ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్!

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు గురిపెట్టారు. గోవా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్‌ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూనే… విపక్షాలను ఎండగట్టారు. అలాగే యూపీలో పర్యటించిన అమిత్‌ షా… సంక్షేమ మంత్రమే ఆయుధంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక ఉత్తరాఖండ్‌లో…

Read More

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయం!

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ విమర్శలు చేస్తుంటే…. టీఆర్ఎస్‌, బీజేపీలు దొందు దొందేనంటూ…కాంగ్రెస్‌ చెబుతోంది. మొత్తానికి… మూడూ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో… తెలంగాణ రాజకీయాలు వేడెక్కెతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దళితులను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌గా చూసిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వం సైతం దళితులకు…

Read More

స్టాండప్‌ కమిడియన్‌ కు బీజేపీ నేతల హెచ్చరిక!

వివాదాస్పద స్టాండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ తెలంగాణ టూర్‌ పై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రాష్ట్రంలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. తెలంగాణ సర్కార్‌పై ఫైర్‌ అవుతున్నాయి. అతనిపై.. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేదం విధించాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎట్టిపరిస్థితిలోనూ హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చిరిస్తున్నాయి. ఇక హైదరాబాద్‌లో జనవరి 9న షో నిర్వహిస్తున్నానని వారం క్రితం మునావర్‌ ఫరుఖీ ప్రకటించారు. దీన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌.. మునావర్‌తో పాటు…

Read More

యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read More

పంజాబ్ లో బీజేపీ పొత్తు ఖరారు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో…

Read More

పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read More

కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మనీష్ పుస్తకం..!!

కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటు.. మనీష్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ నేతలు.. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకూ పుస్తకంలో ఏముంది..? ’10 ఫ్లాష్‌ పాయింట్స్‌.. 20 ఇయర్స్‌’ పేరిట ఎంపీ మనీష్‌ తివారీ…

Read More

సాగు చట్టాల రద్దు నిర్ణయానికి అసలైన కారణం..?

ప్ర‌ధాని మోదీ త‌న 20 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఓనిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం చాలా అరుదు. అలాంటి వ్య‌క్తి సాగు చ‌ట్టాల విష‌యంలో త‌గ్గ‌డానికి కార‌ణాలేంట‌న్న చ‌ర్చ‌ రాజ‌కీయా వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ప్ర‌ధాని ప‌ద‌వి చేపట్టాక అనేక సంక్షేమ ప‌థకాలు.. సంస్క‌ర‌ణల‌తో దేశాన్ని అభివృద్ధిలో ప‌థంలో న‌డిపిస్తున్న న‌రేంద్రుడు.. వ్యవసాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యం.. విపక్ష నేతలనే కాకుండా, సొంత పార్టీనేత‌లను సైతం విస్మ‌య‌ప‌రిచింది. ముందుగా సాగు చ‌ట్టాల…

Read More

ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటి ?

అనుకున్న‌దొక‌టి అయింది ఒక‌టి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ ప‌రిస్థితికి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటారా.. త‌మ‌కు ఎద‌రులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు షాకిచ్చాయి. వీటికి తోడు వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై సుంకాన్ని త‌గ్గించి.. ఇర‌కాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది….

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More
Optimized by Optimole