ఆస్పత్రిలో చేరిన రజినీ..!

తమిళ సూపర్​ స్టార్ రజనీకాంత్ గురువారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు రజనీకాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వారు వెల్లడించారు.కాగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు రెండు రోజుల క్రితం రజినీ దిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను కలుసుకున్నారు.

Read More

నటుడు సూర్యకు కరోనా పాజిటివ్!

తమిళ అగ్ర నటుడు సూర్యకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూర్య స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నుంచి మనం ఇంకా బయటపడలేదని , అందరూ జాగ్రత్తగా ఉండాలి, నాకు చికిత్స చేస్తున్న వైద్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సూర్య ట్వీట్ చేశారు.                     …

Read More
Optimized by Optimole