బూర కారు దిగడానికి మంత్రి జగదీశ్ వైఖరే కారణమా..ఇందులో నిజమెంత?

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి…

Read More

sanatandharma: ‘సనాతన ధర్మం’పై పవర్ స్టార్ లాగే ఉదయనిధి..!

Nancharaiah merugumala senior journalist: సనాతన ధర్మాన్ని డెంగీతో పోల్చిన ఉదయనిధి తల్లి దుర్గ గుడుల్లో మొక్కుతుంటే, ‘సనాతన ధర్మం’ నినాదం ఎత్తుకున్న డెప్టీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ఒరిగేదేంటో! సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని ప్రకటించి బీజేపీ, అన్నాడీఎంకే వంటి పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత,…

Read More

పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్న జనసేనాని..

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతాంగాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రి చేరుకొని.. అక్కడి నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో దెబ్బ తిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా కల్పించనున్నారు.   పలు నియోజక వర్గాల మీదుగా జనసేనాని పర్యటన సాగుతుంది. ఈ పర్యటనలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు.  

Read More

మత్స్యకార భరోసాలో అవకతవకలపై జనసేన పోరాటం: నాదెండ్ల మనోహర్

Janasena: మత్సకార భరోసా పథకం అమల్లో జరుగుతున్న అవకతవకలపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో మత్స్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ కి వినతిపత్రం సమర్పించనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.  మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార సోదరుల్లో ఆందోళన, అలజడి ఉన్నాయన్నారు. గత ఏడాది జాబితాలో ఉన్న పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా జనాభా పెరుగుతుంటే ప్రభుత్వం వద్ద ఉన్న…

Read More

APpolitics: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి: పవన్ కళ్యాణ్

APpolitics: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని, అభద్రతను…

Read More

బాక్స్ ఆఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల సునామి!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తొలిసారి అగ్రహీరోలైన ఎన్టీఆర్_ రామ్చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఇప్పటికే ప్రీమియర్స్ తో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. తొలి రోజు వసూళ్లలోనూ అదే హవా కొనసాగిస్తోంది. తొలి షో నుంచే చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తొలి రోజు…

Read More

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read More

తెలంగాణలో కొత్తగా 516 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 516 కరోనా కేసులు నమోదయ్యాయి.మహమ్మారి నుంచి 216 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 434 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇక  రాష్ట్రవ్యాప్తంగా అధికారులు గడిచిన 24 గంటల్లో 26 వేల 976 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే కొత్తగా 261 కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు…

Read More

‘ఆసియా కప్’ టోర్నీ రద్దు!

శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా  పేర్కొన్నారు.  2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో…

Read More

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటన..

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2022 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ ప్రకటించింది. గత 22 ఏళ్లుగా ఈ సంస్థ మీడియా అవార్డ్స్ ఇస్తోంది. దివంగత నటుడు  అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డ్స్ ప్రారంభించారు.  అప్పటి నుంచి శృతిలయ అవార్డ్స్ ఎంపిక కమిటీ  చైర్మన్ గా డాక్టర్ మహ్మద్ రఫీ వ్యవహరిస్తున్నారు. ఇక ఈనెల 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతి లో బెస్ట్ జర్నలిస్టులుగా ఎంపికైన వారికి..  తెలంగాణ స్పీకర్  పోచారం శ్రీనివాస్…

Read More
Optimized by Optimole