అడ్డుతొలగించుకోవడానికి కేసిఆర్ 120 కేసులు పెట్టారు: రేవంత్

తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ…

Read More

మంత్రి జగదీష్ రెడ్డిని బీజేపీ నేతలు ఉరికించి కొడ్తరు: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని.. ప్రజల కోసం వచ్చిన ఎన్నికన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా తనవెంట ఉన్నారన్నారు రాజగోపాల్. మంత్రి జగదీష్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు.మూడున్నర ఏండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.డబ్బులతో తన వెంట ఉన్న సర్పంచ్ లను కొనాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. కారునేతల…

Read More

బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ..

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మునుగోడులో ఓడిపోతాననే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని అభిప్రాయపడ్డారు. కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి కుర్చీలో కూర్చోబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ భాజపా బహిరంగసభలో ఆరోపించారు. టీఆర్ఎస్ లో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి…

Read More

బీజేపీలోకి అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం..!

పంజాబ్ మాజీ సీఎం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.అమరీందర్ కు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్. ఆయనతో పాటు పంజాబ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టి కాషాయ కండువా కప్పుకున్నారు.అయితే అమరీందర్ భార్య ప్రణీత్ కౌర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. భర్త ఏది చేసిన భార్య అనుసరించాల్సిన…

Read More

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

హీరో ప్రభాస్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో భేటీ కానున్నారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన వజ్రోత్సవ  వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో..సెప్టెంబర్‌ 16న బీజేపీ నేతలతో షా చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి  కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్‌ షా పరామర్శించనున్నారు….

Read More

కెసిఆర్ నూ పొట్టు పొట్టు తిట్టిన ఈటల .. ఓడగొట్టే వరకు నిద్రపోనని శపథం..

అసెంబ్లీ సస్పెన్షన్ పై  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. సిఎం కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. కేసిఆర్ నూ గద్దె దింపే వరకు నిద్రపోనని శపథం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ పై మరమనిషి వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నారని.. ఇటు అధికార టీఆర్ఎస్..అటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రైతాంగం సమస్యలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక మరమనిషి…

Read More

ఈటల సస్పెన్షన్ పై దుమారం.. కేసీఆర్ ను ఏకిపారేసిన బీజేపీ నేతలు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా నడుస్తున్నాయి. అధికార పార్టీ ,ప్రతిపక్ష నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో సభను హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నూ సస్పెండ్ చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. స్పీకర్ పోచారంపై ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడం .. అతనిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అవుతున్నారు.కేసీఆర్ తాటాకు…

Read More

కేసిఆర్ బలం,బలహీనత తెలుసు..నల్లగొండ.. ఖమ్మం గడ్డపై బీజేపీ జెండా: ఈటల

బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం  జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల చేసిన వ్యాఖ్యలతో.. ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాక సీఎం కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని.. ఆయన బలం బలహీనత తెలిసిన వాడినని…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. కేసీఆర్ పై కాషాయనేతలు ఫైర్ ..

మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు కాషాయంనేతలు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని.. ఉద్యమకారులను కేసీఆర్ మోసం చేశారంటూ కాషాయం నేతలు పదునైన మాటల తూటాలతో రెచ్చిపోయారు. కాగా ఉప ఎన్నికలో దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని సవాల్…

Read More
Optimized by Optimole