గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్
గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేనన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జగిత్యాల నుంచి.. కుటుంబ పోషణ కోసం టెన్త్ క్లాస్ చదివే పిల్లాడు దుబాయ్ కి వలస పోయే దుస్థితి దాపురించిందన్నారు. ప్రతిరోజు 5 బస్సుల్లో జనం ముంబైకి వలస పోతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జగిత్యాల జిల్లా ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా …