INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!

INC: కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ,…

Read More

Balagopal: కోస్తాంధ్ర కాపుల్లో యూపీ యాదవుల పోకడలున్నాయన్న బాలగోపాల్‌ మాటలు.. ఇప్పటికీ అర్థం కాలేదు..!

Nancharaiah merugumala senior journalist: (కోస్తాంధ్ర కాపుల్లో యూపీ యాదవుల పోకడలున్నాయన్న డా.కె.బాలగోపాల్‌ గారి మాటలు 1988లో సరిగా అర్ధం కాలేదనే ఇప్పటికీ అనుకుంటున్నా!) ======================= పేద, బలహీన ప్రజల హక్కుల రక్షణకు, వారి మంచి కోసం పనిచేసిన ఇద్దరు గొప్ప మనుషులు 57 ఏళ్లకే కన్నుమూయడం భారతదేశానికి తీరని లోటు. ఈ విషయం ఇలా ‘సాంప్రదాయబద్ధంగా’ చెప్పకుండా కాస్త ఘనంగా వర్ణించడం నాకు తెలియడం లేదు. ఈ ఇద్దరు ఉద్ధండుల మధ్య వయసులో 42 సంవత్సరాలు…

Read More

Telangana: “KTR మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు”: గజ్జల కాంతం

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్‌కి ఎమ్మెల్యే…

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

OTT: వలస నిట్టూర్పుల మాటున మానవత చూపిన ఓదార్పు..!

TouristFamily:  ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా గురించి చెప్పేముందు, ఓసారి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుందాం. సరిహద్దు దేశాల నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వలసవచ్చే పరిస్థితి అమెరికాతోసహా ప్రపంచంలోని దాదాపు ప్రతిదేశం అనుభవిస్తూనే ఉంది. ఉన్న దేశంలో తిండి లేక, చేయడానికి పనిలేక, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనిపించక పక్క దేశాలకు వెళ్లి ఎలాగోలా బతికేద్దామనుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంది. మనదేశానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వలసదారులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే…

Read More

karnataka: కర్ణాటకలో రెండేళ్ల కాంగ్రెస్ పాలన పై తీవ్ర వ్యతిరేకత: పీపుల్స్ పల్స్

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ‘‘పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్’’ సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత…

Read More

మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్.. కప్ గెలిచితీరుతామన్న హర్మన్..!!

మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో  థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి  ఫైనల్ లో ప్రవేశించింది.  టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా  రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో  మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ సెమీ…

Read More

Apnews: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పై ప్రజాభిప్రాయం: పీపుల్స్ పల్స్

Peoplespulse: రాష్ట్ర ఖజానాపై తక్కువ భారంతోనే ఆంధ్రప్రదేశ్ లోని 70 శాతం పైగా కుటుంబాలకు నేరుగా ఆర్థిక లబ్ది చేకూరుస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ (దీపం-2) పథకాన్ని చిన్న చిన్న మార్పులతో మరింత ప్రభావవంతగా అమలు జరుపవచ్చు. ఇప్పుడున్న పద్దతిలోనే నడిపిస్తే… లబ్దిదారులు సంతృప్తి చెందక పోగా పథకం ప్రజాదరణ కోల్పోయి, రాజకీయ లబ్ది కూడా మిగలని ప్రమాద పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిప్రాయం ప్రకారం, ‘జీరో బిల్లింగ్’పద్దతిలో ఉచిత సిలిండర్ అందించడమనే చిన్న సాంకేతిక మార్పు ద్వారా…

Read More

ప్రధాని తల్లి అంత్యక్రియలు చడీ చప్పుడు లేకుండా జరిగాయా?

బీజేపీ ‘గణతంత్ర’ స్వభావం వల్లే ప్రధాని తల్లి అంత్యక్రియలు అలా  జరిగాయా? స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెసెస్‌) కుటుంబం నుంచి పుట్టిన పార్టీ బీజేపీ. ఈ పార్టీ రెండో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మరణం, అంత్యక్రియల వార్త ఒకే రోజు పత్రికల్లో చదివాం. సాధారణంగా పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న నేతల తల్లిదండ్రులు కన్నుమూస్తే రెండు మూడు రోజుల జాతర జరగడం మన అనుభవం. బ్రిటిష్‌…

Read More
Optimized by Optimole