బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎన్.రాంచందర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో చాలామంది పార్టీలో చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా చాలామంది పార్టీలో చేరుతారని అన్నారు….

Read More

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓప్ర‌క‌ట‌న విడుదల చేశారు. భాజాపా కార్య‌కర్తల ఒత్తిడి మేర‌కే ముఖ్య‌మంత్రి పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశార‌ని తెలిపారు. పెంచిన వేతనాల్ని గ‌త ఏడాది నుంచి మాత్ర‌మే ఇస్తామ‌న‌డం కేసీఆర్ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర…

Read More

సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్

అధికార తెరాస‌కు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజ‌య్‌ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో ‌ మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…

Read More

కేసీఆర్ స్పందించ‌క‌పోవ‌డం అవ‌మాన‌కరం : బండి సంజ‌య్‌

నాలుగేళ్ల చిన్నారిపై హ‌త్యాచారం జ‌రిగితే ముఖ్య‌మంత్రి స్పందించ‌క పోవ‌డం సిగ్గుచేట‌ని భాజాపా రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అన్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను ఎంఐఎం చేతిలో పెట్టడం వ‌ల‌న రాష్ట్రంలో అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయ‌న్నారు. భైంసాలో మ‌జ్లీస్ దౌర్జ‌న్యాలు, హ‌త్య‌చారాల‌కు పాల్ప‌డుతున్న టీఆర్ ఎస్ స‌ర్కార్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. భైంసాలో లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్మ ఉంద‌ని, అక్క‌డి హిందువుల‌ను కాపాడాల‌ని కోరుతూ బీజేపీ నేత‌ల‌తో క‌లిసి సంజ‌య్.. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ…

Read More

రామరాజ్యమే లక్ష్యం : బండి సంజయ్

తెలంగాణలో రామ రాజ్యమే తమ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కామారెడ్డి బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని తెరాస విస్మరించిందని,రానున్న ఎమ్మెల్సి ఎన్నికల్లో పట్టభద్రుల తగిన రీతిలో బుద్దిచెప్పాలని సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మీద నమ్మకంతో ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేరు మార్చి,…

Read More

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More

దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు….

Read More

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

కేసీఆర్ కల్లబొల్లి మాటల్తో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ సాగర్ పర్యటనపై ఆయాన స్పందిస్తూ మీడియాకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని సాగర్ ఎన్నికల ప్రచారం సాక్షిగా కేసీఆర్ పచ్చి అబద్దమాడాడని సంజయ్ తెలిపారు. గిరిజన రైతుల భూములను అధికార ఎమ్మెల్యే కబ్జా చేశారని, ప్రశ్నించిన గిరిజనులపై దాడి చేయించి, జైల్లో పెట్టడంపై ముఖ్యమంత్రి సమాధానం చెబితే బాగుండేదని…

Read More

ఆదివాసీ గిరిజనులు కోసం కరసేవ ప్రారంభం: బండి సంజయ్

తెలంగాణలో పొడుభూములు,అదివాసులు, గిరిజనులు కోసం భాజపా యుద్ధం మొదలెట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంబోడు తండాలో సభలో ఆయన మాట్లాడుతూ.. నాడు అయోధ్యలో రామాలయం కోసం కరసేవ చేశామని నేడు పేదల కోసం గుర్రంబోడు తండా నుంచి కరసేవ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న గిరిజన భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి, వారిమీద అక్రమ…

Read More

ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం : అనురాగ్ ఠాకూర్

కరోనా తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా 2020-21 వార్షిక బడ్జెట్ రూపొందించామని కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సంక్షోభంతో కష్టాల్లో ఉన్నవారిపై ఎలాంటి భారం పడకుండా.. ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూమాని అన్నారు. అనంతరం లఘు ఉద్యోగ భారతి సంస్థ నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు, మేధావులతో చర్చా గోష్టిలో పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూచన…

Read More
Optimized by Optimole