Maghamasam: శివుడికి అత్యంత ఇష్టమైన మాసం..ఇలా చేస్తే సకల శుభాలు…!

Maghamasam:  మాఘమాసం శివుడికి అత్యంత ఇష్టమైన మాసం.  మాఘం అనగా  యజ్ఞం. యజ్ఞం యుగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఈ మాసంలో క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైందని పురాణాలు చెబుతున్నాయి. ఈమాసంలో మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదిస్నానాలు చేయడం మాఘమాసం సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నానం పుణ్యఫలమే మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మాఘమాసంలో…

Read Full News

Bandisanjay: ప్రజాహిత యాత్రతో సమర శంఖం పూరించిన బండి సంజయ్..!!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర భారీ జన సందోహం మధ్య ప్రారంభమైంది. కొండ గట్టు అంజన్న ఆశీర్వాదంతో సంజయ్.. మేడిపల్లి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు. తొలిరోజే  సంజయ్ కు మద్దతుగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు  తరలివచ్చారు. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. యాత్రలో భాగంగా మేడిపల్లి మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో  మమేకం అవుతూ ఎంపీ ముందుకు సాగారు. ప్రజల కష్టాలను తెలుసుకొని…

Read Full News

Tamilnadu: తొలి రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్ గా ట్రాన్స్ జెండర్..

Transgendersindhu: ఇటీవల అన్ని రంగాల్లో హిజ్రాల ప్రాబల్యం పెరిగిపోతోంది. తక్కువ స్థాయి అన్యున్నత భావన నుంచి మేమేం తక్కువ స్థాయికి వారు ఎదుగుతున్న తీరు ” న భూతో న భవిష్యతి” . ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన ఓ హిజ్రా తొలిసారిగా రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైంది.  ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళనాడు నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు ఎన్నో అవమానాలను తట్టుకొని రైల్వే టిక్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైంది. శుక్రవారం సింధు దిండుక్కల్‌ రైల్వే…

Read Full News

BharatRatna: పీవీకి భారతరత్న ఇబ్బందికరం కాబట్టే.. ఇద్దరు ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?

Nancharaiah merugumala senior journalist: ” పీవీకి భారతరత్న విడిగా ఇవ్వడం బీజేపీకి ఇబ్బందికరం కాబట్టే మరో ఇద్దరు దివంగత ప్రముఖుల పేర్లతో కలిపి ప్రకటించేశారా?” హరియాణా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ లో కుటుంబ మూలాలున్న గొప్ప వ్యవసాయ అర్థశాస్త్రవేత్త, రాజకీయ, సామాజిక సంస్కర్త, రైతు నాయకుడు చౌధరీ చరణ్‌ సింగ్, తమిళనాడుకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్లతో కలిపి తెలంగాణ తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు గారికి భారతరత్న పురస్కారం ప్రకటించింది…

Read Full News
Eagle, Eagle movie review, raviteja,

Eaglereview: “ఈగల్ రివ్యూ” .. రవితేజ హిట్ ట్రాక్ లో పడ్డట్లేనా?

EAGLEREVIEW:  మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్. కావ్య థాపర్ , అనుపమ పరమేశ్వరన్  కథనాయికలు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఈగల్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈమూవీతోనైనా హిట్ ట్రాక్ లో పడ్డాడా? లేదా తెలుసుకుందాం.. కథ ; ఆంధ్రప్రదేశ్  మదనపల్లె తాలుకాలోని తలకోన అడవుల్లో ఓగిరిజన తండా వాసులు సహదేవవర్మ(రవితేజ) విగ్రహన్ని పెట్టుకొని ఆరాధిస్తుంటారు. అయితే జర్నలిస్ట్…

Read Full News

Pmmodi: నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు!

Nancharaiah merugumala senior journalist: ” ప్రధాని పదవిలో ఉండగా ‘భారతరత్నాలు’గా మారిన నెహ్రూ, ఇందిర బాటలో నడవకపోతేనే నరేంద్ర మోదీ చరిత్రలో నిలుస్తారు! ”  భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ, మూడో ప్రధాని, ఆయన కూతురు ఇందిరా ప్రియదర్శినీ నెహ్రూ–గాంధీలకు వారు అధికారంలో ఉండగానే భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. మరో రకంగా చెప్పాలంటే చాచాజీ, ఇందిరాజీలు తమకు తామే భారత అత్యున్నత పౌర పురస్కారం ఇప్పించుకున్నారు. పది సంవత్సరాల…

Read Full News

Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!

Nancharaiah merugumala senior journalist: ” నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్‌ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్‌ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! “ పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒడిశాలో చెప్పారు. మోదీ జీ పుట్టింది జనరల్‌ కాస్ట్‌ లోనేని కూడా ఆయన వివరించారు. నిజమే మోదీ పుట్టిన 49 ఏళ్లకు 1999 అక్టోబర్‌ 27న గుజరాత్‌ ప్రభుత్వం ఆయన…

Read Full News