ఓటిటిలో శ్రీ దేవీ సోడా సెంటర్..!

‘పలాస..’ ఫేమ్ కరుణకుమార్ డైరక్షన్లో వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ‘జీ5’ ఓటీటీ లో అభిమానులను అలరించనుంది. నవంబరు 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రేమ ఇతివృత్తానికి సంబంధించింది కావడంతో ఓ…

Read More

భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తెలుగు భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.ప్రాచీన సాహిత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.భాషను మరిచిపోతే తెలుగు సంస్కృతి కూడా దూరమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని…

Read More

హుజూరాబాద్ లో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు..

తెలంగాణ రాజకీయమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మీదనే కేంద్రీకృతమైంది. ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తూ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని ఓ ప్రధాన పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. అందుకనుగుణంగానే…

Read More

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం అదృష్టం: రజినీకాంత్

2021 ఏప్రిల్ లో రజినీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయంపై రజనీకాంత్ తనదైన శైలిలో స్పందించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తన అదృష్టమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన ట్వీట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతోషకరమైన సమయంలో తన గురువు బాలచందర్ తనతో లేకపోవడం బాధాకరమని రజినీ అన్నారు.

Read More

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాధేశ్యామ్ టీజర్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుదలైన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. కేవ‌లం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ వ్యూస్ చూస్తుంటే ప్ర‌భాస్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయమని అభిమానులు అంటున్నారు. టీజ‌ర్‌లో ప్రభాస్ సరికొత్తగా…

Read More

ఆర్టీసీ బస్సులో సీఎం ఆకస్మిక తనిఖీ..

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. శనివారం చెన్నైలోని కన్నకి నగర్ వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సులో ఆకస్మిక తనిఖీ నిర్వ‌హించారు. ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించి ప్ర‌జ‌లకు అందుతున్న సౌక‌ర్యాల‌పై ఆరా తీశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడులో అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు కార్య‌క్ర‌మం గురించి ఎలా భావిస్తున్నారని స్టాలిన్ మహిళా ప్రయాణికులను అడిగారు. బస్సుల్లో అదనపు సౌకర్యాలు అవసరమా అని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడుతూ నగరంలోని స్థానిక…

Read More

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియానే టైటిల్‌ ఫేవరేట్‌ :ఇంజామామ్‌ ఉల్‌ హక్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ క్రికెట్ ఉంటే ఆ మజానే వేరు. రెండు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతుంది. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్ లో తలపడ్డక.. ఇప్పుడు టి 20 ప్రపంచ కప్ లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇకపోతే ఈ మ్యాచ్లో…

Read More

విశ్వ వేదికపై బతుకమ్మ సంబురం..

తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ఎడారి దేశం దేశంలో తంగేడు వనం విరబూసింది. దుబాయ్ లోని బూర్జా ఖలిఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి తెలంగాణా గొప్పతనాన్ని చాటి చెప్పారు. కాగా బతుకమ్మ వీడియోను బూర్జా ఖలిఫాపై రెండూ సార్లు ప్రదర్శించారు. ఈ వీడియోల్లో బతుకమ్మ విశిష్ఠత ,సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. అంతేకాదు సీఎం కేసిఆర్ ముఖ చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

Read More

టి 20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా బోణీ..

టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సూపర్​-12 పోటీల్లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడిన ఆస్ట్రేలియా రెండు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. రబాడ, మహరాజ్, షంసీ చెరో వికెట్ దక్కించుకున్నారు. మొదట టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాను 118 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. స్టీవ్​ స్మిత్ 35 పరుగులు చేసి జట్టు…

Read More

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read More
Optimized by Optimole