క్రేజీవాల్ కు ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య వార్నింగ్..

పార్థ సారథి పొట్లూరి:నా భర్తని జైలులో నుండి బయటికి తెప్పించకపోతే నీ బండారం అమిత్ షా ముందు బయటపెడతాను  కేజ్రీవాల్ ని బెదిరించింన ఆప్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ భార్య..!! 30 వ తేదీ మే నెల 2022 న ED మనీలాండరింగ్ కేసులో ఆప్ విద్యుత్ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ని అరెస్ట్ చేసింది !ఇప్పటికి 10 నెలల నుండి సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నాడు కానీ బెయిల్ రాలేదు!ఈ నేపధ్యంలో…

Read Full News

ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..

విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు  ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…

Read Full News

ఏకపక్ష కావిలింతకు భయపడే రాహుల్ పై అనర్హత వేటు వేయించారా?

Nancharaiah merugumala (senior journalist) రాహుల్‌ నుంచి మరో ఏకపక్ష కావిలింతకు భయపడే నరేంద్రభాయ్‌ 52 ఏళ్ల బ్యాచిలర్‌ పై అనర్హత వేటు వేయించారా? కిందటి పార్లమెంటు ఎన్నికలకు పది నెలల ముందు అంటే 2018 జులై 21న రాఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, లౌకికవాదం, మహిళల భద్రత, జీఎస్టీ వంటి విషయాలపై బీజేపీ సర్కారుపై పదునైన మాటలతో దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ. ఆయన ఆ రోజు ఖాదీ కుర్తా, పాయిజామా ధరించి…

Read Full News

Nalgonda: లా విభాగంలో రామకృష్ణకు గోల్డ్ మెడల్..

నల్లగొండ: జిల్లాకు చెందిన రామకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది.  నేరేడుగొమ్ము మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ  హైదరాబాద్‌లోని బండ్లగూడ అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో 2021 వ సంవత్సరంలో లా డిగ్రీ పూర్తిచేశాడు. బ్యాచ్ లో టాపర్ గా నిలిచాడు. ప్రస్తుతం అతను అడ్వకేట్ ప్రాక్టీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అరోరా   కళాశాల యాజమాన్యం శనివారం ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు.  జస్టిస్ చేతుల మీదుగా లా…

Read Full News

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక‌లకు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల తొలిజాబితాను విడుద‌ల చేసింది. 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటిచేయ‌నున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వరను , కొరటగెరె (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పార్టీ బరిలోకి దింపింది. మాజీ మంత్రులు కేహెచ్ మునియప్ప (చితాపూర్) , కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే వరుసగా…

Read Full News

సౌభాగ్యగౌరి వ్రత పురాణ గాథ..

చైత్ర శుక్ల పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రులలో మూడోరోజు “సౌభాగ్యగౌరీ వ్రతం” ఆచరిస్తారు. దాక్షాయణి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవత్పర్వతానికి కూతురుగా పుట్టింది. పర్వతునికి పుత్రికగా పుట్టింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు పార్వతి అనే పేరువచ్చింది. పార్వతి పర్యాయనామాల్లో గౌరి అనేది ప్రసిద్ధమైనది. ఆమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందడానికి తపస్సు చేసింది. ఆమె తపస్సు చైత్రమాసంలో శుక్ల తదియనాడు ఫలించింది. అందుచేత ఈరోజు గౌరీ పేరజరిగే ఒక పర్వమైంది. ఈ వ్రతమును…

Read Full News

లాలూ ప్రసాద్ తో రాహుల్ గాంధీకి పోలికా?

Nancharaiah merugumala (senior journalist) రెండేళ్లకు పైగా జైలు శిక్ష కారణంగా బిహార్ ప్రజానాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ కోర్టుల్లో శిక్షలు పడి లోక్ సభ సభ్యత్వానికి అనర్హులు కావడం తప్ప వారి మధ్య ఏమైనా పోలిక ఉందా? లాలూ రాజకీయ, సామాజిక నేపథ్యం, బిహార్ ముఖ్యమంత్రిగా విలక్షణ పాలన వంటి గొప్ప విషయాలు పరిశీలిస్తే… ఇందిరమ్మ పెద్ద…

Read Full News

రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయాడు.. సీనియర్ల విలువ తెలిసింది..

పార్థ సారథి పొట్లూరి: అనుకున్నట్లుగానే రాహుల్ ఘండి లోక్ సభ్య సభ్యత్వాన్ని కోల్పోయాడు ! రాహుల్ కి ఇప్పుడు తన పార్టీలోని సీనియర్ నాయకుల అవసరం కనిపించింది హఠాత్తుగా ! ఇన్నాళ్ళూ ఈ వృద్ధులు కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి వీలు లేదు అంటూ మంకు పట్టు పట్టిన రాహుల్ కి అకస్మాత్తుగా తన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడే సరికి వాళ్ళ అవసరం కనిపించి,పిలిపించి మరీ మీటింగ్ పెట్టాడు ! అన్ని ప్రతిపక్షాలు కలిసి పార్లమెంట్ నుండి…

Read Full News

ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా?

Nancharaiah merugumala (senior journalist) వాజపేయి వంటి బ్రాహ్మణ ప్రధాని పాలనలో ఇలా జరిగేది కాదు! ఓబీసీ ‘తేలీ’ మోదీ వల్లే రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిందనే కొందరి బాధ సబబేనా? గుజరాతీ మోధ్ ఘాంచీ (తేలీ) కుటుంబంలో పుట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆయన ఇంటిపేరుతో కించపరిచారనే కారణంతో ఫస్ట్‌ ఫ్యామిలీ (నెహ్రూ–గాంధీ) రాజకీయ వారసుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ హరీశ్‌ హస్ముఖ్‌ వర్మ గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించారు….

Read Full News
Optimized by Optimole