APpolitics:ప్రజాసమస్యలు వినే నాథుడే లేడు..!!

APpolitics: ఏపీలో ప్రధాన పార్టీల నేతల పర్యటనలు సామాన్య ప్రజలు ఇబ్బందిగా మారింది. అటు సీఎం జగన్ పర్యటనలు పరదాల  చాటున.. పోలీస్ ఆంక్షలు నడుమ ఉంటున్నాయి. చివరికి పుట్టిపెరిగిన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటన సైతం అనేక  ఆంక్షలు నడుమన సాగుతోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుల పర్యటనలు సైతం.. ఎన్ఎస్జీ కమాండోలు.. పోలీసులు.. బౌన్సర్ల పహారాలో జరుగుతోంది. దీంతో సామాన్య ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. ఇటు …

Read Full News

ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది : పవన్ కళ్యాణ్

APpolitics:‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాంమన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయని తెలిపారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు…

Read Full News

అక్రమ కేసుల నుంచి న్యాయమే మమ్మల్ని కాపాడుతుంది: నారా లోకేష్

APpolitics : అక్రమ కేసులనుంచి న్యాయం, చట్టాలే తమను కాపాడతాయని యువనేత నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా డిల్లీలో లోకేష్ చేపట్టిన నిరాహారదీక్షను ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ కుటుంబసభ్యులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ…  మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకెళ్లారు.. చంద్రబాబు గారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు తెచ్చినందుకే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…

Read Full News

రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం : నాదెండ్ల మనోహర్

APpolitics: అసెంబ్లీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఉండి ఉంటే రాష్ట్రానికి ఇంత దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పాలకులు కనీస సంస్కారం లేకుండా దారుణంగా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితుల్ని ఖండించాలన్నారు. మన భవిష్యత్తు కోసం.. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ రెండేళ్ల క్రితమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేసినట్టు తెలిపారు. ఆయన దూరదృష్టిని అప్పట్లో ఎవరూ…

Read Full News

వైసీపీ వైరస్ కు జనసేన, తెలుగుదేశమే వ్యాక్సిన్: పవన్ కళ్యాణ్

Varahivijayayatra4: ‘ప్రజల దాహం తీర్చే గ్లాసు… ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని  చేస్తాయని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆలయాలను కూల్చేసే వైసీపీ మహమ్మారికి……

Read Full News

మరోసారి ఆంధ్రాకు జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తాం : నాదెండ్ల మనోహర్

Janasenaparty: “వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్” అనేది జనసేన నినాదమని అన్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఎందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదో కూడా ప్రజలకు వివరిస్తామని..వారిని చైతన్యపరుస్తామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమైపోతున్నారని.. నిన్న మొన్నటి వరకు గడపగడపకు ప్రభుత్వం.. జగనన్నకు చెబుదాం… జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలం…

Read Full News

సత్యమేవ జయతే…చెడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది: నారా భువనేశ్వరి

APpolitics: నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్వహించిన మోత మోగిద్దాం! అనే కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి  తన నివాసం లో డ్రమ్స్ మోగించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు తాము చేస్తున్న ఈ శబ్దం ప్రజలు అందరికీ చేరుతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీ కలిగిన నేత అన్నారు. ఈ పోరాటంతో చేడు నుంచి రాష్ట్రం బయట పడుతుంది అని అన్నారు. సత్యమేవ జయతే అని నినదించారు.    

Read Full News

ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: నారా బ్రాహ్మణి

APpolitics: ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో పెద్ద ఎత్తున మహిళలతో కలసి టీడీపీ పిలుపునిచ్చిన *మోత మోగిద్దాం* కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఢమరుకంతో శబ్ధం వినిపించిన అనంతరం విజిల్ ఊది, డప్పుకొట్టి బ్రాహ్మణి తన…

Read Full News

వై నాట్ 175 vs వై నాట్ చంద్ర ‘ సేన’ ..

APpolitics:  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.’  వై నాట్ 175 ‘ అని అధికార వైసీపీ ప్రభుత్వం అంటుంటే.. పాత పొత్తు మళ్ళీ పొడవడంతో  ‘ ‘ వై నాట్ చంద్రసేన’  అంటూ ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో  గెలిచాకా ‘వై నాట్‌ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్‌ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార…

Read Full News

‘ మేలుకో తెలుగోడా ‘ యాత్రతో జనంలోకి నారా భువనేశ్వరి..

TDP: ఏపీ రాజకీయం రోజురోజుకీ మారుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో పొలిటికల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. రాజమండ్రి లోనే ఉంటు పార్టీ నేతలతో కలిసి నిరసన సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బస్సు యాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించి టీడీపీ నేతలు రూట్ మ్యాప్ ను…

Read Full News
Optimized by Optimole