Antidefectionact: పరస్పర నిందకు పగ్గాలెప్పుడు?
Telangana: పార్టీ ఫిరాయింపుల (నిరోధక) చట్టం, ఇదివరకు లేని ప్రభావం ఇప్పుడు చూపేనా? రాష్ట్ర హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఈ సందేహం తలెత్తుతోంది. ‘అది స్పీకర్ పరిధిలోని అంశం, వారికి తామేమీ నిర్దేశించజాలమ’ని ఇదివరలో చెప్పిన హైకోర్టే…. ‘మీరు తేల్చకుంటే, మేమే స్వచ్చందంగా ప్రక్రియ చేపడతాం’ అని అసెంబ్లీ కార్యదర్శికిచ్చిన తాజా ఆదేశాలు ఇందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి. చర్యలకు ఓ నాలుగువారాలు గడువిచ్చింది. చర్యలుంటాయా? గడువు దాటితే…. కోర్టు ఏం చేస్తుంది? స్పీకర్ చట్టం అమలు చేస్తే…
ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్
Varahivijayayatra: ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…
APpolitics: వైఎస్ఆర్సీపీ బాటలో కూటమి..!
APpolitics : ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం తర్వాత బలహీనపడిందని కూటమి నేతలు, కార్యకర్తలు ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన వారు పగటి కలలు కంటున్నట్టు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్చి 27వ తేదీన (గురువారం) జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ…
కారుపై పిడుగు వీడియో వైరల్!
వర్షకాలంలో పిడుగుల పడడం సర్వసాధారణం. ఈక్రమంలో ఓ చోట రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పిడుగు పడింది. ఈదృశ్యాన్ని కారు వెనకలో ప్రయాణిస్తున్న మరో కారులోని వ్యక్తి చిత్రీకరించారు. ఈఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.ప్రస్తుతం పిడుగు పడిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ అయింది. Passengers? All good. Pickup truck? Fried. Michaelle May Whalen was videoing #lightning over St. Pete last week, but she wasn’t expecting a bolt to…
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..
ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్…
Appolitics: అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళ్లాలని కోటంరెడ్డి నిర్ణయం
అమరావతి: నెల్లూరు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళ్లాలని ఆయన నిర్ణయించారు. నియోజకవర్గం లోని సమస్యల ప్ల కార్డుల ను ప్రదర్శిస్తూ వెలగపూడి లోని మారుతి సుజికీ షోరూమ్ నుండి అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్ర వెళ్లాలని కోటం రెడ్డి దృఢ నిశ్చయంతో ఉండటంతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. కాగా రెండు నెలల క్రితం కోటం రెడ్డి వైసీపీ పార్టీపై…
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..
దేశ మార్కెట్లో పసిడి ధరల్లో పెద్దగా మార్పు కనిపించకపోయినా… హైదరాబాద్, చెన్నై నగరాల్లో ధర స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక సోమవారం దేశంలో బంగారం ధరలను గమనిస్తే… దేశంలో 10 గ్రాముల 22 క్యారట్ బంగారంపై నిన్నటిలా ఈరోజు కూడా 46 వేల 220 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 47 వేల 220 రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలు చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ బంగారం 45 వేల 430…
