ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు వైసీపీ చీకటి జీవోను తీసుకొచ్చింది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ప్రతిపక్ష నేతల్ని  అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు.  ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య…

Read More

శతదళం.. సమరగళం.. యువగళం: నాదెండ్ల మనోహర్

పదులు కాదు… వందలు కాదు… ఏకంగా వేలాది యువ గళాలు గొంతు విప్పేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్ నాదెండ్ల మనోహర్. యువగళాలు మండే నిప్పు కణికల్లాంటి ప్రశ్నలను సంధించేందుకు యువశక్తి వేదిక కాబోతుందన్నారు. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే మహోత్తర కార్యక్రమంలో మాట్లాడేందుకు.. 100 మంది యువతకు అవకాశం ఇవ్వాలని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు.  ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి…

Read More

ఏపీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: నాదెండ్ల

వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేన తలపెట్టిన యువ శక్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించిందన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.  రణ స్థలంలో సభా స్థలిని జనసైనికులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  యువతరం భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమానికి యువత…

Read More

ఉత్తరాంధ్రలో యువ నాయకత్వం అవసరముంది: నాదెండ్ల

ఉత్తరాంధ్ర రెండు కుటుంబాల సొత్తు కాదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్. ఇక్కడి యువ నాయకత్వాన్ని కొన్ని కుటుంబాలు, వ్యక్తులు తొక్కిపట్టి పెత్తనం చెలాయించారని తెలిపారు. సహజ సంపద దోపిడీ చేసి..కావాలనే యువ నాయకత్వాన్ని చంపేశారన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవస్థలో యువ నాయకత్వం అవసరముందన్నారు. సమస్యలపై పోరాడే గుణం, ధైర్యంగా గలమైతే.. ప్రతి సమస్య మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్న యువ నాయకులకు ఇక్కడ కొదవ లేదని.. అలాంటి నాయకత్వం వెలికి తీయడమే జనసేన పార్టీ…

Read More

క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్

ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…

Read More

యువతరం గళం వినిపించేందుకు సరైన వేదిక ‘యువశక్తి’: నాదెండ్ల మనోహర్

జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం యువతరం గళం వినిపించేందుకు సరైన వేదికన్నారు ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. స్వామి వివేకనంద జయంతి రోజున నిర్వహించే ఈ సభకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఉత్తరాంధ్ర యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇక్కడి ప్రజల బతుకు వేదన, వలసల నిరోధం, మత్స్యకారుల రోదన, ఉద్దానంలో ఆరోగ్య క్షీణత.. ఇతర సమస్యలతో పాటు స్ఫూర్తివంతమైన విజయగాధలు…

Read More

‘యువశక్తి’ ఉద్దేశ్యం ‘మన యువత… మన భవిత’ : జనసేనాని

శ్రీకాకుళంలో స్వామి వివేకానంద జయంతి రోజును పురస్కరించుకుని జనసేన ‘యువశక్తి ‘ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు జన సైనికులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ‘యువశక్తి ‘ కార్యక్రమం  పోస్టర్లను జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ…

Read More

సామాజిక పింఛన్లను తొలగించడం హేయం: జనసేనాని

ఆంధ్రప్రదేశ్లో సామజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ముఖ్యమంత్రి జగన్ కు లేఖాస్త్రం సంధించారు. పింఛన్ల తొలగింపు  కసరత్తు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ చర్య  పేదలను ఇబ్బందుల పాలుజేసే విధంగా ఉందన్నారు. పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ సుమారుగా 4 లక్షల మంది లబ్ధిదారులకి నోటీసులు జారీ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. లబ్ది దారులను తొలగించేందుకు అధికారులు  చూపించిన కారణాలు సహేతుకంగా లేవని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  పింఛన్ల…

Read More

విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చవద్దు: పవన్ కళ్యాణ్

విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విద్యాలయాల ప్రాంగణాలను..  సీఎం జగన్ ఫ్లెక్సీలతో  నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందన్నారు. సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు జనసేనాని. ఇక తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ…

Read More

పన్ను వసూలు పేరుతో అధికారులు బెదిరిస్తున్నారు: మనోహర్

ఏపీ లో ఖాళీ స్థలాల పేరు చెప్పి సామాన్యులను  పన్ను వసూలు పేరుతో మున్సిపాలిటీ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. ఖాళీ స్థలాల్లో బోర్డులుపెట్టి హెచ్చరించడాన్ని కచ్చితంగా ప్రభుత్వ ప్రాయోజిత కబ్జాలుగా భావిస్తున్నామన్నారు.ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను కాపాడే ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారిగా, కబ్జాకోరుగా మారడానికి వైసీపీ నాయకత్వమే కారణమని మనోహర్ మండిపడ్డారు. కాగా  సీఎం జగన్  ఆలోచనకు అనుగుణంగానే మున్సిపల్  అధికారులు నడుచుకొంటున్నారేమోని?..ఇంటి…

Read More
Optimized by Optimole