మునుగోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సంజయ్ లేఖ.. ఇరకాటంలో టీఆర్ఎస్..!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా  స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన  హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి…

Read More

మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

అడ్డుతొలగించుకోవడానికి కేసిఆర్ 120 కేసులు పెట్టారు: రేవంత్

తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ…

Read More

మంత్రి జగదీష్ రెడ్డిని బీజేపీ నేతలు ఉరికించి కొడ్తరు: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని.. ప్రజల కోసం వచ్చిన ఎన్నికన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా తనవెంట ఉన్నారన్నారు రాజగోపాల్. మంత్రి జగదీష్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు.మూడున్నర ఏండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.డబ్బులతో తన వెంట ఉన్న సర్పంచ్ లను కొనాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. కారునేతల…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ..

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అభిప్రాయపడ్డారు. కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ భాజపా బహిరంగసభలో ఆరోపించారు. టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి…

Read More

బీజేపీలోకి అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం..!

పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో పాటు పంజాబ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి కాషాయ కండువా కప్పుకున్నారు.అయితే అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భర్త ఏది చేసిన భార్య అనుసరించాల్సిన…

Read More

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్‌ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారు….

Read More

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…

Read More
Optimized by Optimole