పర్యాటకుల మదిదోచేస్తున్న జలపాతం.. ఇంతకు ఎక్కడుదంటే?
వర్షకాలంలో ప్రకృతి పరవశిస్తోంది. జలపాతాలు పొంగి పోర్లుతుండటంతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈక్రమంలో ఓ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఎప్పుడుప్పుడు అక్కడి వెళ్లి.. వాటర్ ఫాల్స్ అందాలను తిలకిందామా అని ఆరాటపడతారు. This is not Niagara Falls…This is Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/1C1ohXFsCn — Erik Solheim (@ErikSolheim) July 10, 2022 ఈవీడియోలో కనిపిస్తున్న జలపాతం…
శ్రీలంకపై రెండో టెస్టులో భారత్ ఘననిజయం..!
శ్రీలంక తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 447 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీం ఇండియా 238 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులో దిముత్ కరుణరత్నె సెంచరీతో రాణించగా (107).. కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో (54) మెరిశాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు.. బుమ్రా మూడు.. అక్షర్ పటేల్.. రెండు…
బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…
వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు
యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…
తెలంగాణాలో ‘బీసీ’ అస్త్రం పాచిక పారేనా ?
Telanganapolitics: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల్లో సామాజిక వర్గాలు పాచికలుగా మారుతున్నాయి. జనాభాలో 50 శాతానికిపైగా ఉన్నా రాజకీయంగా వెనుకబడి ఉన్నామనే అసంతృప్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతీసారి ఎన్నికలకు ముందు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే డిమాండ్ను వివిధ బీసీ సంఘాలు లేవనెత్తడంతోపాటు రాజకీయ పార్టీల్లోని ఆ వర్గానికి చెందిన నాయకులు కూడా డిమాండ్లు పెట్టడం సర్వసాధారణం. అయితే ఈ డిమాండ్ను ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ…
లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!
ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి…
Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి
Telangana: భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..
తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క…
review: ఇంకిపోని సంభాషణలు..!
అనూష రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ): ఈ పుస్తకంలో కథలు చాలా బాగున్నాయి. నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన కథలు “కారు చెప్పిన కథ “, “ఉర్సు”. కారు చెప్పిన కథ ఒక్క క్షణం నాకు కన్నీళ్లు పెట్టించింది…ఈ కథలో రచయిత చేపింది అక్షర సత్యం.. ఒకరి నిర్లక్ష్యం వల్ల జరిగే ఆక్సిడెంట్ చాలు ఎన్నో జీవితాల్లో,ఆశలను , వల్ల ఆశయాలను, బంధాలను, భరోసా గా ఉన్న వాళ్లను దూరం చేసి కన్నీళ్లను మిగిలిస్తుంది. ఉర్సు కథ కూడా…
