జనసేన ‘ ఎందుకు ఆంధ్రకు జగన్ వద్దంటే ‘ కార్టూన్ వైరల్..

Janasenacartoon: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీ..ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి చేపట్టిన ‘ ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ‘ కార్యక్రమంపై జనసేన పార్టీ కౌంటర్ గా రూపొందించిన కార్టూన్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోను కార్టూన్ పై జన సేన , టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీ…

Read Full News

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!) ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి….

Read Full News

నిరసనల మాట వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు: నారా లోకేష్

APpolitics: రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై సిఎం జగన్ అణిచివేత వైఖరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నాడని.. నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నాడని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రశ్నించే గళాలను చూసి భయపడుతోందన్నారు. చంద్రబాబు అరెస్టుపై, తమ హక్కుల కోసం పోరాడుతున్న వివిధ వర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జగన్  పిరికితనాన్ని చాటిచెపుతోందని లోకేష్  స్పష్టం చేశారు. తమ…

Read Full News

టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు: నారా భువనేశ్వరి

APpolitics: టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం…

Read Full News

అక్టోబర్ 1 వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర..

Janasenavarahivijayayatra4: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన,…

Read Full News

ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ: నారా భువనేశ్వరి

TDP: రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన…

Read Full News

చంద్రబాబు కష్టాలకు రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా?

Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!) ============= 2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు….

Read Full News

ఇద్దరు అత్యంత సంపన్న ముఖ్యమంత్రులూ..

Nancharaiah merugumala senior journalist:ఇద్దరు అత్యంత సంపన్న  ముఖ్యమంత్రులూ (వైఎస్‌ జగన్, పేమా ఖాండూ)మైనారిటీ మతస్థులే, ఒకరు క్రైస్తవ, మరొకరు బౌద్ధ మార్గీయులు! =================== ‘‘ఇండియాలో రాజకీయ అవినీతి ఓటర్లకు డబ్బు పంచి వారి ఓట్లు కొనుగోలు చేయడంతో మొదలవుతుంది. అధికారంలోకి రావడానికి కోట్లాది రూపాయల ధనం ఖర్చు చేసే నేతలు తాము పదవిలో ఉన్న ఐదేళ్లలో ఆ సొమ్ము రాబట్టుకోవడానికి చాలా ప్రయాస పడతారు,’’ అని అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండూ అభిప్రాయపడ్డారు….

Read Full News

పొత్తుల మర్మమేళ?

APpolitics: ‘తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది’ అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి పరిస్థితి. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టిడిపితో పొత్తు ప్రకటన చేసి రాజకీయ పంచ్‌ ఇచ్చారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌ జైలు ప్రాంగణంలోనే రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ప్రకటిస్తూనే, ఎన్‌డిఎలో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, బిజెపి కూడా తమ కూటమిలో చేరుతుందనే…

Read Full News

రాష్ట్ర విభజన సమయంలోనే కుట్ర చేసిన జగన్: నాదెండ్ల మనోహర్

Janasena: ‘రాష్ట్రంలో ఎప్పుడూ అలజడులు జరగాలి… అశాంతితో ప్రజలు ఉండాలన్నదే జగన్ లక్ష్యం. అతడికి ఎల్లపుడూ అధికారం కోసం చేసే కుట్రలు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. ప్రజలకు మేలు చేయాలనే దృష్టి లేని నాయకుడు జగన్. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చి, శాసనసభ్యులతో విడతలవారీగా రాజీనామాలు చేయించి, అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూశాడ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి…

Read Full News
Optimized by Optimole