దయానిధి మారన్‌ యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?

Nancharaiah merugumala senior journalist: ” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్‌..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?” ఉత్తరప్రదేశ్, బిహార్‌ నుంచి వచ్చిన ఇంగ్లిష్‌ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్‌ సభ సభ్యుడు దయానిధి మారన్‌ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్‌) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి…

Read More

ప్రజాస్వామ్యమా నీవెక్కడ?

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ప్రజాస్వామ్యం చిన్నబోతోంది. ‘ఓస్‌ ఇంతేనా ప్రజాస్వామ్యమంటే!’ అనే అభిప్రాయం కలిగేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్ని అరిష్టాల నడుమ కూడా రాజరికమైనా, కడకు నియంతృత్వమైనా నయమేమో అనిపించేంత అద్వాన్న పరిస్థితులు దాపురిస్తున్నాయి. 146 మంది విపక్ష సభ్యుల్ని సస్పెన్షన్‌తో బయటకు పంపి, దేశానికి కీలకమయ్యే చట్టాల బిల్లులను పార్లమెంటులో ప్రభుత్వం ఏకపక్షంగా ఓకే చేయించుకుంది. వాటిపై సమగ్ర పరిశీలన లేదు, అభ్యంతరాలు లేవు, చర్చ లేదు. నూటా యాబై సంవత్సరాలుగా…

Read More

ఉండవల్లిని ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం!

Nancharaiah merugumala senior journalist: ఉండవల్లిని జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా నియమిస్తే కాపు–బలిజలకు రాజ్యాధికారం ఖాయం! వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే మాసాల్లో జరిగే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికల్లో కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లు నిరాకరించి, కొత్త అభ్యర్థులను నిలిపే దిశగా ఈ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ఆంధ్రా…

Read More

అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణమే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళి!

Nancharaiah merugumala senior journalist:  ఇందిరా గాంధీ హయాంలో వేళ్లూనుకున్న కుహనా సోషలిజాన్ని, రాజీవ్‌ గాంధీ పాలనలో బలహీన పడిన కుహనా లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పీకేసి ‘హిందూ’ మహాసముద్రంలో కలిపారు పాములపర్తి వేంకట నరసింహారావు గారు. ఈ తెలుగు అపర చాణక్యుడు ప్రధాని పదవి నుంచి దిగిపోయిన 8 ఏళ్లకు అంటే–19 సంవత్సరాల క్రితం 2004 శీతాకాలంలో కన్నుమూశారు. దక్షిణాదికి చెందిన ఒకే ఒక బ్రాహ్మణ ప్రధానమంత్రిపై చరిత్ర తుది తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది….

Read More

ముక్కోటి ఏకాదశి విశిష్టత..!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ :   ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి. శ్రీహరి దర్శనాన్ని పొంది, విష్ణు కరుణకు పాత్రులయ్యాయి. సకల దేవతలూ వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే- ముక్కోటి ఏకాదశి. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు…

Read More

జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!

Appolitics :  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్‌ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్‌ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…

Read More

Apelection: ఏపీ ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్లే కీలకం..

Apelection2024:  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చలికాలంలోనే వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు తెలుగువారి దృష్టి అంతా ఆంధ్రా ఎన్నికలపైనే ఉంది. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని వైఎస్‌ఆర్‌సీపీ ఆశిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వ పగ్గాలు ఖాయమని టీడీపీ- జనసేన కూటమి ధీమాగా ఉంది. రాష్ట్రంలోని పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంటే, అంతకంటే ఎక్కువగా ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది. వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త…

Read More

లోక్ సభ ఎన్నికల్లో ముస్లింలు ఏ పార్టీ వైపు?

Loksabha2024: భారతదేశ రాజ్యాంగంలో కీలకమైన లౌకికవాదం రాతలకు, మాటలకే పరిమితమవుతోంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీల వ్యూహాలన్నీ కులం, మతం, ప్రాంతీయ అంశాల చుట్టే తిరుగుతున్నాయి. ఏయే వర్గాలతో ఎన్ని ఓట్లు పడతాయనే ధోరణితోనే పార్టీలున్నాయి. 2024 ఏప్రిల్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశంలో ప్రధానమైన ముస్లిం ఓటర్లకు సంబంధించి చరిత్రను పరిశీలిస్తే స్వాతంత్య్రానంతరం ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుత రాజకీయాలు సుమారు 14 శాతమున్న ముస్లిం మైనార్టీల…

Read More
Optimized by Optimole