BCCI: జింబాబ్వే తో టీ20 సిరిస్.. టీమిండియా కెప్టెన్ గా గిల్..!

Teamindia : జూలై నెలలో జింబాబ్వే తో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తుంది. భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ, శాంసన్, ధ్రువ్ జురేల్, నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్,…

Read More

Bandisanjay: ఒకే ఫ్రేంలో ” మాస్ ” హీరోలు..!

Bandisanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.  ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ..‘‘సంజయ్ గారు… మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్…

Read More
జీవన్రెడ్డి,jeevanreddy,mlc,

Telangana: పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే స‌భ్యుల‌తో సుస్థిర ప్ర‌భుత్వం ఉంద‌ని.. ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవాల్సిన అవ‌స‌రమేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా సిద్ధాంంతాల‌కు అనుగుణంగా పోరాటం, ప‌ని చేయాల‌ని హితువు ప‌లికారు. దీంతో పార్టీ ఫిరాంపుల‌పై జీవ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ హ‌స్తంపార్టీలో కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఇక తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో…

Read More

Chandrababu: చంద్రబాబుకు లోక‌స‌త్తా బాబ్జి లేఖ.. రైతుల ఖాతాల్లో 20 వేలు జమ చేయండి..!

APpolitics:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘ఏరువాక’ సందర్భంగా లోకసత్తా పార్టీ, రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి లేఖాస్త్రం సంధించారు.తెలుగుదేశం – జనసేన పార్టీ ఉమ్మడిగా విడుదల చేసిన ప్రజాగళం మ్యానిఫెస్టోలోని సూపర్సిక్స్ హామీల్లో ప్రస్తావించినట్లుగా .. రాష్ట్రంలో రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం జమచేయాలని రైతాంగం పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయం సీజన్ ప్రారంభం అయ్యిందని..గత ఖరీఫ్, రబీ సీజన్లో వర్షాభావంతో ఒకవైపు కరువు, మరోవైపు డిసెంబర్…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

munuudireview: ‘అరబ్బీ నిఖా’ బలిపశువులు మహిళలే.. మతాధికారులపై కత్తి ఎత్తిన రుఖియా కథ..!

విశీ( సాయి వంశీ) : ” మతం అంచుల అవతల ‘అరబ్బీ నిఖాలు’”  ఈ విశ్వంలో ప్రకృతి ఉంది. ఈ భూమిపై మతం ఉంది. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక జీవి మరో జీవితో సమాగమించొచ్చు అంటుంది ప్రకృతి. అది దాని నియమం. పెళ్లి కాని ఇద్దరు స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటుంది మతం. రెండింటికీ భూమి ఆకాశాల నడుమ ఉన్నంత…

Read More

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read More

spremdonar: ‘వీర్యదానం’ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు ..!

విశీ ( సాయి వంశీ):  గతంలో ఏమైనా వచ్చాయో, లేదో తెలియదు కానీ, 2012లో హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్’ సినిమా Sperm Donation గురించి విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ‘వీర్యదానం’ అనే అంశాన్ని సాధారణీకరించేలా చేసేందుకు చాలా ఉపయోగపడింది. ఆ సినిమాను ఆ తర్వాత ‘నరుడా డోనరుడా’ పేరిట తెలుగులో, ‘ధారాళ ప్రభు’ పేరిట తమిళంలో తీశారు. తెలుగులో ఫ్లాప్, తమిళంలో యావరేజ్‌గా ఆ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో…

Read More

Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read More

Ramojirao: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌..ఒడిశా ఎమ్మెల్యే మద్దతు..!

Nancharaiah merugumala senior journalist: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..! ‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త…

Read More
Optimized by Optimole