దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క…

Read More

టీ 20 ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన భారత్..

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా బోణీ కొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​పై66 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియాకు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 140 భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో పంత్, హార్దిక్ పాండ్య తమదైన చెలరేగిపోయారు. దీంతో 211 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్​ జట్టుకు నిర్దేశించింది భారత జట్టు.కాగా స్వల్ప లక్ష్య చేదనకు దిగిన అఫ్గానిస్థాన్ తడబడింది. నిర్ణీత…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన ఇంధన ధరలు..

దేశంలో చమురు ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సెంచరీ దాటిన ఇంధన ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న ధరలు.. నేడు స్వల్పంగా పెరిగాయి. తాజాగా దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 110 రూపాయ‌ల 4 పైస‌లకు చేరుకుంది. అలాగే డీజిల్ 98 రూపాయ‌ల 42 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న 114 రూపాయ‌ల 12 పైస‌లున్న పెట్రోల్ ఈ రోజు…

Read More

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్..

సూపర్​స్టార్​ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన రజినీ డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైందని వైద్యులు వెల్లడించారు. దీంతో సూపర్ స్టార్ అభిమనులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా 70ఏళ్ల రజనీకాంత్​ ఇటీవలే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ కుటుంబ సమేతంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి…

Read More

ముగిసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం ముగిశాయి. లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌ లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై , మాజీ సీఎంలు యడియూరప్పతో , సిద్దరామయ్య పాటు పలువరు సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు సీఎం…

Read More

దేశంలో కాస్త తగ్గినా కరోనా కేసులు…

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్​​తో మరో 549 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 13 వేల 543 మంది కోలుకున్నారు. ప్రస్తుతం లక్ష 61వేల 555 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Read More

డ్రగ్స్ నిర్మూలన కై రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమం

యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ‘నయా సవేరా’ అనే మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు త్వరలో పునఃప్రారంభించనున్నారు. దీని విష‌య‌మై రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. కాగా యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు త్వరలో ‘నయా సవేరా’ అంటే ‘నయా డాన్’ అనే డ్రగ్స్ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. చిన్నారులు, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే…

Read More
Optimized by Optimole