దేశంలో బీజేపీ ప్రభావం మరో 30ఏళ్లు ఉంటుంది: ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని దేశ ప్రజలు ఓడిస్తారని.. బీజేపీని ప్రజలు మర్చిపోతారని రాహుల్‌ భ్రమపడుతున్నారని అన్నారు పికే. బీజేపీ ప్రభావం మరో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన స్పష్టం వేశారు. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు…

Read More

హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..

హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో కొన్ని గంట‌ల్లో ముగియ‌నుండ‌గా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఓట‌ర్ల‌ని ఆక‌ర్షించే ప‌నిలో చివ‌రి ఘ‌ట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుద‌ల చేసింది. కాగా స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌… స‌బ్ కా విశ్వాస్‌, స‌బ్ కా ప్ర‌యాస్‌… అనే ప్ర‌ధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామ‌ని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుద‌ల చేసింది. ఇందులో పొందు ప‌రిచిన…

Read More

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే…

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లు చేశారని.. అయినప్పటికి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వెంట…

Read More

భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!

యూపీ​ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాల్యం.. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు….

Read More

కర్ణాటక కొత్త సీఎం బసవరాజు బొమ్మై!

కర్ణాటక కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే యడియూ రప్ప శిష్యుడు బసవరాజ్ బొమ్మై ని ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. సీఎం ఎంపికపై సమావేశమైన కర్ణాటక శాసన సభా వర్గం.. మాజీ సీఎం యడియూరప్ప బసవరాజు సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే అందరూ ఆమోదించడం.. ప్రకటన చక చక జరిగిపోయింది. ప్రస్థానం .. ప్రస్తుతం బొమ్మై కర్ణాటక హోంమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు బొమ్మై బసవరాజు.. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కూమారుడు..యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు. బొమ్మై…

Read More

టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్!

అధికార టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరాబాద్‌లో టీఆర్‌‌ఎస్ అభ్యర్థి ఎవరో కూడా తెలికుండానే ఆ పార్టీ నేతలు ఓట్ల కోసం డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆ పైసలు తీసుకుని ఈటల రాజేందర్‌‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర ఆరో రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం వాగు ఒడ్డు రామన్న పల్లి గ్రామంలో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర…

Read More

హుజరాబాద్ ఉప సమరం పై పార్టీల కసరత్తు!

తెలంగాణ రాజకీయం అంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక మీదే కేంద్రీకృతమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ సవాల్గా తీసుకున్నాయి. బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అభ్యర్థిత్వం విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పై ఎన్నికల సమావేశమైంది. ఈ మేరకు ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా…

Read More

పార్లమెంట్ సమావేశాల్లో జనాభా నియంత్రణ బిల్లు..?

జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని పలువురు భాజపా ఎంపీలు యోచిస్తున్నారు. జులై 19న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి వారంలోనే ఈ ప్రైవేటు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నారు. ఉభయ సభల సెక్రెటేరియట్లు విడుదల చేసిన సమాచారం ప్రకారం లోక్సభలో ఎంపీ రవికిషన్, రాజ్యసభలో కిరోరి లాల్ మీనా.. ఈ బిల్లులను జులై 24న ప్రవేశపెట్టనున్నారు. జనాభా నియంత్రణపై మరో రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా…

Read More

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా..?

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేయనున్నారా? అంటే అవుననే సమాధానం విశ్వసనీయవ వర్గాల సమాచారం! ఈ మేరకే ఆయన రాష్ట్ర గవర్నమెంట్ కోరినట్లు తెలిసింది! ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమవడం వల్ల.. ఆయన తన రాజీనామాను సమర్పించేందుకే కలువబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి….

Read More
Optimized by Optimole