హైదరాబాద్:
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించి ప్రముఖ సినీ నటులు, యూట్యూబ్ ప్రముఖులు, సోషియల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ను ఆధారంగా తీసుకుని 29 మంది సెలబ్రిటీలు, సంస్థలపై కేసులు నమోదు చేసింది.
ఈ లిస్ట్లో టాలీవుడ్ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, శ్రీముఖి తదితరులు ఉన్నారు. వీరంతా బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో భాగస్వాములైనట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈడీ ప్రస్తుతం ప్రివెంక్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద విచారణ చేపట్టనుంది. ప్రచార కార్యక్రమాల ద్వారా పొందిన ఆదాయం, ఆర్థిక లావాదేవీలను గమనించి అవసరమైతే సంబంధితులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి ప్రమోషన్లకు సెలబ్రిటీల జాగ్రత్త అవసరమనే మాటలు వినిపిస్తున్నాయి.
– సీనియర్ జర్నలిస్ట్