త్రిపుర తీర్పు..లెఫ్టా..? రైటా…?

దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ముందు జరిగే ఈ రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలకమైనవి. రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వానికి సెమీఫైనల్సే అని చెప్పవచ్చు. అందుకే బిజెపికి ఈ ఎన్నికలు పెను సవాలు విసురుతున్నాయి. తొలుతగా ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ 2014లో ఢల్లీి పీఠం…

Read More

భయపెడుతున్న నిరుద్యోగిత..అయోమయంలో యువత..

పెరిగే నిరుద్యోగిత భారతదేశాన్ని భయపెడుతోంది. పేరున్న బడా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ కంపెనీలు వేలాది మంది ఉద్యోగుల్ని పీకేస్తుంటే ఉన్నపళంగా వారు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ‘మేం పెద్ద ఎత్తున్న ఉద్యోగ నియామకాలు జరుపబోతున్నామ’ంటూ ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలతో ఊదరగొడుతున్నాయి. అదే నిజమైతే, నియామకాలు ఇన్నాళ్లెందుకు జరుపలేదు? అనే ప్రశ్న సహజం! ఇవి ఎన్నికల, ఎన్నికల ముందరి సంవత్సరాలు కావడంతో …క్షేత్ర పరిస్థితులకు, వాస్తవాలకు విరుద్దంగా పాలకులు మాయమాటలు చెప్పడం ఓ రాజకీయ తంతుగా మారింది! దేశంలో…

Read More

భారత పార్లమెంటు కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ గ్రేటేనా?

Nancharaiah merugumala: ================== “భారత పార్లమెంటు భవనానికి నూరేళ్లు నిండకుండానే కొత్తది నిర్మించిన నరేంద్రమోదీ నిజంగా గ్రేటేనా?” బ్రిటిష్‌ ఇండియా సర్కారు 1927లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (ఐఎల్సీ–కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్, సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ: కేంద్ర చట్టసభల ఎగువ దిగువ సభలు) కోసం నిర్మించిన భవనంలోనే 1947 ఆగస్ట్‌ 15 నుంచి భారత రాజ్యాంగ రచన పూర్తయ్యే వరకూ రాజ్యాంగ పరిషత్‌ సమావేశాలు జరిగాయి. భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించాక 1950 జనవరి నుంచి భారత…

Read More

అంత బుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నడిచేవాణ్ణే: కమల్ హాసన్

Nancharaiah merugumala: …………………………………………. ”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”  ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్…

Read More

చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్

భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్  గట్టిగా బదులిస్తోందన్నారు.  ఇది గమనించిన ప్రపంచ దేశాలు… భారత్  ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్  బలంగా తిప్పికొట్టిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక  గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను…

Read More

చంద్రబాబు దారే రాహులుకు రహదారి అవుతుందా?

Nancharaiah merugumala: ====================== ఎట్టకేలకు తెలుగుదేశం నేత నారా చంద్ర బాబు నాయుడు బాటలోకి వచ్చాడు కాంగ్రెస్ ఉగ్రనేత రాహుల్ గాంధీ. బాబులా తెల్ల గడ్డం పెంచాడు. నారావారిపల్లె నవ యువకుడి రీతిలో  ఇతర మేధావుల సలహాలు యువ ‘ప్రిన్స్’ వింటున్నాడు. చంద్రన్న 1990ల మధ్యలో అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ అనే బంగారు నినాదంతో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ‘జనరంజకంగా’ పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోసం దక్షిణం నుంచి ఉత్తరాదికి నడిచిన రాహుల్ చంద్రబాబు తరహాలో…

Read More

పెళ్లి కొడుకును లారీలో మండపానికి తీసుకొచ్చిన వధువు ..వీడియో వైరల్ ..!!

కేరళలోని త్రిసూర్ లో అరుదైన ఘటన జరిగింది . ఓ యువతి నిశ్చితార్థం చేసుకోబోయే యువకుడ్ని లారీ నడుపుకుంటూ చర్చికి తీసుకెళ్లింది. ఈ ఘటన చూసి నిశ్చితార్థ వేడుకకు వచ్చిన అతిథులందరూ ఆశ్యర్యపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. త్రిసూర్ జిల్లాలోని మానలూరుకు చెందిన దలీషా అనే యువతికి చిన్నప్పుటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. తండ్రి డేవిస్…

Read More

పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!

2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్‌ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…

Read More

హంగ్‌ దిశగా కర్ణాటక..

దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…

Read More

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read More
Optimized by Optimole