janasena: డిప్యూటీ సీఎం దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మహాయాగం..

Nadendlamanohar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహించారు.తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో సోమవారం ఉదయం 11 గం. నుంచి మహా యాగం చేశారు. ఈ కార్యకమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు.

అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియచేయడం అందరి బాధ్యత. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా… అపచారం చేసినవారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా లోక క్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని జనసేనాని సంకల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారని” మంత్రి అన్నారు.