Appolitics: వైఎస్ జగన్ 2.0.. పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?

Appolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్ర చర్చ మొదలైంది. 2017లో ప్రజా సంకల్ప యాత్రతో అధికారాన్ని అందుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మరోసారి ప్రజల మధ్యకు రావడానికి సిద్ధమవుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణుల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ “జగన్ 2.0 పాదయాత్ర”పై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశం పై newsminure24 ప్రత్యేక కథనం..    

Read Full News

APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!

APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…

Read Full News

ysrcp: వైసీపీలో ఏం జరుగుతోంది..?

APpolitics: ‘‘వైసీపీలో ఏం జరుగుతోంది?’’ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య, రాజీనామ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మ అయిన విజయసాయిరెడ్డి రాజీనామ ప్రత్యేకమైనది. జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో…

Read Full News

Jagansharmila: ప్రియాంక, రాహుల్‌ను చూసి జగన్, షర్మిల కొంతైనా నేర్చుకోవద్దా..?

Nancharaiha merugumala (Senior journalist):  గురువారం(ఈరోజు)  ‘ఈనాడు’ మొదటి పేజీ కింది వార్త ‘తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్‌’ అనే వార్త. దాని కిందే ‘జగనన్నా..ఇంత అన్యాయమా!’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రెండో రాజకీయ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వైఎస్‌ షర్మిలమ్మ ఆవేదనతో కూడిన లేఖ వార్త. ఇదే పేపరు లోపలి పేజీలో ‘రాజకీయాల్లో నాకు 35 ఏళ్ల అనుభవం’ అంటూ భారత జాతీయ ప్రథమ రాజకీయ కుటుంబంలో ఆడబిడ్డ ప్రియాంకా గాంధీ వాడ్రా చెప్పిన మాటలతో మరో…

Read Full News

Laddupolitics:లడ్డూ రాజకీయం..వ్యాపార ఫాసిజం కొనసాగింపే..!

Gurram seetaramulu: పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడబెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద…

Read Full News

politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

Telugustatespolitics: తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే…

Read Full News

YsJagan: 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుర్తుచేసిన రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ

Nancharaiah merugumala senior journalist:  ” 12 ఏళ్లనాటి జగన్ అరెస్టును గుండెలు పిండేసేలా గుర్తుచేసినందుకు వేమూరి రాధాకృష్ణకు జేజేలు పలుకుతున్న వైసీపీ అభిమానులు.. ”  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుష్కర కాలం క్రితం 2012 మే 12న అరెస్టయ్యారనే విషయం సోమారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే తెలుగు టెలివిజన్ న్యూజ్ ఛానల్ గుర్తుచేసింది. పాత కతలు చాలా వరకు విసుగుపుట్టించే స్థాయిలో రాసే అలవాటున్న నాకు జగన్ ను సీబీఐ…

Read Full News

అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం: నాదెండ్ల మనోహర్

Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ…

Read Full News

అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!

నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్‌ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…

Read Full News

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్  ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన..  ప్రతిపక్ష నేత  చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు   నిదర్శనమన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …

Read Full News
Optimized by Optimole