ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక
స్వదేశంలో ఇంగ్లాండుతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు 18 మంది సభ్యులు గల భారత జట్టును జాతీయ సెలక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. పెటర్నిటీ సెలవులపై ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఇక బ్రిస్బేన్ టెస్ట్ హీరోలు పంత్, సుందర్, గిల్, సిరాజ్, ఠాకూర్ లకు జట్టులో స్థానం లభించింది. స్టాండ్ బై వికెట్ కీపర్గా తెలుగు కుర్రాడు భరత్…