Karthikapournami: కార్తీక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం మహిమ..!

Karthika pournami:  కార్తీక పౌర్ణమి హైందవులకు పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ..దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథననుసరించి కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజుగా కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. వెయ్యేళ్ళ రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా ఈరోజు మహాశివుడు తాండవం చేశాడని పురాణల్లో చెప్పబడింది. కార్తీక పౌర్ణమి హరిహరులకు ప్రీతికరమైన రోజు. అగ్నితత్వమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన…

Read Full News

Karthikaekadashi: కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసా..?

Ekadashi2024:  ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రభోదైక దశి.. బృందావన ఏకాదశి.. బోధన ఏకాదశి.. ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడశుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు (శయనించిన) ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక ఏకాదశిన మేల్కొన్నాడని పురాణ కథనం. పవిత్రమైన ఈ రోజున ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చేయాలి. తులసి దళాలతో హరిని.. బిల్వ దళాలతో హరుడుకి అర్చన చేసి ఉపవాసం…

Read Full News

karthikamasam: ‘కార్తీకమాసం’..పాపపరిహారం కోసం ఏం చేయాలి..?

Karthikamasam2024:  కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మాసంలో వ్రతాలు.. నోములు.. ఉపవాసాలతో పాటు దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పరంజ్యోతిని ఆరాధన చేస్తున్నామని అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత పుణ్యదాయకమని పురాణ వచన.  విశిష్టత: కార్తీక మాసం మొదటి రోజున ఆలయాల్లో…

Read Full News

సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:   _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _  త్రివేణి…

Read Full News

శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…

Read Full News

కార్తీక పౌర్ణమి ఒక్క రోజు ఆచరిస్తే చాలు.. స్వామివారి అనుగ్రహం పొందవచ్చు..

  కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమను కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను ఈ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగిన మాసమని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళికి వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్త్యం కలిగినది అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు,…

Read Full News

మహా శివరాత్రి వ్రత మహాత్యం!

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది…

Read Full News

శివ_అష్టోత్తర_శతనామావళి

ఓం శివాయ నమః ఓం శంభవే నమః ఓం శశిరేఖాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం పినాకినే నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం నీల లోహితాయ నమః ఓం శూలపాణయే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శర్వాయ నమః ఓం శితి కంఠాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామారినే నమః ఓం గంగాధరాయ నమః ఓం కాలకాలాయ…

Read Full News

శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి!

దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు…

Read Full News
Optimized by Optimole