జనసేన అధినేత పవన్ తో మాజీ మంత్రి కొణతాల భేటీ..

Janasenaparty: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైదరాబాదులో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయపరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని కొణతాల జనసేన లో చేరే అవకాశం ఉంది. అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి జనసేన తరుపున ఎంపీగా పోటీచేసే యోచనలో కొణతాల రామకృష్ణ ఉన్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్‌ నాయకుడుగా పేరున్న కొణతాల.. 1989 నుండి 1996 వరకు  అనకాపల్లి…

Read More

‘‘ప్రతీ చేతికి పని-ప్రతీ చేనుకు నీరు’’ … దిశగా జనసేన-టీడీపీ మ్యానిఫెస్టోను రూపొందించాలి.

‘ప్రతి చేతికి పని ` ప్రతి చేనుకు నీరు’, ‘‘వలసలు, పస్తులు లేని’’ ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే దిశగా జనసేన-టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరిగినట్టు ఇటీవల జనసేన ప్రకటించింది. దేశంలో ఎక్కడ చూసినా పోటీపడి ఉచితాలు ఇస్తామంటున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం రాజకీయాల్లో శుభపరిణామమే. చూడటానికి ఆరు పదాలు మాల గుచ్చినట్టు ఉన్నా దీని వెనక ఒక తాత్విక సిద్ధాంతం కూడా ఉంది. ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే తరాలను నిలబెట్టే పునాది కాగలదు. అయితే…

Read More

Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం: నాదెండ్ల మనోహర్

Janasenaparty: ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. పిల్లల  భవిష్యత్  ప్రశ్నార్థకం అవుతోందని.. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారని.. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే…

Read More

వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది : నాదెండ్ల మనోహర్

janasena: ‘పెట్టుబడులు ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని పదే పదే గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… క్విడ్ ప్రోకో డీల్స్ తో కొన్ని కంపెనీలకు మాత్రమే అనుచిత లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  ఆరోపించారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించిన  నాదెండ్ల వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న…

Read More

ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధం ఎందుకు? : నాదెండ్ల మనోహర్

NADENDLAMANOHAR:  ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. విశాఖపట్నం నగర వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ జంక్షన్ ను మూసి వేసి, ప్రజలకు లేనిపోని సమస్యలు తెచ్చి పెట్టిన ప్రభుత్వం ఎవరి కోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ రియల్…

Read More

బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం : పవన్

Telanganaelections2023: ‘సమాజంలోని అన్ని వర్గాలకీ అధికారం అందాలనే బలమైన లక్ష్యంతో 2009 నుంచి పోరాటం చేస్తున్నామన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  తెలంగాణలో బీజేపీ కూడా అదే ఆశయంతో తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల నుంచి  ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కూకట్ పల్లి నియోజకవర్గంలో జరిగిన జనసేన – బీజేపీ సంయుక్త ప్రచార సభలో పవన్  పాల్గొని ప్రసంగించారు. ఆయనతో…

Read More

తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్తు బంగారం కావాలి: పవన్ కళ్యాణ్

Telanganaelections: ‘ తాను ఏనాడూ పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం తాను ఏ నాడూ అర్రులు చాచలేదన్నారు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడినని..అక్కడే ఉండిపోయేవాడినని స్పష్టం…

Read More

భారీ మెజార్టీతో బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి: పవన్ కళ్యాణ్

Telanganaelection2023: ఆంధ్రలో రౌడీలు రాజ్యాలేలుతున్నారని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.రౌడీలను, గూండాలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొని నిలబడి ఉన్నానంటే దానికి ముఖ్య కారణం తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తేనని ఆయన స్పష్టం చేశారు.ధన బలం లేకపోయినా గుండె ధైర్యం, ఆశయ బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని ఈ నేల నేర్పిందన్నారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అవినీతి, కమీషన్ల తెలంగాణగా మారిపోవడం చూసి బాధ కలిగింద”ని జనసేనాని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్ర నాకు జన్మనిస్తే…

Read More

కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్

Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.  మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో  ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం  చేయాలని సూచించారు….

Read More
Optimized by Optimole