BJPDHARNA: బీజేపీ మహాధర్నాను విజయవంతం చేయండి : కేంద్ర‌మంత్రి బండిసంజ‌య్

Bandisanjay:   ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న‌ట్లు కేంద్ర‌హొంశాఖ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈమేర‌కు మూసీ బాధితుల ప‌క్షాన శుక్ర‌వారం(ఈనెల‌25న‌)ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్ట‌బోయే మహాధర్నాను విజయవంతం చేయాలని కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంద‌న్నారు. లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న…

Read Full News

Minorityvotes: ముస్లీం ఓట్ల చుట్టూ ముగ్గుపోత..!

Muslimvoters: పలు అస్తిత్వాలు, భాషా వైవిధ్యాలు, మత-కుల ప్రభావాల సంఘమంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సముద్రంలో రాజకీయ పార్టీలు ఎత్తుగడల ఈదులాటతో ఓట్లవేట మొదలెట్టాయి. ఎక్కడ? ఏ ఊతం పట్టుకుంటే, అధిక ఓట్లు దక్కి విజయతీరాలు చేరుతామనే వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మూడేసి పార్టీలు జట్లు కట్టిన రెండు ముఖ్య కూటములు, ‘మహాయుతి’, ‘మహా వికాస్ అఘాడి’ (ఎమ్వీయే)లు ఇప్పుడిదే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక వ్యూహం, దాదాపు 12 శాతంగా ఉన్న ముస్లీం మైనారిటీల ఓట్ల చుట్టూ,…

Read Full News

Maharashtra: ఆధిపత్య పోరులో…. ‘మహా’పీఠం దక్కేదెవరికో..?

Maharashtra elections2024: మహారాష్ట్రలో అయిదేళ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’…

Read Full News

BJPTELANGANA: అధ్యక్షుడిగా బండి? కలిసొచ్చిన చలో సెక్రటేరియట్..!

BJP Telangana: తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష కుర్చీ పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.త్వ‌ర‌లోనే పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఎవ‌రికివారు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈక్ర‌మంలోనే గ్రూపు 1 అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుగా మాజీ అధ్యక్షుడు , కేంద్ర‌హోంశాఖ‌ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ చేప‌ట్టిన చ‌లో సెక్రెటేరియ‌ట్ ర్యాలీ క‌మ‌లం పార్టీలోపెద్ద‌చ‌ర్చ‌కు దారితీసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత స్తబ్దుగా ఉన్న పార్టీ కేడ‌ర్‌లో బండి ప్రోగ్రాంతో ఒక్క‌సారిగా జోష్ పెరిగింది. దీంతో మ‌రోసారి అధ్యక్షుడిగా బండిసంజ‌య్ ను…

Read Full News

SwamiVivekanand: స్వామి వివేకానంద హుక్కా తాగేవారా..?

సాయి వంశీ: ( వివేకానందుడు తాగిన హుక్కా..!) స్వామి వివేకానంద పొగతాగడాన్ని చాలా ఇష్టపడేవారు. తీర్థయాత్రలు చేసే సమయంలో, వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఖాళీ సమయాల్లో పొగతాగడం ఆయనకు ఉపశమనంగా ఉండేది. ఒకరోజు సాయంత్రం ఉత్తర భారతదేశంలోని ఓ వీధిలో ఆయన నడుస్తూ ఉండగా ఒక గుడిసెలో ఒక వృద్ధుడు హుక్కా తాగుతూ కనిపించాడు. ఆయనకు దాన్ని తాగాలని చాలా కోరిక కలిగింది. ఒకసారి ఆ హుక్కాను తనకిమ్మని ఆ వృద్ధుణ్ని అడిగారు. దానికా వృద్ధుడు సమాధానం ఇస్తూ…

Read Full News

Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read Full News

BJPTELANGANA: తెలంగాణ‌లో బీజేపీ నేత‌ల దూకుడు .. బండి అరెస్ట్ ..!

Telangana:   తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అటు గ్రూప్ 1 నిర‌స‌నకు మ‌ద్ద‌తుగా .. ఇటు హిందు దేవాల‌యాల‌పై దాడిని నిర‌సిస్తూ బీజేపీ నేత‌లు రోడెక్కారు. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయం రంజుగా మారింది. జీవో 29 ను ర‌ద్దు చేయాలంటూ కేంద్ర‌హొం శాఖ స‌హాయమంత్రి బండిసంజ‌య్ కుమార్ , గ్రూపు 1 అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా అశోక్ న‌గ‌ర్ నుంచి సెక్ర‌టేరియ‌ట్ వ‌ర‌కు ర్యాలీగా వెళ్లారు. ఈక్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్త‌త‌కు దారితీసింది….

Read Full News

literature: ‘ఇర్లచెంగి’.. భలే భలేటి కథల మనిషి..!

సాయి వంశీ:   తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి). చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు…

Read Full News

LawrenceBishnoi: బిష్ణోయీ..దావూద్‌ సహా పాత గ్యాంగ్‌స్టర్లంతా చదువులేనోళ్లు.!

Nancharaiah merugumala senior journalist: బాగా తెల్లగా, ఎర్రగాబుర్రగా ఉన్నాడని బిష్ణోయీ కుర్రాడికి బ్రిటిష్‌ ఉన్నతాధికారి హెన్రీ లారెన్స్‌ పేరు! బాలీవుడ్‌ ‘కండలవీరుడు’, ముస్లిం తండ్రికి, హిందూ తల్లికి పుట్టిన అత్యంత లౌకిక పౌరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు ముంబై నగరం బాంద్రాలో నివసించే డీలక్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విజిటర్లు ఎవరినీ ‘టైగర్‌ జిందా హై’ హీరో తన నివాసంలోకి అనుమతించడం లేదు. ఇవి ఇప్పుడు ఇంగ్లిష్‌ న్యూజ్‌ చానల్స్‌లో పదే…

Read Full News
Optimized by Optimole