పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పై కాల్పులు..

Sambashiva Rao : ============= Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పులు క‌ల‌కలం సృష్టించింది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో.. ఆక్టోబ‌ర్ 28 నుంచి ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ర్యాలీ అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఆయ‌న కంటైన‌ర్ పై ఎక్క‌గానే దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయన రెండు కాళ్ల‌కు గాయాలైయ్యాయి. స్థానికంగా ఉన్న…

Read More

Moviereview: ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ..’ రౌడీ ‘ హిట్ కొట్టినట్టేనా..?

Familystarreview:  విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్ ‘. సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘ గీత గోవిందం ‘ ఫేం పరశురామ్ దర్శకుడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ : గోవర్ధన్ ( విజయ్ దేవరకొండ…

Read More

Telangana:అసెంబ్లీ సాక్షిగా బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయటపడింది: హరీష్ రావు

Telangana: మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడే భాయ్.. చోటే భాయ్ బంధం అసెంబ్లీ సాక్షిగా బయటపడిందన్నారు.కేంద్రం రాష్ట్రానికి నిధులివ్వకపోయినా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పల్లెత్తు మాట కూడా అనకపోవడం బంధంలో భాగమేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. కేంద్రం నిధుల విడుదలలో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని..అయినా ఏమీ అనకుండా బడేభాయ్ తో ఉన్న బంధాని అసెంబ్లీ సాక్షిగా…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహం!

తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది. దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. దీంతో నాడు తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగానే అభ్యర్థుల జాబిత ప్రకటించాలని బీజేపీ జాతీయ అధినాయకత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ఇప్పటికే కొన్నింటిలో ఒకరు.. మరికొన్నింట్లో ఇద్దరు లేక…

Read More

పుష్య అమ‌వాస్య‌ విశిష్ట‌త..

పుష్య అమ‌వాస్య‌నే పౌష అమ‌వాస్య అని కూడా అంటారు. హైందవంలో పౌష అమ‌వాస్య‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఈమాసంలో పితృదేవ‌త‌ల‌కు దానం చేయడం వ‌ల‌న వైకుంఠ ప్రాప్తి క‌లుగుతుంద‌ని న‌మ్మ‌కం. ఈరోజున ఉప‌వాసం ఉండ‌టం వ‌ల‌న పితృదోషం, కాల‌స‌ర్ప దోషాల నుండి విముక్తి క‌లుగుతుంద‌ని పండితులు చెబుతారు. ఈరోజున సూర్య‌డిని ఆరాధించ‌డం వ‌ల‌న స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. జ్యోతిష్య ప్ర‌కారం ఇలా చేయాలి.. పౌష అమ‌వాస్య రోజున వేకువ జామునే స్నానం చేసి మందార పుష్పాల‌తో సూర్య…

Read More

ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్.. సీఎం కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు అమలుకాకుండా కేసీఆర్ మహా కుట్ర పన్నారని మండి పడ్డారు. దమ్ముంటే రిజర్వేషన్లు అమలుపై ఉప్పల్ నియోజకవర్గంలోని విఘ్నేశ్వర ఆలయం ముందు ప్రమాణం చేద్దాం రమ్మంటూ  సవాల్ విసిరారు. ప్రజా సమస్యలు పట్టించుకోని ఏకైక సీఎం కేసిఆర్ మాత్రమేనని సంజయ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి కేసిఆర్.. గిరిజన మహిళ…

Read More

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో…

Read More

ఆరునూరైనా సూర్యాపేటలో కాషాయ జెండా ఎగరేస్తాం: సంకినేని వెంకటేశ్వరరావు

తెలంగాణలో కొనసాగుతున్న అవినీతి పరిపాలనను అంతం చేయడానికి బీజేపీ  సిద్ధమైందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. శనివారం జరగనున్న పోలింగ్ బూత్ కార్యకర్తల సమ్మేళనం సభా స్థలిని ఆయన కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ ద్వారా పోలింగ్ బూత్ కార్యకర్తల తో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రం తో పాటు, సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిని కార్యకర్తల సమన్వయంతో ప్రజల్లోకి…

Read More
Optimized by Optimole