News
Telangana : కోదండరామ్ చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!
Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్ గారు చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ ముద్దసాని కోదండరామ్ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…
Ayodhya: రాముడిని దర్శించుకున్న హనుమాన్.. భక్తిని చాటుకున్ననెటిజన్స్..!
AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది? తెల్సుకుందాం..! హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం…
Pmmodi: అయోధ్య రామ్లల్లా క్రెడిట్ మోదీ ఖాతాలో.. ..!
Nancharaiah merugumala senior journalist: ” అయోధ్యలో రామ్ లల్లా గుడికి పరోక్షంగా పునాదులేసిన పండిత నెహ్రూ, జీబీ పంత్, పీవీలకు రావాల్సిన కీర్తి ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఖాతాలో పడిపోయింది!” తనపై అభాండాలు, నిందలేసిన నగర ప్రజలపైన, పాలకుడిపైనా కోపంతో సీతాదేవి అయోధ్య నగరాన్ని శపించిందని కొందరు చెప్పగా విన్నాం. ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ, మథుర వంటి హిందువుల పుణ్యక్షేత్రాల్లో కనిపించే ఉత్సాహం, సంపద, చలనశీలత అయోధ్యకు వేలాది సంవత్సరాలుగా లేవు. ఈ…
Rammandir : 500 ఏళ్ల స్వప్నం సాకారంకాబోతోంది.!
AyodhyaRammandir: 500 వందల ఏళ్ల స్వప్నం.. వేల మంది త్యాగం.. కోట్లాది మంది చిరకాల వాంఛ.. సాకారమయ్యే శుభ తరుణం రానే వచ్చింది. మరి కొద్ది గడియల్లో హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. అతిరథ మహారథులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా దేశం నలుమూలలనుంచి వచ్చిన పాధువులు, పండితులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు…
Modi: రాముడి అంశతో జన్మించిన మోదీని కళ్ళారా చూస్తున్నాం..!
NarendraModi :దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన జరుగబోతుంది. దేవీదేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాటన చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి వరకూ సనాతన శ్రద్ధాకేంద్రాలను దర్శిస్తున్నారు.కాశీ విశ్వనాధుడి ఆశీస్సులను స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగా బావుల పవిత్రజలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నారు.శిరస్సు నుంచి కాలి చిటికెన వేలు వరకూ అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు.బాల రాముడి ప్రాణప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో రామునికి జయజయకారాలతో వీక్షిస్తూ క్రతువుకు యజమానైన దేశాధినేతకు…
భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో!
Nancharaiah merugumala senior journalist: “భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “ భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న…
Loksabha2024: 2024 లోక్సభ ఎన్నికలు ‘‘అంతా రామమయం…!’’
Loksabhaelections2024: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు వేళయింది. మరికొన్ని గంటల్లో హిందువుల వందల ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు సంఘ్ పరివార్ పెద్ద ఎత్తున అయోధ్య సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కిందస్థాయి కార్యకర్త వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందా..? బీజేపీకి ఓట్ల వర్షాన్ని కురిపిస్తుందా..?…
RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?
శేఖర్ కంభంపాటి (సీనియర్ జర్నలిస్ట్ ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర…
APcastcensus: ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?
Nancharaiah merugumala senior journalist:“ఆంధ్రాలో కులగణనతోనైనా కాపుల ‘లెక్క’ తేలుతుందా?బిహార్లో యాదవులు ఎందరున్నారో చెప్పడమంత ఈజీ కాదు ఏపీలో కాపుగణన!” ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం కులాల జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మొదలైంది. మొదట రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల్లోని (ఓబీసీలు) 139 కులాల జనాభా విడివిడిగా ఎంతో తేల్చడానికి ఈ ‘జాతిగత జనగణన’ (హిందీలో వాడే ఈ మాటలే బాగున్నాయి. కాపు జాతి అనే ముద్రగడ పద్మనాభం గారిని ఈ హిందీ పదాలు గుర్తుచేస్తాయి) చేస్తారని అనుకున్నారు. ఇప్పుడు…
