చైతన్య స్ఫూర్తి ఆగిపోదు.. విప్లవ జ్యోతి ఆరిపోదు: పవన్ కల్యాణ్
Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి…
