Headlines

supremecourt: చట్టం మార్పో? కొత్త చట్టమో..!

AntiDefectionAct: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించడమో, మారిన పరిస్థితుల్లో మరో పకడ్బందీ చట్టం తెచ్చుకోవడమో అనివార్యంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న చట్టం, ఇదే రూపంలో… ఆశించిన ఫలితాలిచ్చే జాడ కనిపించట్లేదు. నిర్ణయాధికారం స్పీకర్దేనని, దానికి గడువు విధించలేమని న్యాయస్థానం తేల్చడంతో… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి-బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. పిటిషన్లపై నిర్ణయం…

Read Full News

సీఎం జగన్ ‘హిట్లర్ ‘ : సుంకర ప‌ద్మ‌శ్రీ

విజ‌య‌వాడ‌: ఏపీలో వైసీపీ ఆరాచ‌క పాల‌న‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఫైర్ అయ్యారు.ప్రజా సమస్యలపై పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి నేడు పాదయాత్ర, నిరసనలకు అడ్డు తగులడం శోచ‌నీయ‌మ‌న్నారు. ప్రజా సమస్యలను చెపితే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. జగన్ కు బుద్ధి చెప్పాలంటే ఛలో అసెంబ్లీ కచ్చితంగా నిర్వహించి తీరాలని తేల్చిచెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక గన్నవరం లో మహిళ టీచర్స్ ను దారుణంగా…

Read Full News

కశ్మీర్​ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే విడిచిపెట్టే ప్రసక్తే లేదు_ అమిత్ షా

జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు కేంద్ర హోమంత్రి అమిత్ షా. జమ్మూలో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం.. ఆర్టికల్ 370ని రద్దు కారణంగా కశ్మీర్​లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం…

Read Full News

మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.  …

Read Full News

టీఆర్ ఎస్ నేత‌లు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు..

కేసీఆర్ ప్ర‌భుత్వం కూలిపోయే స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని బీజేపీ నేత విజ‌య‌శాంతి అన్నారు. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా కేసీఆర్ క‌ళ్ల‌లో భ‌యం క‌న్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత‌లకు, కేసీఆర్తో ర‌హ‌స్య ఒప్ప‌దం ఉంద‌ని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరార‌ని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వ‌ల్ల తెలంగాణ రాలేద‌ని, ఎంతోమంది ప్రాణత్యాగాల వ‌ల‌న తెలంగాణ సాకార‌మైంద‌ని గుర్తుచేశారు. హ‌లియా ముఖ్య‌మంత్రి స‌భ‌పై…

Read Full News

APpolitics : పాత కథే.. సరి ‘కొత్త’ పాత్రలతో..

APpolitics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ఇదంతా ‘జగన్నా’టకమని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ తెలుగునాట ఇది కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం… అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి! పాండవులు రాజ్యం కోసం పోరాడారు. ఆపదలో ఉన్న పాండవుల కోసం వారి…

Read Full News

లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శానిటైజేషన్ ప్రోగ్రాం..

Rajannasirisilla: వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు . జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ ప్రేమ్  కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటైజేశన్ ప్రోగ్రాం చేపట్టారు. వాటర్ ట్యాంక్ క్లీనింగ్, క్లోరో స్కోప్ టెస్ట్ వంటి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ కవిత తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని.. ఏదైనా…

Read Full News

తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పై ఏ బ్రాహ్మణ నేతా నోరుపారేసుకోలేదు!

Nancharaiah Merugumala (senior journalist): ––––––––––––––––––––––––––––––––––––––––––––– గుజరాతీ క్షత్రియుడి కూతురు, రాజస్తానీ రాజపుత్రుడి భార్య అంటే ‘భయభక్తులు’! ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– తొలి ఆదివాసీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘నోరిజారి’ రాష్ట్రపత్ని అని రెండుసార్లు అన్నందుకు లోక్‌ సభలో కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరీ క్షమాపణ చెప్పేశారు. శుక్రవారం ఆయన కొత్త రాష్ట్రపతికి లేఖ రాయడంతో వివాదం ముగిసింది. పాలకపక్షం బీజేపీ కోరుతున్నట్టు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా క్షమాపణ చెప్పే అవకాశాలు లేవు. బీజేపీ మహిళా ఎంపీలు…

Read Full News
Optimized by Optimole