TTD: తెలంగాణ లేఖలు తిరస్కరణ.. ఇదేంటి గోవిందా..!!

TTD:  తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు అంగీకరించక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈప్ర‌క‌ట‌న తో తెలంగాణకి చెందిన శ్రీవారి భ‌క్తులు.. సిఫార్సు లేఖలతో టీటీడీ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు వాటిని ఆమోదించకపోవడంతో ఆందోళ‌నకు గుర‌వుతున్నారు. మరోవైపు లేఖ‌ల అనుమ‌తిపై ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసినా.. టీటీడీ బోర్డు సమావేశంలో ఇంకా…

Read More

Annacanteen: అన్న క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక..!

Peoples pulse: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘‘అన్న క్యాంటీన్ పథకం’’ పై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. కేవలం 5 రూపాయిలకే భోజనం అందిస్తున్న ఈ ‘‘అన్న క్యాంటీన్స్’’ పనితీరుపై పీపుల్స్ పల్స్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పలు అన్న క్యాంటీన్లను సందర్శించి, సమీక్షించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు నివేదికలో పేర్కొంది. టీడీపీ 2019లో అధికారం కోల్పోవడంతో అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ…

Read More

Hindudharma: అనంత శ్రీరామ్‌ ప్రసంగం విన్నాక హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది!

Nancharaiah merugumala senior journalist: పాటల రచయిత అనంత శ్రీరామ్‌ ‘హైందవ శంఖారావం’ ప్రసంగం విన్నాక పశ్చిమ గోదావరి సినీ కాపులే సనాతన హిందూ ధర్మాన్ని కాపాడతారేమోననిపిస్తోంది! తెలుగు సినిమాల్లో హిందూ ధర్మం మీద దాడి జరుగుతోందని ‘హైందవ శంఖారావం’ సభలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించడం లేదు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్‌ (వీఎచ్‌పీ) ఈ సభ నిర్వహించింది. అన్ని రాజకీయ పక్షాల్లో పనిచేసిన…

Read More

PawanKalyan: నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే: పవన్ కళ్యాణ్

Vijayawada:  ‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ…

Read More

Tragicstory: ప్రార్థనలు చేస్తే ప్రాణాలు నిలుస్తాయా?

విశీ(వి.సాయివంశీ) : ఆ పాప పేరు భవ్యశ్రీ. వయసు 8 ఏళ్లు. తనది నెల్లూరు జిల్లా. కొన్నాళ్లుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంది. రెండు నెలల క్రితం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేశాక తెలిసింది తనకు బ్రెయిన్ ట్యూమర్ అని. రూ.లక్షలు ఖర్చు పెడితే తప్ప పాప బతకదని డాక్టర్లు తేల్చేశారు. తల్లిదండ్రులు కలవరపడ్డారు. వాళ్లదేమైనా కలిగిన ఇల్లా, లక్షలు తేవడానికి? భవ్యతోపాటు మరో కూతురు, కొడుకు ఉన్నారు వాళ్లకి. అంతంతమాత్రం సంసారం. కానీ…

Read More

‘వ్యూహా’ల పరుగులో ‘చిత్త’వుతున్న రాజకీయం..!

Political strategists: రాజకీయపార్టీల బాగుకు వ్యూహకర్తలు, వ్యూహసంస్థలు కావాలా? దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి బలపడుతోంది. ఏమాత్రం ప్రభావాల అంచనా (ఇంపాక్ట్ అసెస్మెంట్) లేకుండా సాగే ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతోంది. పుట్టగొడుగుల్లా వ్యూహ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సోషల్మీడియా వేదికల్ని అతిగా వాడుతూ, అసలు జనాభిప్రాయం మరుగుపరుస్తూ రాజకీయ వాతావరణ కాలుష్యం చేస్తున్నారు. ఆకర్షణీయ నినాదాల జిత్తులు, దృష్టి మళ్లింపు ఎత్తులు, వాణిజ్య మెళుకువలు, వ్యాపార చిట్కాలు… వంటి మార్కెట్ మాయలొచ్చి…

Read More

pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

Nancharaiah merugumala senior journalist: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు? ఆ ‘పాపమే’ ఉమ్మడి ఏపీని 62 ఏళ్లకు చంపేసిందా? దేశ రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రం రాజస్థాన్‌కు చెందిన తోటి వైశ్య ప్రముఖులు బిర్లాలు నిర్మించిన భవన ప్రాంగణంలో జాతిపిత మోహన్‌దాస్‌ కే గాంధీని 1948 జనవరి 30న హిందూ మతోన్మాదులే హత్యచేశారనేది మెజారిటీ భారతీయుల నమ్మకం..అప్పటికి ఐదేళ్ల తర్వాత దక్షిణాది మహానగరం మద్రాసులో కాంగ్రెస్‌ బ్రాహ్మణ నేత బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆత్మత్యాగానికి…

Read More

Jagansharmila: ప్రియాంక, రాహుల్‌ను చూసి జగన్, షర్మిల కొంతైనా నేర్చుకోవద్దా..?

Nancharaiha merugumala (Senior journalist):  గురువారం(ఈరోజు)  ‘ఈనాడు’ మొదటి పేజీ కింది వార్త ‘తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన జగన్‌’ అనే వార్త. దాని కిందే ‘జగనన్నా..ఇంత అన్యాయమా!’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రెండో రాజకీయ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వైఎస్‌ షర్మిలమ్మ ఆవేదనతో కూడిన లేఖ వార్త. ఇదే పేపరు లోపలి పేజీలో ‘రాజకీయాల్లో నాకు 35 ఏళ్ల అనుభవం’ అంటూ భారత జాతీయ ప్రథమ రాజకీయ కుటుంబంలో ఆడబిడ్డ ప్రియాంకా గాంధీ వాడ్రా చెప్పిన మాటలతో మరో…

Read More

EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?

Nancharaiah merugumala senior journalist: హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే? తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని…

Read More

PawanKalyan: నారాయణ నామ జపం.. గుండెల నిండుగా భక్తి భావం.. తిరుమలకు పవన్..!

PawanKalyan:  సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  దీక్ష విరమణ నిమిత్తం కాలి నడకన తిరుమల చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం అలిపిరి శ్రీవారి పాదాలకు మొక్కి సాధారణ భక్తులతో కలసి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకు చేరుకున్నారు. ప్రతి అడుగు భక్తి భావంతో వేసిన పవన్ మోకాళ్లపై ప్రణమిల్లి పవిత్రమైన మెట్లకు మొక్కుతూ ముందుకు కదిలారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నుంచి…

Read More
Optimized by Optimole