

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓప్ర‌క‌ట‌న విడుదల చేశారు. భాజాపా కార్య‌కర్తల ఒత్తిడి మేర‌కే ముఖ్య‌మంత్రి పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశార‌ని తెలిపారు. పెంచిన వేతనాల్ని గ‌త ఏడాది నుంచి మాత్ర‌మే ఇస్తామ‌న‌డం కేసీఆర్ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర…

Read More

తెలుగు సినిమాకు నాలుగు జాతీయ పుర‌స్కారాలు!

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సోమ‌వారం 2019కిగాను 67 వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నృత్య దర్శకుడిగా (రాజు సుందరం – మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (నవీన్‌ నూలి- జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కాయి.

Read More

ఓట్లు చీలడం వలనే టిఆర్ఎస్ గెలిచింది : రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగ,ఆర్ధిక బలం లేని సామాన్య వ్యక్తి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంపిణీ చేసిందన్నారు. విపక్ష అభ్యర్థుల అధికంగా పోటీ చేయడం వలన.. ఓట్ల చీలిక వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని  రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ మార్పుపై…

Read More

సువెందు నిజస్వరూపం తెలుసుకోలేక పోయా : మమతా బెనర్జీ

తృణమూల్ మాజీ నేత సువేందు అధికారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ..  సువేందు నిజస్వరూపం తెలుసుకోకపోవడం తన తప్పెనని ఆమె అన్నారు. నేను మూర్ఖురా లిని.  తమ పార్టీలో ఉంటూ వారు వేల కోట్ల సామ్రాజ్యం సృష్టించుకున్నారని దీదీ  పేర్కొన్నారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తుండడంతో అధికార టీఎంసి, బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ర్యాలీలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ…

Read More

ఓటమి భయంతోనే ఈవీఎంలపై విమర్శలు : మోదీ

ఓటమి భయంతోనే మమతా బెనర్జీ, ఈవీఎంల పనితీరును ప్రశ్నించడం మొదలుపెట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పదేళ్ల క్రితం దీదీ ఈవీఎంలతోనే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారన్న విషయం తృణమూల్‌ నేతలు గుర్తుపెట్టకోవాలన్నారు. రాష్ట్రంలో తృణమూల్‌ ప్రభుత్వ అవినీతి ఆటలు ఇక సాగవని, అభివృద్ధి నినాదమే ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని బంకురా నియోజకవర్గంలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభివృద్ధి మా నినాదంమని…

Read More

అరణ్య సినిమా పెద్ద హిట్ ‌ కావాలి : హీరో వెంక‌టేష్

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో న‌టిస్తున్న‌ ‘అరణ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిధిగా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి మాన‌వ మ‌నుగ‌డ‌కు ఆధారం. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో ప్ర‌స్తుతం చూస్తున్నాం. అరణ్య‌ సినిమా అందరం గర్వపడేలా ఉంది. రానా మ‌రో విభిన్నమైన పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలోని…

Read More

ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తో చర్చినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రి ఆరోపణలపై లోతైన దర్యాప్తు చేయాలని శరద్ పవార్ డిమాండ్ చేశారు. అయితే పరమ్ సింగ్ ఆరోపణలు తమ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని ఆయన అన్నారు. మహా ఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రగా…

Read More

కరోనా మార్గదర్శకాలను కొనసాగించాలి : కేంద్రం

దేశంలో మలి దఫా కరోన విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు గత ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా…

Read More

ఇంగ్లాండ్ తో వన్డేలకు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టును బీసీసీఐ  ప్ర‌క‌టించింది. 18 మందితో కూడిన జట్టులో  సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి స్థానం‌ దక్కింది.  పేసర్  భువనేశ్వర్ కుమార్ మళ్లీ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. షమీ, జడేజాలు గాయాల నుంచి కోలుకోకపోవడంతో వారి పేర్లను పరిశీీలించలేదు. టీ20 సిరీస్‌కు దూరమైన నటరాజన్‌ వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న కృనాల్‌ పాండ్యాకు వన్డే…

Read More
Optimized by Optimole