Headlines

TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…

Read More

Nalgonda: చిరంజీవి _ రామ్ చరణ్ యువత అధ్వర్యంలో ఘనంగా చరణ్ జన్మదిన వేడుకలు..

RamcharanBirthday:   మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు నల్లగొండ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి . ఈ సందర్భంగా పట్టణంలోని  భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన  రక్తదాన శిబిరంలో.. పలువురు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా  చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అలుగుబేల్లి రామిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి ,…

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More

National: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..

National: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం అధికారికంగా ఎన్నుకుంది. కోల్‌కతాలోని విశ్వబంధు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ సువేందు అధికారి పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించగా, శాసనసభా…

Read More

కుటుంబ పాలన విముక్తే థ్యేయంగా సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సర్వం సిద్ధమైంది. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు సంజయ్.తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని తెలిపే ప్రదేశాలతో పాటు.. స్వరాష్ట్రంకోసం ఆత్మబలిదానాలు చేసిన గ్రామాల గుండా పాదయాత్ర కొనసాగనుంది. వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణలో అవినీతి.. కుటుంబ పాలన విముక్తికే యాత్ర కొనసాగనున్నట్లు కమళదళపతి స్పష్టం చేశారు. ఇక…

Read More

మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు…

Read More

దయాకర్ కామెంట్స్ పై కోమటిరెడ్డి అభిమానులు ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!

మునుగోడు కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చేలరేగుతోంది. గతంలో పాకిస్తాన్ అనుకూలంగా దయాకర్ చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులు దయాకర్ పై మాటలతో విరుచుకుపడుతున్నారు. రేవంత్ కూ బానిసిలా వ్యవహరిస్తూ .. కోమటిరెడ్డిపై చేసిన అనూచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోమటిరెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ ఇలా చేసే బహిష్కరణకు గురయ్యారని గుర్తు చేశారు. ఇక ముునుగోడు సభలో మాట్లాడిన…

Read More
Optimized by Optimole