Headlines

తీరుమారని ముంబై..లఖ్నవూ చేతిలో ఓటమి!

ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్​ రాత మారలేదు. శనివారం లఖ్​నవూ చేతిలో జరిగిన ఆరో మ్యాచ్లోనూ ముంబై జట్టు18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​ చేసిన లఖ్​నవూ.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో 199 పరుగులు చేసింది. మనీశ్ పాండే, క్వింటన్ డికాక్ ఫర్వాలేదనిపించారు. ముంబయి బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. మురుగన్ అశ్విన్, ఫేబియన్ అలెన్ తలా ఓ…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

బీసీ లపై సీఎం కేసిఆర్ సవతి ప్రేమ:మేకపోతుల నరేందర్

సీఎం కేసీఆర్ కు బీసీ విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ తగదని హెచ్చరించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్. పోలీస్ అర్హత పరీక్షలో కట్ఆఫ్ మార్కులు sc,st విద్యార్థులతో సమానంగా బీసీ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గించకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో trs భారీమూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. బీసీ విద్యార్థులు పోలీస్ కొలువులు చేయడం.. సీఎం కేసీఆర్ కి ఇష్టం లేదా అని ప్రశ్నించారు నరేందర్….

Read More

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్..

ఉత్కంఠగా సాగిన హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ మొత్తం ముగిశాక..వీవీప్యాడ్‌ల తరలింపులో అధికారులు…నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాగా స్ట్రాంగ్ రూమ్‌లకు వెళ్లాల్సిన వీవీ ప్యాట్లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేవలం డబ్బు ఉన్నవాళ్లే రాజకీయం చేసే పరిస్థితులు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వీవీ ప్యాట్ల తరలింపుపై.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్…

Read More

Vishakhapatnam: ‘ బేబి ‘ మూవీ తరహలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. బాలిక సూసైడ్

విశాఖపట్నం: బేబి సినిమా తరహాలో రియల్ ట్రయాంగిల్ లవ్ స్టొరీ నడిపిన  బాలిక  కథ చివరకి  విషాదాంతమయ్యింది. పట్టణంలో ఇంటర్ విద్యార్థిని (17) ఒకే సమయంలో సాయికుమార్ (23), సూర్య ప్రకాష్ (25) అనే ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోనే ప్రియుడు సాయి కుమార్ తో రహస్యంగా తాలి కట్టించుకుంది. అనంతరం సూర్య ప్రకాష్ తో సైతం ప్రేమాయణం నడిపింది. ఈ సమయంలో బాలిక పెళ్లికి సంబంధించిన వీడియో , సూర్య ప్రకాష్ తో…

Read More

సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర రాష్ట్రాలలో బలోపేతం కావాలంటే ఆ పార్టీకి వచ్చే సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాన 2023 చివరిలో తెలంగాణ, 2024లో లోక్‌సభ ఎన్నికలతో…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు. రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా…

Read More

కోటంరెడ్డి వెంటే జ‌నం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడ‌ర్‌…

నెల్లూరు: నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ రాజ‌కీయం కాక‌రేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌టికి వ‌చ్చాకా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు పేరిట ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైవుతున్నారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కి తోడు .. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. సామ ,దాన‌,భేద దండోపాయ‌లు ఉప‌యోగించి ప్ర‌భుత్వం కార్పొరేట‌ర్లు,నేత‌ల‌ను అటు వైపు లాగేసుకున్న‌.. ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ క్యాడ‌ర్ ‘నీవెంటే మేము’ త‌ర‌హాలో మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చూస్తుంటే .. ఈసారి…

Read More

క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు ‘ మిస్టర్ ఐపీఎల్ ‘ రిటైర్మెంట్..

భారత క్రికెట్ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘మిస్టర్ ఐపీఎల్ ‘ సురేష్ రైనా క్రికెట్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్నీ రైన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించాడు.దేశానికి.. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని.. తనకు ఎల్లవేళలా అండగా నిలిచిన  బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి .. రాజీవ్‌ శుక్లా సర్‌కి.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రైనా ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఇక 2020…

Read More

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. సాధారణ బియ్యాన్ని దశల వారీగా కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.సీఎం కేసిఆర్ ధాన్యం, బియ్యం విషయంలో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువుగా బియ్యం కొంటుందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని.. కేరళలోనూ వాడకం తగ్గినందున్న అబియ్యాన్ని కొనలేమని…

Read More
Optimized by Optimole