Headlines

మంత్రి వీడియో వైరల్ .. నెట్టింట్లో పేలుతున్న సెటైర్స్!

తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు ,అభిమానులు వివిధ జిల్లాల్లో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ పై రూపొందించిన వీడియో వాట్సప్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. మంత్రి విస్మరించిన హామీలను ఎత్తిచూపుతూ వీడియో సాంగ్ రూపొందించారు. దీంతో ప్రతిపక్ష నేతలు వీడియోపై సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు.  అయితే వీడియో ఎవరూ క్రియెట్ చేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. (వాట్సప్ సౌజన్యంతో)…

Read More

తెలంగాణ నయగారా జలపాతం అందాలకు ఫిదా..

వర్షకాలం పచ్చదనంతో ప్రకృతి పరవశిస్తోంది. ఎడతెరపిలేని వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.దీనికి తోడు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర ప్రకృతి ప్రేమికులు సందండి చేయడం పరిపాటి. తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కుటుంబతో సహా వెళ్లి సేదతీరేందుకు అనువైన ప్రదేశంలో ఒకటిగా చెప్పవచ్చు. ములుగజిల్లా వాజేడులోని బోగతా జలపాతాన్ని తెలంగాణ నయగరా జలపాతంగా పేరుంది. పాలపొంగులాటి జలపాతం అందాలను చూడటానికి వర్షకాలంలో పర్యటాకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడి సుందర…

Read More

పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రశాంతంగా ముగిశాయి: ఎస్పీ రెమా రాజేశ్వరి

 నల్లగొండ: ఎస్సై, కానిస్టేబుల్  దేహదారుడ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి అయ్యాయాని జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి  పేర్కొన్నారు.రాష్ట్ర పోలీసు నియామక మండలి నియమాల ప్రకారం  ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా..పూర్తి సాంకేతికత పరిజ్ఞానంతో  పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం  జరిగిందన్నారు. జిల్లా పోలీస్ అధికారులు..సిబ్బంది.. ఇతర సాంకేతిక నిపుల సహకారంతొ ప్రశాంతంగా దేహదారుఢ్య (ఫిజికల్ టెస్ట్స్) పరీక్షలు ముగిశాయని ఎస్పీ వెల్లడించారు. ఇక మొత్తం 26 వేల 433 మంది అభ్యర్థులకు గాను.. 23 వేల 524 మంది…

Read More

ఇంగ్లాండ్ తో సిరీస్ కు భారత జట్టు ఎంపిక !

ఇంగ్లాండ్ టూర్ కోసం కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఓపెనర్ పృథ్వి షా తోపాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదు. గాయంతో కోలుకున్న రవీంద్ర జడేజా, పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి తిరిగొచ్చారు. కాగా ఇదే జట్టును జూన్లో న్యూజిలాండ్ తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు కొనసాగించనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత…

Read More

మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…

Read More

తెనాలి నుంచి బ‌రిలో నాదెండ్ల‌.. ఆల‌పాటి ప‌రిస్థితి ఏంటి?

తెనాలి రాజ‌కీయ ర‌స‌కంద‌కాయంగా మారింది. అధికార , ప్ర‌తిప‌క్ష నేతలు నువ్వానేనా త‌ర‌హాలో త‌ల‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత ఎమ్మెల్యే బ‌త్తిని శివ‌కుమార్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో..ఓ ముఖ్య‌నేత ఇక్క‌డి నుంచి పోటిచేస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఆయ‌న ఈనియెజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన‌ట్లు ప్ర‌జ‌లు చెబుతున్నారు.ఇంత‌కు ఆనేత ఎవ‌రూ? ఇప్పుడు ఆయ‌న ఏ పార్టీ నుంచి బ‌రిలోకి దిగుతున్నారు? తెనాలి నియెజ‌క‌వ‌ర్గంలో 40 వేల కాపు..20 వేల క‌మ్మ సామాజిక ఓట్ల‌ర్లు…

Read More

ఐసీయూలో ఉన్న వైసీపీని చూస్తే జాలేస్తోంది : పవన్ కళ్యాణ్

APpolitics:‘2024లో ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు ఉండాలనే బలమైన సంకల్పంతోనే పొత్తు నిర్ణయం తీసుకున్నాంమన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. రాజ్యాధికారం అనే రక్తం మరిగిన వైసీపీ నాయకుడిని ఇంటికి పంపిచడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వైసీపీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఇప్పటికే రాష్ట్రంలో 26 లక్షల పైచిలుకు దొంగ ఓట్లు బయటపడ్డాయని తెలిపారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు…

Read More

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More
mamata modi

మోదీ ప్రమేయం లేదని విశ్వసిస్తున్నా : మమతా బెనర్జీ

ప్రధాని మోదీ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక మోదీ హస్తం ఉండకపోవచ్చని.. రాష్ట్రంలో సీబీఐ,ఈడీ దూకుడుకు కారణం స్థానిక బీజేపీ నేతలని దీదీ ఆరోపించారు.స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే కొందరు నేతలు.. సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని అంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉన్నట్టుండి మమతా బెనర్జీలో మార్పుకు కారణమేంటన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ అంత చెడ్డ‌ది కాద‌ని ప్రశంసలు…

Read More
Optimized by Optimole