బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానుల హృదయాలను గెలిచి.. అత్యధిక ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా.. తనదైన ఆట తీరుతో మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు సన్నీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్‌, శ్రీరామచంద్ర ఎలిమినేట్‌ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్‌ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను…

Read More

సుఖేష్ చంద్రశేఖర్ కేసులో విస్తుగోల్పే విషయాలు వెలుగులోకి!

సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో తవ్వే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 200కోట్ల మోసం కేసులో అరెస్టైన సుఖేశ్‌.. ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్నాడు. అయితే అక్కడ తనకు ఖరీదైన వసతులు కల్పించడంతో పాటు స్వేచ్ఛగా ఉండేందుకు వీలుగా జైలు సిబ్బందికి సుఖేశ్‌.. ప్రతి నెలా కోటి రూపాయలు లంచం ఇస్తున్నట్లు తాజాగా ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల…

Read More

యూపీ పై బీజేపీ ఫోకస్!

యూపీపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది బీజేపీ సర్కార్‌. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండటంతో అనేక అభివృద్ది పనులను ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ.. షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేశారు. గంగా ఎక్స్​ప్రెస్​వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని ప్రధాని పేర్కొన్నారు. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్​ప్రదేశ్​ నిలుస్తుందన్నారు. అటు యోగీ ఆదిత్యనాథ్‌ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోదీ. యూపీ ప్లస్ యోగి…

Read More

పంజాబ్ లో బీజేపీ పొత్తు ఖరారు!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికి.. పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. అమరీందర్ సింగ్​తో భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ ఇన్​ఛార్జ్​ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో…

Read More

కొత్త త్రిదళాధిపతిగా ఎంఎం నరవణెకే..?

కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. మరోవైపు కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా…

Read More

కోహ్లీ_గంగూలీ వివాదంపై స్పందించిన మాజీ ఓపెనర్!

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వివాదంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 కెప్టెన్సీ విషయంలో తననెవరూ సంపద్రించలేదని విరాట్ చెప్పగా… సారథ్య బాధ్యతల నుంచి వైదొలగొద్దని తాను కోహ్లీకి వ్యక్తిగతంగా చెప్పినట్టు నాలుగైదు రోజుల క్రితం గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. తాజాగా.. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ వివాదంలో అసలు నష్టపోయింది భారత క్రికెట్ అని ఆవేదన…

Read More

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!

భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…

Read More

దేశంలో గుబులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరీయంట్!

భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్‌ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్‌ అయిన కేంద్రం…విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది. అటు తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ టెస్టులను…

Read More

అమ్మాయిల పెళ్లి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!

అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు 18ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టం ప్రస్తుతం ఉండగా.. దానిని 21ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. వివాహ వయసు విషయంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా తొలగించాలన్న అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం దేశంలో కనీస వివాహ వయసు అబ్బాయిలకు21ఏళ్లు, అమ్మాయిలకు 18ఏళ్లుగా ఉంది. దీనిపై గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య…

Read More

వణికిస్తోన్న ఒమిక్రాన్..ఒక్కరోజే 16 కేసులు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌…. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్‌లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్‌ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 57…

Read More
Optimized by Optimole