కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే  నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

Telangana: నెలపాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Telangana: బీసీ కులగలను ఎస్సీ వర్గీకరణపై పెద్ద ఎత్తున నెల రోజుల పాటు గ్రామ గ్రామాన సంబరాలు జరపాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.రాష్ట్ర శాసనసభలో రెండు చారిత్రాత్మకమైన బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, విష్ణునాథ్ పాల్గొన్నారు.గత రెండు రోజులుగా అసెంబ్లీలో బిసి కులఘనన, ఎస్సీ వర్గీకరణ…

Read More

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది మాతో టచ్ లో ఉన్నారు : బండి సంజయ్

BJPTelangana: ‘‘కేసీఆర్ ఫ్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై మేం పోరాడుతుంటే…. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు . బీజేపీ కార్పొరేటర్లు మాతో టచ్ లో ఉన్నారంటూ కేసీఆర్ కొడుకు అంటున్నడు… ఆయనకు తెల్వదేమో… మాతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని’’ హెచ్చరించారు. బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని ఆయన…

Read More

సాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్

అధికార తెరాస‌కు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆస‌న్న‌మైంద‌ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజ‌య్‌ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో ‌ మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్‌ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…

Read More

సహనం నశిస్తే.. ఆటకు వీడ్కోలు పలుకుతా: ఆశ్విన్ రవిచంద్రన్

గెలుపోములు ను సమానం చూడడం మూలంగానే.. తాను అత్యుత్తమ స్థాయిలో ఉండటానికి కారణమని భారత జట్టు స్పిన్నర్ అశ్విన్ పేర్కొన్నాడు. వివాదాలను తనకి ఇష్టముండదని.. ప్రతి సారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాని యాష్ స్పష్టం చేశాడు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా గురించి రాసే కథనాలను పట్టించుకోను.. దేశంలో ఆడితే తెగ పొగిడేస్తారు.. నేను సాధారణ వ్యక్తిని.. నిరంతరం ఆటను ఆస్వాదిస్తాను అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆడటం వలన జీవితానికి అర్థం దొరికింది. ఎవరు పొగిడిన, తిట్టిన…

Read More

ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు.  అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…

Read More

పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!

2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్‌ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…

Read More

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్!

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రి తిర‌త్‌సింగ్ రావ‌త్కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో స‌న్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ద‌యచేసి ప్ర‌జ‌లంద‌రు అప్ర‌మ‌త్తంగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా ఆయ‌న మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ , హోంమంత్రి అమిత్ షాతో స‌మావేశం కావాల్సి ఉండ‌గా, భేటిని ర‌ద్దు చేశారు.

Read More
Optimized by Optimole