సినిమా టికెట్స్ రేట్లపై నాని వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..

నటుడు నాని వ్యాఖ్యలతో ఏపీలో సినిమా టికెట్ల రగడ మరోసారి చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓఛానల్‌ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిస్తూ.. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టుకి ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి నుంచి ట్వీట్ల ద్వారా రిక్వెస్టులు పంపడం తప్ప.. ఈ విధంగా నిరసన తెలిపిన వారు లేరు. నాని విజిల్ బౌలర్ పాత్ర పోషించడంతో ఒక్కొక్కరుగా మద్దతు తెలుపుతున్నారు….

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…

Read More

అమ్మవారి విశ్వ విద్యాలయంలో అన్యమతస్తుల వేడుక!

అది హిందూవుల కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్నచోటు. ఆదగ్గర్లోనే పద్మావతి అమ్మవారి పేరిట నడుస్తున్న విశ్వవిద్యాలయం. అక్కడ అన్యమతస్తుల వేడుకల నిషేదం అమల్లో ఉంది. అయితే తాజాగా.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అన్యమతస్తుల వేడుకను అధికారుల సమక్షంలోనే అట్టహసంగా జరిపారు. దీంతో హిందూసంఘాల నేతలు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అన్యమతస్తుల వేడుకలు నిషేదం అమల్లో ఉంటే.. వేడుకలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా సాక్ష్యాత్తు పద్మావతి అమ్మవారి పేరుతో నడుస్తున్న మహిళ విశ్వవిద్యాలయంలో.. నిబంధనలకు విరుద్ధంగా…

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు…

Read More

తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం,…

Read More

బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read More

ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్‌ బారినపడినట్లు…

Read More

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పై ఆందోళన!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్​ నుంచి ఆదివారం గుజరాత్​కు వచ్చిన ఓ వ్యక్తితో సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా…

Read More

బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానుల హృదయాలను గెలిచి.. అత్యధిక ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా.. తనదైన ఆట తీరుతో మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు సన్నీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్‌ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను…

Read More

సుఖేష్ చంద్రశేఖర్ కేసులో విస్తుగోల్పే విషయాలు వెలుగులోకి!

సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200కోట్ల మోసం కేసులో అరెస్టైన సుఖేశ్‌.. ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్నాడు. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా కోటి రూపాయలు లంచం ఇస్తున్నట్లు తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల…

Read More
Optimized by Optimole