టీ- కాంగ్రెస్ లో స‌రికొత్త ర‌చ్చ‌.. సీనియ‌ర్స్ VS జూనియ‌ర్స్‌..!

Tcongress: కాంగ్రెస్ లో ఎంపీ కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్యాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ అధికారంలోకి వస్తే ద‌ళిత వ్య‌క్తి సీఎం అవుతార‌ని మంచిర్యాల బ‌హిరంగ స‌భ‌ వేదికగా ఆయ‌న మాట్లాడిన మాట‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. దీనికి ఆజ్యం పోసేలా సీఎం రేసులో తాను ఉన్న‌ట్లు సీఎల్పీ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క్‌ బాంబ్ పేల్చ‌డంతో.. ‘ ఆలులేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమ‌లింగం ‘ అన్న‌ట్లు హస్తం పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న…

Read More

12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..

Nancharaiah merugumala senior journalist: 12వ క్లాసు చరిత్ర పాఠంలో గోడ్సే పుణెకు చెందిన బ్రాహ్మణుడనే మాట తొలగించారు..అనవసరంగా కులం వివరాలు చెప్పొద్దనేది బీజేపీ సర్కారు పాలసీ అట! ‘1948 జనవరి 30 సాయంత్రం తన రోజువారీ ప్రార్థనా సమావేశంలో ఉండగా గాంధీజీని ఒక యువకుడు పిస్తోలుతో కాల్చిచంపాడు. వెంటనే అక్కడ లొంగిపోయిన ఈ హంతకుడు పుణెకు చెందిన బ్రాహ్మణుడు. పేరు నాథూరాం గోడ్సే.’ అని మహాత్మా గాంధీపై రాసిన పాఠంలోని వాక్యం ఇది. ఇది 12వ…

Read More

‘బలగం’ కు ఉన్న బలమేమిటీ?

Narsim Cartoonist :  అటు ప్రేక్షకులు, ఇటు మేధావుల మెప్పుతో పాటు కలెక్షన్లలో కూడా ‘జయహో’ అనిపించుకుంటున్న “బలగం” చూస్తుంటే తెలుగులో చిన్న సినిమాకు మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తుంది. సినిమాలు, సాహిత్యం మిగతా అన్ని రకాల కళలు విజయాలు సాధించాలన్నా, కలకాలం నిలిచి ఉండాలన్నా ముఖ్యంగా అవి ప్రజలతో కనెక్ట్ కావాలి. “బలగం”- అట్లా కనెక్ట్ అయిన సినిమా, ఒక ఎమోషనల్ కనెక్షన్. తెలంగాణా మాండలికంలో, అచ్చంగా తెలంగాణ సినిమానే అయినా ఒక్క తెలంగాణాకే కాక…

Read More

‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేసీఆర్ కు భ‌ట్టి లేఖ‌..

BhattivsKCR: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీఎల్పీ నేత మ‌ల్లుభ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావొస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోందని భ‌ట్టి లేఖ‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో…

Read More

సోషల్ మీడియాతో మోసపోవద్దు: నటి ప్రియ

Kollywood: సోషల్ మీడియా మాయ ప్రపంచం లాంటిది.. ముసుగు చాటు మనిషిలా అందులో కనిపించే ఫోటోలు చూసి దాన్నే అందం అనుకొని మోసపోవద్దని నటి ప్రియా భవాని శంకర్ యువతకు సూచించారు. తెరపై కనిపించే స్టార్లు అందానికి కాపాడుకోవడానికి చాలా ఖర్చు చేస్తుంటారని.. డబ్బులుంటే కాకిని కూడా తెల్లగా మార్చేయొచ్చని.. కానీ ఆ డబ్బును గెలవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. శరీర సౌష్టవం, రంగు , రూపం వంటి విషయాల్లో ఎవరైనా మిమ్మల్ని నోప్పిస్తే…

Read More

నీతా అంబానీ గొప్ప స్ఫూర్తి..!!

ఆర్. దిలీప్ రెడ్డి (  విశ్లేషకులు): డబ్బున్న వాళ్లంతా గొప్ప పనులు చేస్తారని చెప్పలేం. కానీ, నీతా అంబానీ 36 స్వచ్చంద సంస్థల సహకారంతో 19 వేల మంది బాలికలను ప్రత్యేక నీలి జెర్సీల్లో ముంబాయి లోని వాంకడే స్టేడియంకి రప్పించారు. అందులో 200 మంది వైవిధ్య సామర్థ్యాల దివ్యాంగులున్నారు. వారిలో దాదాపు అందరు, లేదా అత్యధికులు తొలిసారి స్టేడియంకి వచ్చి క్రికెట్ లైవ్ చూస్తున్నవాళ్లే !  స్టేడియం ఓ నాలుగ్గంటల పాటు నిజంగా ‘నీలి సంద్రమే’…

Read More

హింసని నమ్ముకున్నవాడు చివరికి హింసకే బలవుతాడు !

పార్థ సారథి పొట్లూరి: లవలేష్ తివారీ, సన్నీ,అరుణ్ మౌర్య అనే ముగ్గురు కలిసి అతిక్ అహ్మద్ అతని తమ్ముడు అష్రాఫ్ ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలమీదకి బులెట్ల వర్షం కురిపించారు ! అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రాఫ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు ! యావజ్జీవ జైలు శిక్ష పడ్డ అతిక్ అహ్మద్ ని మరియు అష్రాఫ్ ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని MLN మెడికల్ కాలేజీ కి తీసుకొచ్చారు…

Read More

‘విడుద‌ల పార్ట్ – 1’ రివ్యూ..

‘ఆడుకాలం’ సినిమాతో ఉత్తమ ద‌ర్శ‌కుడిగా జాతీయ‌ పుర‌స్కారం అందుకున్నారు ‘వెట్రిమార‌న్‌’. కోలీవుడ్ న‌టుడు ధ‌నుష్ హీరోగా ఆయ‌న తీసిన‌ ‘అసుర‌న్’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘నార‌ప్ప‌న్’ గా రీమేక్ చేశారు. ఆయ‌న తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ‘విడుద‌ల పార్ట్ – 1’. తమిళ హ‌స్య న‌టుడు సూరి హీరోగా న‌టించాడు. విజ‌య సేతుప‌తి ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించారు. త‌మిళంలో ఇప్ప‌టికే విడుద‌లైన ఈచిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. శ‌నివారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన…

Read More

కారల్‌ మార్క్స్, అంబేడ్కర్‌.. ఇద్దరినీ తీర్చిదిద్దిన ఘనత లండన్‌ నగరానిదేనా?

Nancharaiah merugumala senior journalist: సరిగ్గా 132 సంవత్సరాల క్రితం జన్మించిన భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి డా.భీంరావ్‌ అంబేడ్కర్‌ (1891–1956) జీవించింది 65 సంవత్సరాల 7 నెలల 22 రోజులు అనే విషయం ఈరోజే గమనించాను. అంబేడ్కర్‌ 70–80 ఏళ్లు బతకలేదని తెలుసుగాని 66 ఏళ్ల లోపే కన్నుమూసిన విషయం గుర్తులేదు. రాజకీయ నాయకులు, సినిమా నటీనటుల వయసులు చాలా వరకు గుర్తుపెట్టుకుని చెప్పే అలవాటున్నా బాబాసాహబ్‌ ఎన్ని సంవత్సరాలు జీవించిందీ వెంటనే గుర్తుకు రాదు….

Read More

శాకుంత‌లం మూవీ రివ్యూ.. హిట్టా? ఫ‌ట్టా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించిన తాజాచిత్రం శాకుంతలం. గ‌త ఏడాది ఆమె న‌టించిన య‌శోద బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. దీంతో తొలిసారిగా పౌరాణిక చిత్రంలో న‌టించిన స‌మంత‌.. శాకుంత‌లంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. కొద్ది రోజుల ముందు విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్ కు అపూర్వ స్పంద‌న ల‌భించింది. దీనికి తోడు సక్సెస్ ఫుల్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి….

Read More
Optimized by Optimole