మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ అటాక్..

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మాటల తూటాలు పేల్చారు. రాజగోపాల్ బీజేపీలో చేరుతున్నారన్న అక్కసుతో రేవంత్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని బీజేపీనేతలు మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రేవంత్ చేసిన ఆరోపణల వీడియో క్లిప్పింగ్స్ చూపుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. నేడు తెలంగాణ తల్లి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్ భాష మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు.  …

Read More

APNews:సన్న బియ్యం…. మధ్యాహ్న భోజన పథకంలో విప్లవం!

APpolitics: మన రాష్ట్రంలో పిల్లలకు మంచి ఆహారం, చదువు కలిపి ఇవ్వాలన్న సంకల్పంతో డొక్కా సీతమ్మ పథకం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పర్యవేక్షణలో… ఈ పథకంలో కొత్త ఒరవడి వచ్చింది. ఆ ఒరవడి పేరు సన్న బియ్యం! మధ్యాహ్నన భోజన పథకంలో పోషకాలు కలగలసిన సన్న బియ్యం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల భవిష్యత్తుకు మంచి నిర్ణయం తీసుకున్నట్లయింది. దొడ్డు బియ్యం…

Read More

*తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక స‌మ్మ‌క్క-సార‌క్క జాత‌ర‌…!!

హైద‌రాబాద్: తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అయిన స‌మ్మ‌క్క సార‌క్క వ‌న‌దేవ‌త‌ల జాతర ఖ్యాతి ఖండాంత‌రాలు దాటాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌.., పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి  అన‌సూయ సీత‌క్క‌.., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ పేర్కొన్నారు. గ‌తం కంటే ఈ సారి చాలా ఘ‌నంగా జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాల‌యం కాన్ఫ‌రెన్స్ రూంలో మేడారం మాస్టర్​…

Read More

BRS వైరస్..BJP వ్యాక్సిన్: బండి సంజయ్

BRS’ (భారత రాష్ట్ర సమితి) కార్యాలయం ఓపెనింగ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. BRS పెయింట్ ఆరకముందే… VRS అవుతుందని ఎద్దేవా చేశారు. BRS ఒక వైరస్ అయితే… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్ అన్నారు. దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండని కుండ బద్దలు కొట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర _5 ముగింపు సందర్భంగా..కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు.బిజీ…

Read More

Telangana:బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కవిత ఢిల్లీ పర్యటన?

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు రెండు…

Read More

టీఆర్పీ రేటింగ్స్ రిగ్గింగ్!

దేశవ్యాప్తంగా ప్రింట్ పత్రికల రేటింగ్స్ కి సంబంధించి ప్రతి ఏటా జరిగే గోల్మాల్ రిగ్గింగ్ విషయం అందరికి తెలిసిందే. పత్రికా సంస్థలు ఏబిసికి చెప్పే లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండదనేది కాదనే వాస్తవం. ఈ రేటింగ్స్ రిగ్గింగ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు పాకీ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రేక్షకాదరణకు కొలమానమైన టీవీ చానళ్ల టీఆర్పీ రేటింగ్స్లో బార్క్( బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) మాజీ పెద్దలు రేటింగ్స్ రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు…

Read More

జల వివాదం పై రంగంలోకి కేంద్ర జల్ శక్తి శాఖ!

తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల జగడం జరుగుతున్న క్రమంలో… కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ ఇచ్చింది. ప్రాజెక్టులకు సంబంధించి ఓ గెజిట్ను కూడా జారీ చేసింది. మరీ జల్శక్తి శాఖ ఇచ్చిన గెజిట్ ఏంటీ..? ఈ నోటిఫికేషన్పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మాట ఎలా ఉంది..? ఈ నిర్ణయంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారమైనట్లేనా..? తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదా పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న…

Read More

women’sday: హెచ్.ఎం.ఏ.టి లో అంతర్జాతీయ మహిళా దినేత్సవ వేడుకలు…!

Hyderabad: హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (హెచ్.ఎం.ఏ.టి) ఆధ్వర్యంలో డా.ఐ.యస్ మూర్తి స్మారక ఉపన్యాసాన్ని ఆదివారం సాయంత్రం హెచ్.ఎం.ఏ.టి. ఆవరణలోని జూపల్లి బాలమ్మ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు డా.గోపాలకృష్ణ స్వాగతోపన్యాసం చేసి అందరినీ ఆహ్వానించగా ప్రధాన కార్యదర్శి డా.జి.దుర్గాప్రసాద్ రావు వారు నిర్వహించి ఉచిత వైద్య సేవలతోపాటు ఇతర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డా. పెండెం భాస్కర్, ఎం. డి (హోమియో) నల్గొండ పాంక్రియాస్: నావిగేటింగ్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ లాండ్…

Read More

మంచిర్యాలలో సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి..

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల చేరుకున్న సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మంగళవారం సభా ప్రాంగణం…

Read More
Optimized by Optimole