జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది: నాదెండ్ల మనోహర్
Janasena: ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని జనసేన స్వాగతిస్తుందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. జమిలి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం అధికారికంగా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రజాధనాన్ని ఎన్నికల కోసం వృథా చేయకుండా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచి విషయమని పేర్కొన్నారు. బలమైన మార్పు కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం సముచితమేనని.. రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజకీయంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్…