BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..

కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్):  పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…

Read More

BJP: బీజేపీ ‘ ఫక్తు అవకాశవాద రాజకీయ పార్టీయే’ అని నిరూపిస్తుందా..?

BjpTelangana: ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ  సిద్ధాంతాలకు తిలోదకాలిస్తోంది. వరుసగా  రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన పార్టీ మూడోసారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని చెప్పడానికి తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ‘పార్టీ విత్‌ యే డిఫరెన్స్‌’ (భిన్నమైన పార్టీ) అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ‘పార్టీ ఫర్‌ పవర్‌ ఓన్లీ’ (అధికారం కోసమే పార్టీ) అన్నట్టు మారిపోయింది.  తెలంగాణలో పార్టీకి ఈ జాడ్యం 2019 పార్లమెంట్‌ ఎన్నికల…

Read More

Bandisanjay:ఫిబ్రవరి 10 నుండి బండి సంజయ్ ” ప్రజాహిత యాత్ర”..!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు.  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు…

Read More

పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ ఓటు బీజేపీకే!

తెలంగాణలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆశించిన కేసీఆర్‌ ఆశలను వమ్ముచేస్తూ తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో మార్పుకు ఓటు వేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి రావడంతో బొటాబొటి ఆధిక్యతతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 2018తో పోలిస్తే 2023లో బీజేపీ ఓట్ల శాతాన్ని రెట్టింపు చేసుకోవడంతో ఆ పార్టీ  రాష్ట్రంలో క్రియాశీలకంగా మరబోతోందని చెప్పవచ్చు. వాస్తవానికి తెలంగాణలో మొదటి నుండి కేసీఆర్‌ ప్రభుత్వం…

Read More

విమర్శలు సరే! వాస్తవాలనూ విస్మరిస్తారా?

శేఖర్ కంభంపాటి ( సీనియర్  జర్నలిస్ట్ ): ప్రస్తుత ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. నిన్న మొన్నటి వరకు  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ మీద ఒంటికాలు మీద లేచేవి. స్వాతంత్ర్య భారతంలో అర్థ శతాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేసిందనే విమర్శలు చేసేవి, ఇప్పుడు చేస్తూనే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశానికి, రాష్ట్రానికి…

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు..

Nancharaiah merugumala senior journalist: ‘తెలంగాణలో బీఆర్ఎస్‌ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్‌ పుంజుకుని కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్‌ సంజయ్‌ కుమార్‌ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి! ‘‘తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్‌ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్‌ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్‌ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్‌ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్‌ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…

Read More

రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌…

Read More

తెలంగాణలో బీజేపీ ‘ బెంగాల్ ‘ వ్యూహం…

BJPTelangana: తెలంగాణాలో బీజేపీ బెంగాల్ వ్యూహాన్ని అమలుచేస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసిఆర్ ను టార్గెట్ చేసిన కమలం దళం ఆయన పోటీ చేయబోయే స్థానాల్లో బలమైన నేతను బరిలోకి దింపి ఓడించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బెంగాల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించిన మాదిరి  కెసిఆర్ ను ఒడిస్తే..తెలంగాణలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ యే న్న భావానను జనాల్లోకి తీసుకెల్లాలని ఆ పార్టీ భావిస్తోంది.  …

Read More

IncTelangana :చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది: ఎంపీ కోమటి రెడ్డి

IncTelangana: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండలం ధర్వేశ్పురంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ప్రాణం పోయినా బిజెపిలోకి పోనని,ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్…

Read More
Optimized by Optimole