రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌..

Nancharaiah merugumala: (senior journalist) రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌ రాహుల్‌ గాంధీ వయసు–52 సంవత్సరాలు అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు పెళ్లి కూడా ఇంకా కాలేదు..! కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్‌ ఈమధ్యనే చెప్పారు తొలి ప్రధాని జవాహర్‌ నెహ్రూకు రాహుల్‌ మునిమనవడు మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్‌ భయ్యా మనవడు ఆరో ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన కొడుకు ఆయన…

Read More

‘సన్ రైజర్స్’ ఆరో ఓటమి!

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా ఆరో ఓటమిని చవిచూసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో ఆజట్టు 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(124; 64 బంతుల్లో 11×4, 8×6) శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(48; 33 బంతుల్లో 4×4, 2×6)…

Read More

Moviereview: బాల్యం తాలూకు జ్ఞాపకాల కలయిక ‘ కమిటీ కుర్రాళ్లు ‘…!

committee kurrollu review:  మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలిచిత్రం క‌మిటీ కుర్రోళ్లు. య‌దువంశీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈచిత్రంలో ఒక‌రిద్ద‌రూ మిన‌హా ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా నూత‌న నటీన‌టుల కావ‌డం విశేషం. యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈమూవీ సినీ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం..! క‌థ‌; గోదావ‌రి జిల్లాలోని మారుముల ప్రాంతం పురుషోత్తంప‌ల్లి. అక్క‌డ 12 ఏళ్ల‌కు ఒక‌సారి జ‌రిగే బ‌రింకాల‌మ్మ త‌ల్లి జాత‌రను ప్ర‌జ‌లు అంగ‌రంగ వైభవంగా జ‌రుపుతారు. జాత‌ర‌లో భాగంగా…

Read More

మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్.. కప్ గెలిచితీరుతామన్న హర్మన్..!!

మహిళల ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్ ఫైనల్ పోరులో  థాయ్ లాండ్ జట్టును మట్టి కరిపించి  ఫైనల్ లో ప్రవేశించింది.  టోర్నీ ఆసాంతం మెరుగైన ప్రదర్శన చేసిన హార్మన్ సేన 8 వ సారి ఫైనల్ చేరిన జట్టుగా  రికార్డుల్లోకెక్కింది. ఈనేపథ్యంలో  మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ జట్టు ప్రదర్శన.. తన ఆటతీరు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక హర్మన్ ప్రీత్ సెమీ…

Read More

TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read More

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం. ఈ ఆలయంలోని అమ్మవారిని రాత్రి పూట పూజించడం ఇక్కడి ప్రత్యేకత.అసలు అమ్మవారిని రాత్రి పూట మాత్రమే ఎందుకు పూజిస్తారు? ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉదయం వేళల్లో పూజలు జరిపిస్తే ఏమవుతుంది? కాశీని కాపాడే గ్రామదేవతగా ఉగ్రవారహి అమ్మవారిని అక్కడి ప్రజలు కొలుస్తారు. ఈ అమ్మవారిని ఉదయం…

Read More

‘శ్రావణా మాసం’ పై కవియిత్రి ప్రత్యేక రచన..

శ్రావణా మాసాన శుభ శుక్రవారాన సిరులు కురిపించుమా శ్రీలక్ష్మి దేవీ పాలసంద్రములోన పుట్టినా తల్లీ విష్ణువు హృదయాన వెలసినా రాణీ చల్లని చంద్రికలు జాలువారిన భువిని వెండి తళతళకాంతి వేల్పు తోబుట్టువు మాబతుకులలోన పండు వెన్నెల కురిసి సుఖ శాంతులివ్వుమాశరదిందుచంద్రికా కామధేనువు, కల్ప వృక్షములతోడుత కోరికలు తీర్చు మాకనక మహాలక్ష్మీ ధాన్యసంపదలిచ్చు,విద్యా ధైర్యము నిచ్చు ఆదిలక్ష్మి వైమమ్ము ఆదుకోవమ్మా ఆరోగ్యమానంద మిచ్చు ధన్వంతరీ వేల్పు తోబుట్టువు గాన రోగబాధలు బాపు వరములిచ్చి వేగ వారిజాక్షిరో నీవు మాజన్మ…

Read More
Optimized by Optimole