pawankalyan: కాశీ చేరుకున్న చంద్రబాబు, పవన్ ఎవరికి పిండాలు పెట్టడానికో!

Nancharaiah Merugumala senior journalist:  తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు కానీ, ఎందరో పెద్ద పెద్ద ఆంధ్రా లీడర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు భీమవరం రెడ్లబ్బాయి గొలుగుమూరి సత్యనారాయణ రెడ్డి మామ రేవంత్.. మొదట కేరళ వయనాడ్ నుంచి, తర్వాత మొన్న యూపీలోని రాయ్ బరేలీలో నామినేషన్ వేసిన రెండు సందర్భాల్లో రెవంతయ్య అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన ప్రత్యక్షమయ్యారు. రేవంత్ చేసిన పనిలో తప్పేం…

Read Full News

APpolitics: వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం: పవన్

PawanKalyan: విజయనగరం జిల్లాలో లభించిన అపూర్వ స్వాగతం చూస్తే కూటమి విజయం ఖాయమైపోయిందని అర్ధమైందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.  మీ ప్రేమాభిమానాలు చూసి జగన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడు, గూండాను బంగాళా ఖాతంలో కలిపేయాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్ధలు కొట్టి… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని  పవన్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం…

Read Full News

తెనాలి నుంచి బ‌రిలో నాదెండ్ల‌.. ఆల‌పాటి ప‌రిస్థితి ఏంటి?

తెనాలి రాజ‌కీయ ర‌స‌కంద‌కాయంగా మారింది. అధికార , ప్ర‌తిప‌క్ష నేతలు నువ్వానేనా త‌ర‌హాలో త‌ల‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే బ‌త్తిని శివ‌కుమార్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో..ఓ ముఖ్య‌నేత ఇక్క‌డి నుంచి పోటిచేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఆయ‌న ఈనియెజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌ట్లు ప్ర‌జ‌లు చెబుతున్నారు.ఇంత‌కు ఆనేత ఎవ‌రూ? ఇప్పుడు ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలోకి దిగుతున్నారు? తెనాలి నియెజ‌క‌వ‌ర్గంలో 40 వేల కాపు..20 వేల క‌మ్మ సామాజిక ఓట్ల‌ర్లు…

Read Full News

ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం తథ్యం: ఎంపీ రఘురామ

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. 12నుంచి 14  శాతం కంటే ఎక్కువ మెజారిటీతో.. ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందన్నారు. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాలు  టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన.. ఇటీవల తాను ప్రాంతాల వారిగా ఫ్లాష్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో టిడిపి కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేటతెల్లమయిందన్నారు. ఉత్తరాంధ్ర లో…

Read Full News

చంద్రబాబు దారే రాహులుకు రహదారి అవుతుందా?

Nancharaiah merugumala: ====================== ఎట్టకేలకు తెలుగుదేశం నేత నారా చంద్ర బాబు నాయుడు బాటలోకి వచ్చాడు కాంగ్రెస్ ఉగ్రనేత రాహుల్ గాంధీ. బాబులా తెల్ల గడ్డం పెంచాడు. నారావారిపల్లె నవ యువకుడి రీతిలో  ఇతర మేధావుల సలహాలు యువ ‘ప్రిన్స్’ వింటున్నాడు. చంద్రన్న 1990ల మధ్యలో అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్’ అనే బంగారు నినాదంతో దాదాపు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ‘జనరంజకంగా’ పరిపాలించారు. ఇప్పుడు అధికారం కోసం దక్షిణం నుంచి ఉత్తరాదికి నడిచిన రాహుల్ చంద్రబాబు తరహాలో…

Read Full News

ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు వైసీపీ చీకటి జీవోను తీసుకొచ్చింది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ప్రతిపక్ష నేతల్ని  అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు.  ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య…

Read Full News

అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!

నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్‌ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…

Read Full News

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read Full News
Optimized by Optimole