తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!
Nancharaiah merugumala senior journalist: కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు. మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్…
NUDE VIDEOCALL: ఓ కుటుంబం విషాదగాథ..!
విశీ: 2022 జులై. తన వాట్సాప్కి ఏదో మెసేజ్ వచ్చిందని గమనించింది శ్రుతి. ఓపెన్ చేసి చూసింది. షాక్… అందులో తన తమ్ముడు సుధీర్ న్యూడ్ ఫొటో ఉంది. ఆమెకు ఆందోళన కలిగింది. ఆ ఫొటో ఎవరు పంపారో, ఎందుకు పంపారో అర్థం కాలేదు. వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఆ తర్వాత తన తమ్ముడికి ఫోన్ చేసింది. అతను కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసింది. స్విఛాఫ్. ఇంతకీ…
యాంటీబాడీలు పెరుగుతున్నాయి:ఆరో సెరోలాజికల్ సర్వే
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొంత మేర తగ్గింది. అయితే, టీకాతో పాటు ప్రజల్లో యాంటీబాడీలు కూడా పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన ఆరో సెరోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో భాగంగా పరీక్షించిన వారిలో 90 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. తాజా సెరో సర్వే సెప్టెంబర్ చివరి వారంలో నిర్వహించబడింది. ఇందులో మొత్తం 280 సివిక్ వార్డుల నుండి 28,000 రక్త నమూనాలను సేకరించారు….
Brahmins: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..
Nancharaiah merugumala senior journalist: ‘బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం’ తేవాలన్న డిమాండుకు పెరుగుతున్న మద్దతు..గోదావరి జిల్లాల్లో పూజారులు, పురోహితులపై పెరుగుతున్న దాడులు… సామాజిక భద్రత కోసం ఉత్తరాదిన (రాజస్తాన్, హరియాణా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్) బ్రాహ్మణులు వీధుల్లో గొడ్డళ్లు చేతబూని ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఏడాది కాలంగా హిందీ రాష్ట్రాల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ జులూస్లు నిర్వహిస్తున్నారు. (బ్రామ్మల కులదేవత పరశురాముడి ఆయుధం గండ్ర గొడ్డలి) మరో పక్క తెలుగు బ్రాహ్మణులకు అనువైన నేలగా…
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…
NelloreRural: నెల్లూరు రూరల్: ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…
మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్.. కప్ గెలిచితీరుతామన్న హర్మన్..!!
మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి ఫైనల్ లో ప్రవేశించింది. టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ సెమీ…
నయా ట్రెండ్.. ఏదో మిస్సవుతున్నాం..!
దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): (” ఇదో, ఇదే మిస్సవుతున్నాం! క్రింది సంభాషణలోని సొబగు చూడండి!”) సంఘ జీవనంలోని సౌలభ్యం, సౌఖ్యమిది! ఇలా, ఒకప్పుడు ఊళ్లలో ఉండేది. ఒకప్పుడని ఎందుకంటున్నానంటే… ఇప్పుడు పల్లెటూళ్లు కూడా బాగా మారిపోయాయి. పాత రోజుల్లోలా ప్రేమలు, ఆప్యాయతలు, పరస్పర సహాయ-సహకారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. “ఇంకో గంటయితే ఇడ్వాటింటిక్ పెళ్లి కొడుకు వాళ్లొస్తారు, కమ్మరి దత్తాత్రి దగ్గర పెట్రోమాక్స్ లాంతరుంది తెచ్చావా” అనే ఇంటిపెద్ద పెద్ద స్వరం, “అమ్మనా? శాంతక్కోళ్ల ఇంట్ల ఇవాళ…
literature: ‘ఇర్లచెంగి’.. భలే భలేటి కథల మనిషి..!
సాయి వంశీ: తెలుగులో ఆడవాళ్లు తమ బాల్య జ్ఞాపకాలు కథలుగా రాయడం అరుదు. నాకు తెలిసి సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కతలు’, పొత్తూరి విజయలక్ష్మి ‘నోస్టాల్జియా’, మన్నం సిందుమాధురి ‘ఉళైనూరు క్యాంపు కతలు’ రాశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో జూపాక సుభద్ర తన బాల్య జాపకాలు రాస్తున్నారు. అలాగే కొన్ని కథల్లో ఎండపల్లి భారతక్క తన బాల్యం గురించి రాశారు. (ఇంకెవరైనా రాసి ఉంటే మెన్షన్ చేయండి). చిత్తూరు జిల్లాలో పుట్టిన ఆచార్య మహాసముద్రం దేవకి గారు…
