Article370: ఆర్టికల్‌ 370 చుట్టూ జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలు..!

Jammu Kashmir: మంచు లోయలతో పర్యాటకుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ చల్లని వాతావరణంతో కేరింతలు కొట్టించే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్‌ వేసవి కాలం కాకపోయినా ఎన్నికల రాజకీయాలతో వేడెక్కుతోంది. పదేళ్ల అనంతరం ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు జమ్మూ కశ్మీర్‌ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు, మీడియా వర్గాలు తమ తమ కోణాల్లో…

Read More

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…

Read More

APNEWS: గ్రామాల్లో పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సిఎంపవన్

PawanKalyan:   ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏపీ లో కూటమి పాలన( ఎన్డీయే )మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని ఆయన  స్పష్టం చేశారు. పాలన మొదలైన తొలి వంద రోజుల్లోనే 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ద్వారా రూ.4500 కోట్లు నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినందున నిధుల సమస్య ఉత్పన్నం కాదన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి…

Read More

sanatandharma: ‘సనాతన ధర్మం’పై పవర్ స్టార్ లాగే ఉదయనిధి..!

Nancharaiah merugumala senior journalist: సనాతన ధర్మాన్ని డెంగీతో పోల్చిన ఉదయనిధి తల్లి దుర్గ గుడుల్లో మొక్కుతుంటే, ‘సనాతన ధర్మం’ నినాదం ఎత్తుకున్న డెప్టీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఒరిగేదేంటో! సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని ప్రకటించి బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత,…

Read More

OBC: ‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే!

Nancharaiah merugumala senior journalist: తెలుగు నాట‘ఓసీ’ ఎంపీలను చూసి ఓబీసీ ఎంపీలు ఏమీ నేర్చుకోలేకపోతున్నారే! 2019 ఆంధ్రప్రదేశ్‌ సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయాక, ఈ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి ఉరఫ్‌ సుజనా చౌదరి, గరికపాటి మోహనరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌ టీడీపీ నుంచి చీలిక పేరుతో బయటపడ్డారు. ఆ చీలికను నాటి రాజ్యసభ చైర్మన్‌ అయిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుర్తించారు. అలాగే, చీలిక ప్రక్రియ…

Read More

SanatanDharma: సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం: పవన్

PawanKalyan: ‘పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్రం జరిగితే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నా’రని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  మండిపడ్డారు. జగన్ నియమించిన టీటీడీ బోర్డులో తప్పు జరిగిందని ల్యాబ్ రిపోర్టులతో సహా విషయం బయటకు వచ్చినా దబాయింపు చేయడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తప్పు జరిగినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామని మాట్లాడాలి లేదా అప్పటి బోర్డులో ఉన్న అధికారులు, బోర్డు సభ్యులు ప్రమేయం మీద మాట్లాడాలి.. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడడం…

Read More

Telangana: తెలుగువర్సిటీకి పొట్టిశ్రీరాములు పేరు కొనసాగించాలన్న వైశ్యుల డిమాండ్‌ న్యాయమే కదా?

Nancharaiah merugumala senior journalist: ఇండియాలో విశ్వవిద్యాలయాల పేర్ల మార్పిడికి వివాదాలు లేదా గొడవలు పూర్వపు హైదరాబాద్‌ స్టేట్, ప్రస్తుత మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని ఔరంగాబాద్‌ మరాఠ్వాడా యూనివర్సిటీతో మొదలు కాలేదు, దానితోనే ముగియడం లేదు. ఈ యూనివర్సిటీకి రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాని దళితులు ఆందోళన చేయడం, ససేమిరా అలా చేయోద్దంటూ శివసేన, మరాఠా కులాల సంస్థలు పోటీ ఉద్యమాలు నడపడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం…

Read More

janasena: డిప్యూటీ సీఎం దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మహాయాగం..

Nadendlamanohar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహించారు.తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో సోమవారం ఉదయం 11 గం. నుంచి మహా యాగం చేశారు. ఈ కార్యకమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప…

Read More

subbaReddy:సుబ్బారెడ్డిభార్య క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది!

Nancharaiah merugumala senior journalist: వైవీ సుబ్బారెడ్డి ‘ బద్మాష్ ‘ అంటే అందరూ నమ్ముతారు గాని భార్య స్వర్ణలత క్రిస్టియన్ అంటే నమ్ముతారా? చంద్రబాబుకు ఏదో అయింది! నిజంగానే మారాడు, ఏపీని మళ్లీ గాడిన పెడతాడు అనుకున్న ఎన్.చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014-2019 నాటి పోకడలకు తెరతీయడం తెలుగోళ్లు అందరికీ మహా విషాదం. వైఎస్ జగన్ తల్లి బైబిల్ పట్టుకు తిరుగుద్ది అంటే పడి కోట్ల తెలుగోళ్ళు నమ్ముతారు. అంతేగానీ రామాంజనేయులు రెడ్డి అనే…

Read More

Laddupolitics:లడ్డూ రాజకీయం..వ్యాపార ఫాసిజం కొనసాగింపే..!

Gurram seetaramulu: పెట్టుబడి దారుడు తనకు 20 శాతం లాభం వస్తుందంటే తన విస్తరణన కాంక్షను ఊరి సరిహద్దు దాటిస్తాడని ,యాభై శాతం లాభం వస్తుందంటే వాడ దాటతాడనీ , 80శాతం లాభం వస్తుందనుకుంటే రాష్ట్ర సరిహద్దులు దాటతాడని, చిట్ట చివరకి తాను మరణిస్తే 100 శాతం లాభం వస్తుందని తెలిస్తే ఆ క్షణాన చంపడానికి చనిపోవడానికి గడియ కూడా ఆగడని ఆస్థిని కూడబెట్టుకొనే క్రమంలో విలువలను ఎలా విస్మరిస్తాడో కార్ల్ మార్క్స్ రెండువందల ఏళ్ల కింద…

Read More
Optimized by Optimole