మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల టంగ్ స్లిప్… పెకాషం పంతులు అంటూ వీడియో వైరల్..!!

మునుగోడులో ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ గడువు నేటితో ముగియనున్న  నేపథ్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడిన వీడియో నెట్టింట హల్…

Read More

మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…

Read More

మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!

మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇవాళ ఒక్కరోజే 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.మొత్తంగా 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం ,శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 14 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. 15 నామినేషన్ల పరిశీలన.. 17…

Read More

మునుగోడులో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీలు..గెలుపుపై ఎవరి ధీమా వారిది..!!

మునుగోడు బైపోల్ ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి.ఇటు బీజేపీ గొల్ల కుర్ముల పేరిట ఆత్మీయ సమావేశం నిర్వ హించి..చేరికలతో కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపంగా.. అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. పీసీసీ రేవంత్ రోడ్ షోలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.ఇక అధికార టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి ప్రచారంతో పాటు చేరికలను వేగవంతం చేశారు. కాగా బీజేపీ చౌటుప్పల్ లో గొల్ల కుర్ముల ఆత్మీయ…

Read More

మునుగోడులో ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ తో గెలవాలని కేసీఆర్ కు సవాల్…!!

మునుగోడు ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.దమ్ముంటే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేరుతో అభ్యర్థిని బరిలోకి దింపాలని సవాల్ విసిరారు.అక్రమ సంపాదనతో ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని కాషాయం నేతలు ఆరోపించారు.ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగిరి తీరుతుందని కుండబద్ధలు కొట్టారు.దళితబంధు, గిరిజన బంధు, పేదలబంధు ఇవ్వాలని కమలం నేతలు డిమాండ్ చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎన్నికుట్రలు…

Read More

మునుగోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సంజయ్ లేఖ.. ఇరకాటంలో టీఆర్ఎస్..!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా  స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన  హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి…

Read More

మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

అడ్డుతొలగించుకోవడానికి కేసిఆర్ 120 కేసులు పెట్టారు: రేవంత్

తనను అడ్డు తొలగించుకోవడానికి కేసీఆర్ తనపై 120 కేసులు పెట్టాడని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుడి మల్కాపూర్, కోతులాపురం, అల్లందేవి చెరువు, సర్వేలు గ్రామాల్లో ఆయన పర్యటించారు.  కాంగ్రెస్ గిరిజనులకు పట్టాలిస్తే.. కేసీఆర్ ఆ భూములు గుంజుకున్నాడని రేవంత్ మండిపడ్డారు. టీఆరెస్ పాలనలో మునుగొడులో గ్రామాలకు సరైన రోడ్లు కూడా వేయలేదని.. అలాంటి వారు ఇక్కడ అభివృద్ధి ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ…

Read More

మంత్రి జగదీష్ రెడ్డిని బీజేపీ నేతలు ఉరికించి కొడ్తరు: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని.. ప్రజల కోసం వచ్చిన ఎన్నికన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా తనవెంట ఉన్నారన్నారు రాజగోపాల్. మంత్రి జగదీష్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు.మూడున్నర ఏండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.డబ్బులతో తన వెంట ఉన్న సర్పంచ్ లను కొనాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. కారునేతల…

Read More
Optimized by Optimole