హైదరాబాద్: కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ పై వీధి రౌడీల మాదిరిగా కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. హద్దులు దాటి మాట్లాడితే నాలుక కోసే స్థాయిలో ప్రజలు ప్రతిస్పందిస్తారని హెచ్చరించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుడ్డలు ఊడి ఇంటికి పంపించినా, కేటీఆర్కి సిగ్గురాలేదని మండిపడ్డారు.
కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తండ్రి చాటున పదవులు రాలేదని, ఆయన స్వయంగా ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకుడని రమేష్ రెడ్డి గుర్తు చేశారు.కేటీఆర్ వాడుతున్న అసభ్య భాషను తక్షణం విరమించాలని, ఇది గ్రామీణ ప్రజల మైత్రిని దెబ్బతీసే విధంగా ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.”కాళేశ్వరం కుంభకోణంపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులపై విచారణ జరిపితే, కేటీఆర్ తట్టుకోలేక సీఎం రేవంత్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో రమేష్ రెడ్డి తో పాటు
R&B కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, MBC కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, TPCC వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, TPCC రాష్ట్ర అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్ కాంగ్రెస్ నాయకులు వేణు పాల్గొన్నారు.