యూపీ లో జికా వైరస్ కలకలం..!

యూపీ కాన్పుర్​లో జికా వైరస్ ​వ్యాప్తి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు.

Read More

Kerala: 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం

Nancharaiah merugumala senior journalist: రేవంత్ రెడ్డేమో మోదీని మొన్న పెద్దన్న అని పొగిడితే ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ మాజీ సీఎంలు బీజేపీలో చేరిపోయారు: కేరళ సీఎం విజయన్  ‘‘బీజేపీలోకి ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు చేరిపోయారు. ఇంకెందరు హస్తం పార్టీ మాజీ సీఎంలు బీజేపీలో జొరబడతారు? ఎవ్వరూ ఈ విషయంపై జోస్యం చెప్పలేరు. మీరెవరైనా చెప్పగలరా? ఇదీ కాంగ్రెస్‌ పరిస్థితి. మరోపక్క మొన్నీమధ్య హైదరాబాద్ వచ్చిన బీజీపీ ప్రధాని నరేంద్రమోడీని…

Read More

AP: ధాన్యం కొనుగోలులో పారదర్శకతకు నిదర్శనం కూటమి ప్రభుత్వం: మంత్రి నాదెండ్ల

తెనాలి, జూలై 10: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, దేశంలోనే ఆదర్శంగా నిలిచే విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపుల ప్రక్రియను అమలు చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.రైతుల పట్ల రాజకీయ కక్ష సాధింపు సరికాదు ఒక పార్టీ అధినేత గతంలో మనిషిని తొక్కించారని, నేడు రైతులు పండించిన మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘ప్రశ్నించే ధైర్యం ఉంటే, చర్చకు రండి’’ అంటూ నాదెండ్ల సవాల్ విసిరారు. తెనాలిలోని తన…

Read More

మునుగోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సంజయ్ లేఖ.. ఇరకాటంలో టీఆర్ఎస్..!!

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా  స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన  హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More

భగవంతుడిని ఆరాధించేందుకు భక్తి మార్గాలు..

భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం భగవంతుని పూజించడానికి భక్తి మార్గాలు.. శ్రవణ భక్తి: సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనా భక్తి: భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప…

Read More

బక్రీద్ త్యాగానికి ప్రతీక: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బక్రీద్ పర్వదినం సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి.. ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ అని అన్నారు. ఆదివారం పట్టణంలోని ఈద్గ సందర్శించి  ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెప్తుందన్నారు ఎమ్మెల్యే .జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని  మానవాళికి ఇస్తుందని…

Read More
Optimized by Optimole