కాంగ్రెస్ కుటుంబానికి బోఫోర్స్..ప్రధానికి గుజరాత్ అల్లర్లు–భూతాల్లా వెంటాడతాయి!
Nancharaiah Merugumala:(senior journalist) ……………………………………………………………………………… దేశంలో అవినీతి విషయంలో గుత్తాధిపత్యం కాంగ్రెస్ పార్టీది. హిందూ మతోన్మాదాన్ని ఎన్నికల్లో వాడుకోవడం బాగా తెలిసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయాలివి. అయితే, ఈ రెండు కారణాలతోనే ఈ రెండు పార్టీలను పదే పదే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం కుదిరే పని కాదని గత 40 ఏళ్ల చరిత్ర చెబుతోంది. 1987–89 మధ్య కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా వెలుగులోకి వచ్చింది బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు…