సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Suryapeta: సర్వమత సమ్మేళనానికి తెలంగాణా పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. గంగా, జమునా తహజీబ్ లకు ఈ ప్రాంతం ప్రత్యేక ఐకాన్ గా ఫరీడ విల్లుతుందని ఆయన పేర్కొన్నారు.రంజాన్ పర్వదినం ప్రారంభం సందర్భంగా ఈ శుక్రవారం నుండి ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లిం మైనారిటీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పరమ పవిత్రమైన ఖురాన్ గ్రంధం ఆవిర్భావించిన మాసంలో ముస్లిం సోదరులు చేపట్టే ఈ ఉపవాస దీక్షలు ఎంతో ఉన్నతమైనవని…

Read Full News

రాహుల్ ఘండి చిక్కుల్లో పడబోతున్నాడా ?

పార్థ సారథి పొట్లూరి:  రాహుల్ మామూలుగా కాదు పీకల్లోతు కష్టాలని ఎదుర్కోబోతున్నాడు ! 1. రెప్రెసెంటిషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1959 [Representation of the People Act, 1951] ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరన్నా కనుక ఏదేని కోర్టులో దోషిగా నిర్ధారించబడి కనీసం రెండేళ్ళు జైలు శిక్ష కనుక పడి నట్లయితే అతడు /ఆమె పార్లమెంట్ సభ్యత్వం ని కోల్పోతారు ! 2. దీనిప్రకారం రాహుల్ తన లోక్సభ సభ్యత్వం ని కోల్పోయే ప్రమాదం ఉంది….

Read Full News

ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా?

Nancharaiah merugumala (senior journalist) ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషిస్తే నేరం, ఇప్పుడు ఓబీసీలను ఇంటిపేరుతో కించపరిచినా నేరమేనని రాహుల్‌–మోదీ కేసులో తేలిందా? అనుసూచిత కులాలు (ఎస్సీలు–దళితులు), అనుసూచిత జాతుల (ఎస్టీలు–ఆదివాసీలు) వారిని కులం పేరుతో కించపరిస్తే, దూషిస్తే… ఈ నేరం చేసినవారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. నరేంద్రమోదీ వంటి వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు చెందిన వ్యక్తిని ఇంటి పేరుతో తక్కువ చేసి మాట్లాడితే న్యాయస్థానాలు శిక్ష విధిస్తాయని గురువారం గుజరాత్‌ నగరం సూరత్‌…

Read Full News

రాహుల్ గండి కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు !

పార్థ సారథి పొట్లూరి: 2019 ఏప్రిల్ లో కర్ణాటక లోని కోలార్ పట్టణం లో  ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రాహుల్ గండి ‘మోడీ ‘ అనే ఇంటి పేరు వున్న వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు అంటూ విదేశాలకి పారిపోయిన ‘నీరవ్ మోడీ’,’లలిత్ మోడీ ‘ ల పేర్లని గుర్తుచేస్తూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ ని విమర్శించాడు !  మోడీ అనే ఇంటి పేరు గల వాళ్ళు అందరూ దొంగలు…

Read Full News

లిక్క‌ర్ స్కాంతో ఆప్‌ స‌ర్కార్ బ‌ద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన లిక్క‌ర్‌ స్కాం ఆప్ స‌ర్కార్ ను అప్ర‌తిష్ట‌పాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్ర‌తిప‌క్ష నేత‌లు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గ‌ద్దే దిగిపోవాలంటూ వెల‌సిన పోస్ట‌ర్లు ఆప్ నేత‌ల‌ను మ‌రింత ఇరకాటంలో ప‌డేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్ట‌ర్లు అంటించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…

Read Full News

కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది!

Nancharaiah merugumala: ( senior journalist) ‘సాయాజీ శిందేకి తెలుగు సినిమాల్లో అన్ని అవకాశాలివ్వడమేంటి?’ అని ప్రశ్నించిన రోజునే కోట శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నాడా? అనే అనుమానం వచ్చింది! డబ్బు సంపాదించాలనే ఆశతో తాను మరణించినట్టు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేశారని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు వాపోయారని ఉగాది రోజు కొన్ని పత్రికలు తెలిపాయి. సినిమాల్లో నటించడం తగ్గినాగాని ఇంకా బతికే ఉన్న నటీనటులు మరణించినట్టు వార్తలు సామాజిక మాధ్యమాల్లో రావడం ఇప్పుడు…

Read Full News

రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?

పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది ! తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు ! రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి…

Read Full News

కొత్త రకం మొబైల్ ఫోన్ పేమెంట్ మోసం !

పార్థ సారథి పొట్లూరి: ఇప్పటివరకు మనకి మీ ఆధార్ నంబర్ బాంక్ అకౌంటు కి లింకు చేయండి లేదా మీ అకౌంటు మూతపడుతుంది అంటూ ఫ్రాడ్ కాల్స్ లేదా ఫ్రాడ్ మెసేజెస్ వచ్చి మీ అకౌంటు లో డబ్బు మాయం అయ్యేది ! బాంకులు నేరుగా వినియోగ దారుల ఫోన్ నంబర్స్ కి మెసేజెస్ పంపుతూ బాంకు ఎలాంటి ఆధార్ నంబర్ కానీ pan నంబర్ కానీ ఆడగదు ఒకవేళ ఎవరన్నా ఇలా అడిగితే దయచేసి స్పందించవద్దు…

Read Full News

బిజెపిని ఓడించలేం… ప్రతిపక్షాలకు ప్రశాంత్ కిషోర్ సలహా

2024లో విప‌క్షాల ఐక్య‌త‌పై ప్ర‌శాంత్ కిశోర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత అస్థిరమైనది.. సైద్ధాంతికంగా భిన్నమైనది కనుక “ఎప్పటికీ పనిచేయదు” అని ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త జోస్యం చెప్పారు. ఓజాతీయ చానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్ర‌శాంత్ కిశోర్ ఈవ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌న్హారం. ప్రతిపక్షాల ఐక్యత క్లిష్ట‌త‌ర‌మైన‌ద‌ని.. పార్టీలను నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. మీడియాలో ప్రతిపక్ష కూటమి పార్టీలు, నాయకులు కలిసి రావడాన్ని చూస్తున్నామ‌ని.. ఎవరు ఎవరితో…

Read Full News

ఏపీలో కాంగ్రెస్ ఆఫీసుల‌కు తాళాలు?

ములిగే న‌క్క మీద తాటిపండు ప‌డ్డ‌ట్టు ఆంధ్రప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి త‌యారైంది. కోమాలో కొట్టుమిట్టాడుతున్న ఆపార్టీకి జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం బ‌కాయిల రూపంలో ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు, ఆస్తులకు సంబంధించిన‌ బ‌కాయిలు త‌క్ష‌ణ‌మే క‌ట్టాల‌ని ఆదేశాలు జారీ చేసింది. క‌ట్ట‌ని ప‌క్షంలో ఆఫీసుల‌కు తాళాలు ప‌డే అవ‌కాశం ఉందని హెచ్చరికలు పంపింది. ఏపీ పీసీసీ గిడుగు రుద్ర‌రాజు బ‌కాయిల చెల్లింపు విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ల‌గా.. మాకేం సంబంధం…

Read Full News
Optimized by Optimole