పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!

పంజాబ్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్‌ షూటర్‌ అమిత్​షా ట్రయాంగిల్​ స్కెచ్ వేశారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్‌సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్‌ల…

Read Full News

Tollywood: ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది?

Nancharaiah merugumala senior journalist: కడప, కర్నూలు రెడ్డి ఫ్యాక్షన్‌ రాజకీయ కుటుంబాల అల్లుళ్లకు హైదరాబాద్‌ బౌన్సర్ల అవసరం ఎందుకొచ్చింది? ఏ టీవీ చానలూ చెప్పదేంటి? వేలాది మంది కాదు, లక్షలాది మంది అభిమానులున్న సినీ నటులు మంచు మోహన్‌ బాబు, అతని ఇద్దరు కొడుకులు విష్ణువర్ధన్‌ బాబు, మనోజ్‌ కుమార్‌ మధ్య ఏదో కీచులాటుల కారణంగా వాళ్ల ఇళ్ల కాడ ఆత్మరక్షణ కోసం దాదాపు 100 మంది దాకా బౌన్సర్లను రప్పించారని తెలుగు టీవీ చానళ్లు…

Read Full News

రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి: సంకినేని వెంకటేశ్వర్ రావు

కోదాడ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. కోదాడ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమా కార్నర్ మీటింగ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని…హత్యలు, అక్రమాలు ,దౌర్జన్యాలతో రాష్ట్రం నలిగిపోతుందని…

Read Full News

ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది. గతంలో కంటే అతని నికర ఆదాయం 4 శాతం($5.5 బిలియన్లు) పెరిగినట్లు జాబితా వెల్లడించింది. దాంతో అదానీ అమెజాన్ జెఫ్ బెజోస్‌ను స్థానాన్ని అధిగమించి రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.అతని కంటే ముందు…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 135 మంది కోలుకున్నారు. మహమ్మరి తో ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదుకాగా..కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయనగరం జిల్లాలో కేవలం ఒక్క…

Read Full News

అదరగొట్టిన ‘పుష్ప’ రాజ్!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా గురించి బన్నీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఎప్పటిలాగే ఐకాన్ స్టార్ మాస్ నట విశ్వరూపం చూపించారు. ట్రైలర్ చివరలో.. ఈ లోకం నీకు తుపాకీ ఇచ్చింది.. నాకు గొడ్డలి ఇచ్చింది.. ఎవడి యుద్ధం వాడిదే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్…

Read Full News

విద్యా సంస్థలకు తాత్కాలిక సెలవు : విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు తాత్కాలిక సెలవు ప్రకటిస్తున్నట్లు  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనసభలో ఆమె ప్రకటన చేశారు. ‘‘దేశంలో మరోమారు కరోనా వ్యాప్తి చెందుతోంది. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో  కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదీ ఇలాగే కొనసాగితే కరోనా…

Read Full News
Optimized by Optimole