దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు 13,71,107 మందికి టీకాలు అందిచ్చారు. దీంతో వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది.
ఇక ప్రపంచదేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 7,25,222 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మరి వలన 1,650 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 4,63,579 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042 కి చేరినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది.