ఆర్మీ ఆఫీసర్ పాదాలను తాకిన చిన్నపాప..ప్రశంసల వర్షం.. వీడియో వైరల్

దేశ సరిహద్దుల్లో రేయింబవళ్లు పహార కాసే సైనికుల సేవలు వెలకట్టలేనివి. వారి త్యాగాలు మరువలేనివి. వీధుల్లో భాగంగా వారు తారసపడితే చాలు గౌరవవించిన వీడియోలు ఇంటర్నెట్లో చాలానే చూశాం. అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ చిన్న అమ్మాయి ఆర్మీ ఆఫీసర్ పాదాలు తాకి కళ్లకు అద్దుకున్న వీడియో నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంది.ఈ వీడియోను బెంగళూరు పార్లమెంటు సభ్యుడు పిసి మోహన్ శుక్రవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. ” దేశభక్తిని యువతలో పెంపొందించడం తల్లిదండ్రుల…

Read Full News

కాంగ్రెస్ ను చావనీయండి గాని నెహ్రూ-గాంధీ ఫ్యామిలీని కాపాడుకోండి!

Nancharaiah Merugumala (senior journalist): ————————————–^——— 2004 నుంచీ చావు దారిన వేగంగా నడుస్తోంది కాంగిరేసు పార్టీ. పదేళ్ల తర్వాత దిల్లీలో అధికారం కోల్పోయింది. నరేంద్రమోదీ ప్రధాని అయినాక కాంగ్రెస్ పతనానికి పార్టీ అధ్యక్షరాలు సోనియాగాంధీ, ఆమె కొడుకూకూతుళ్లు రాహుల్, ప్రియాంకా పరోక్షంగా కారకులయ్యారు. వారి దివంగత కుటుంబ పెద్ద ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు (1969,1978) చీల్చి దాన్ని బతికించారు. ఈ స్థాయిలో తర్వాత కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ గాని, ఎన్డీ తివారీ-అర్జున్ సింగ్…

Read Full News

APnews: సినీ నటి వాసుకి (పాకీజా) జనసేనాని ఆర్థిక సాయం..!

Apnews: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆపన్నహస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన జనసేనాని రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్  చేసిన సాయానికి పాకీజా…

Read Full News

Haryana: హర్యానా బరిలో కాంగ్రెస్ జోరును.. బీజేపీ ఆపేనా..?

Haryanaelections2024: హర్యానా చిత్రం స్పష్టమౌతోంది. ఒకే విడతలో ఈ శనివారం పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ ఎన్నిక, అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్ మధ్య దాదాపు ముఖాముఖి పోటీగానే తయారయింది. చిన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగులనుంది. గత మే నెల్లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికే స్వల్ప ఆధిక్యత సాధించిన కాంగ్రెస్… ఆ పట్టు సడలనీకుండా పురోగమిస్తోంది. ఆధిక్యతా స్పష్టమౌతోంది. పదేళ్ల వరుస పాలన వల్ల ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పలు అంశాలు…

Read Full News

TTD: శ్రీవాణి దర్శన టికెట్లలో కీలక మార్పులు.. జూన్ 10 నుంచి కొత్త విధానం అమలు

తిరుమల, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చేపట్టింది. భక్తులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం రోజుకు 300 శ్రీవాణి దర్శన టికెట్లను ఇప్పటికే రూ.10,000 విరాళం చెల్లించి దర్శనం కోసం ఎదురుచూస్తున్న దాతలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే…

Read Full News

ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట‌: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ “ఓటు” కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి పునాది ఓట‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.సూర్యాపేట జూనియ‌ర్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన‌ జాతీయ ఒట‌ర్ల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ గతిని మార్చగల శక్తి” ఓటు ” కు ఉంద‌న్నారు..ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి.. వ్యవస్థ మార్పు కు నాంది పలికేదే “ఓటు” అని గుర్తుచేశారు. ప్ర‌జానాయ‌కుడిని ఎన్నుకొవ్వాలంటే 18 ఏళ్లు నిండిన యువత…

Read Full News

‘ప‌ఠాన్’ రివ్యూ..(బాయ్ కాట్ బాబులు ఫుల్ హ్యాపీ)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం ‘ప‌ఠాన్’ . దీపికా ప‌దుకుణే క‌థానాయిక‌. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించింది. ఎన్నో వివాదాల మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఈచిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. షారుఖ్ కెరీర్ లోనే భారీ బ‌డ్జ్ ట్ తో తెర‌కెక్కిన ‘ప‌ఠాన్‌’ పై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వారి అంచ‌నాలు నెర‌వేరాయా? లేదా అన్న‌ది చూద్దాం! క‌థ‌……

Read Full News

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read Full News

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..

దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 వేల 73 కేసులు నిర్థారణ అయ్యాయి. మహమ్మారితో 21 మంది చనిపోయారు. కరోనా నుంచి 15 వేల 2 వందల 8 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివవ్ కేసుల సంఖ్య 94 వేల 420 గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ…

Read Full News

అనారోగ్యంతో కన్నూమూసిన నటి మీనా భర్త!

ప్రముఖ నటి మీనా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. జనవరిలో కరోనా సోకింది. ఈనేపథ్యంలో ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా.. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది . దీంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు….

Read Full News
Optimized by Optimole