భారత టెస్టు కెప్టెన్గా రోహిత్ శర్మ..?
భారత జట్టు టెస్ట్ సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న అతనిని.. బీసీసీఐ పూర్తిస్థాయి టెస్టు సారథిగా ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. కాగా శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కి ముందే సెలెక్షన్ కమిటీ రోహిత్ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక తో భారత జట్టు 2 టెస్టులు, 3టీ_20లు ఆడనుంది….
ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!
Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. కేరళ లో లాక్ డౌన్!
దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు సైతం థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి. అందులో భాగంగానే కేరళ ప్రభుత్వం రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో కరోనాకి తోడు జికా వైరస్ విజృంభిస్తుండడంతో.. ప్రభుత్వం రెండు రోజుల…
ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్…
Castcensus: కులగణనపై మోదీ యూ-టర్న్ ఎవరికి లాభం?
Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా…
మూసీ ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత..!
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40వేల ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు తెరిచారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుడటంతో.. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1247 క్యూసెక్కులు వస్తుండగా..అవుట్ ఫ్లో 1992 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం 644.61 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వలు సామర్థ్యం 4.46…
ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!
Nancharaiah merugumala senior journalist: (ఇందిర, సంజయ్, రాజీవ్ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది!ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే!) ================== జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్ నేత నేత ఫిరోజ్ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్ లాల్ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని…
మహా శివరాత్రి వ్రత మహాత్యం!
మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది…
